Movie News

రాజమౌళి నిరాశని నాగార్జున తీర్చిన వేళ

అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఇవాళ రాజమౌళి అతిధిగా నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు కార్యక్రమంలో పాలు పంచుకోగా జక్కన్న చెప్పిన అనుభవం ఆశ్చర్యపరిచింది. ఆర్ఆర్ఆర్ ని డాల్బీ విజన్ టెక్నాలజీలో మార్చాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక ఇండియాలో లేదని తెలిసి ట్రిపులార్ బృందం జర్మనీకి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చింది. ఇంత గ్రాండియర్ తీసినా స్వంత దేశంలో ఇలాంటి సౌకర్యం లేకపోవడం చూసి రాజమౌళి నిరాశ చెందారు. ఇప్పుడు హైదరాబాద్ కే వచ్చేసింది.

సాధారణ 4Kతో పోలిస్తే డాల్బీ విజన్ నాణ్యత, సౌండ్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. స్క్రీన్ మీద ప్రతి డీటెయిల్ స్పష్టంగా కనిపిస్తుంది. తల వెంట్రుకల మీద చివరి అంచును కూడా క్రిస్టల్ క్లియర్ గా చూడొచ్చు. రంగులు సహజత్వంతో ఉండి సినిమాలో సందర్భానికి తగ్గట్టు వాటికి మరింత అందం తీసుకొస్తాయి. ఒక్కసారి చేయిస్తే శాశ్వతంగా ఆ ప్రింట్ ఉండిపోతుంది. రాజమౌళినే కాదు చాలా మంది ఫిలిం మేకర్స్ డాల్బీ విజన్ కోసం ఇతర దేశాలకు వెళ్లొస్తున్నారు. బడ్జెట్ భారమైన వాళ్ళు రాజీపడిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ వేదిక కావడంతో అందరూ ఇక్కడికే వస్తారు.

రాజమౌళి చేస్తున్న మహేష్ బాబు 29 పనులు ఇక్కడే జరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ ప్రత్యేకమైన ఫుటేజ్ ని ఈ సందర్భంగా స్క్రీనింగ్ చేయడం విశేషం. డాల్బీ లాబరేటరీ పర్యవేక్షణ, సహకారంతో కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటికే సినిమా స్క్రీనింగ్ లో పలు విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో నాగార్జున వేసిన ముందడుగు మెచ్చుకోదగినదే. అయితే డాల్బీ విజన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి కెమెరాలను సపోర్ట్ చేస్తుందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే ఈటీవీ విన్ కిరణ్ అబ్బవరం కని డాల్బీ విజన్ లో విడుదల చేసింది.

This post was last modified on January 11, 2025 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

3 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago