అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఇవాళ రాజమౌళి అతిధిగా నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు కార్యక్రమంలో పాలు పంచుకోగా జక్కన్న చెప్పిన అనుభవం ఆశ్చర్యపరిచింది. ఆర్ఆర్ఆర్ ని డాల్బీ విజన్ టెక్నాలజీలో మార్చాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక ఇండియాలో లేదని తెలిసి ట్రిపులార్ బృందం జర్మనీకి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చింది. ఇంత గ్రాండియర్ తీసినా స్వంత దేశంలో ఇలాంటి సౌకర్యం లేకపోవడం చూసి రాజమౌళి నిరాశ చెందారు. ఇప్పుడు హైదరాబాద్ కే వచ్చేసింది.
సాధారణ 4Kతో పోలిస్తే డాల్బీ విజన్ నాణ్యత, సౌండ్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. స్క్రీన్ మీద ప్రతి డీటెయిల్ స్పష్టంగా కనిపిస్తుంది. తల వెంట్రుకల మీద చివరి అంచును కూడా క్రిస్టల్ క్లియర్ గా చూడొచ్చు. రంగులు సహజత్వంతో ఉండి సినిమాలో సందర్భానికి తగ్గట్టు వాటికి మరింత అందం తీసుకొస్తాయి. ఒక్కసారి చేయిస్తే శాశ్వతంగా ఆ ప్రింట్ ఉండిపోతుంది. రాజమౌళినే కాదు చాలా మంది ఫిలిం మేకర్స్ డాల్బీ విజన్ కోసం ఇతర దేశాలకు వెళ్లొస్తున్నారు. బడ్జెట్ భారమైన వాళ్ళు రాజీపడిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ వేదిక కావడంతో అందరూ ఇక్కడికే వస్తారు.
రాజమౌళి చేస్తున్న మహేష్ బాబు 29 పనులు ఇక్కడే జరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ ప్రత్యేకమైన ఫుటేజ్ ని ఈ సందర్భంగా స్క్రీనింగ్ చేయడం విశేషం. డాల్బీ లాబరేటరీ పర్యవేక్షణ, సహకారంతో కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటికే సినిమా స్క్రీనింగ్ లో పలు విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో నాగార్జున వేసిన ముందడుగు మెచ్చుకోదగినదే. అయితే డాల్బీ విజన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి కెమెరాలను సపోర్ట్ చేస్తుందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే ఈటీవీ విన్ కిరణ్ అబ్బవరం కని డాల్బీ విజన్ లో విడుదల చేసింది.
This post was last modified on January 11, 2025 10:15 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…