Movie News

రాజమౌళి నిరాశని నాగార్జున తీర్చిన వేళ

అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఇవాళ రాజమౌళి అతిధిగా నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు కార్యక్రమంలో పాలు పంచుకోగా జక్కన్న చెప్పిన అనుభవం ఆశ్చర్యపరిచింది. ఆర్ఆర్ఆర్ ని డాల్బీ విజన్ టెక్నాలజీలో మార్చాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక ఇండియాలో లేదని తెలిసి ట్రిపులార్ బృందం జర్మనీకి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చింది. ఇంత గ్రాండియర్ తీసినా స్వంత దేశంలో ఇలాంటి సౌకర్యం లేకపోవడం చూసి రాజమౌళి నిరాశ చెందారు. ఇప్పుడు హైదరాబాద్ కే వచ్చేసింది.

సాధారణ 4Kతో పోలిస్తే డాల్బీ విజన్ నాణ్యత, సౌండ్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. స్క్రీన్ మీద ప్రతి డీటెయిల్ స్పష్టంగా కనిపిస్తుంది. తల వెంట్రుకల మీద చివరి అంచును కూడా క్రిస్టల్ క్లియర్ గా చూడొచ్చు. రంగులు సహజత్వంతో ఉండి సినిమాలో సందర్భానికి తగ్గట్టు వాటికి మరింత అందం తీసుకొస్తాయి. ఒక్కసారి చేయిస్తే శాశ్వతంగా ఆ ప్రింట్ ఉండిపోతుంది. రాజమౌళినే కాదు చాలా మంది ఫిలిం మేకర్స్ డాల్బీ విజన్ కోసం ఇతర దేశాలకు వెళ్లొస్తున్నారు. బడ్జెట్ భారమైన వాళ్ళు రాజీపడిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ వేదిక కావడంతో అందరూ ఇక్కడికే వస్తారు.

రాజమౌళి చేస్తున్న మహేష్ బాబు 29 పనులు ఇక్కడే జరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ ప్రత్యేకమైన ఫుటేజ్ ని ఈ సందర్భంగా స్క్రీనింగ్ చేయడం విశేషం. డాల్బీ లాబరేటరీ పర్యవేక్షణ, సహకారంతో కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటికే సినిమా స్క్రీనింగ్ లో పలు విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో నాగార్జున వేసిన ముందడుగు మెచ్చుకోదగినదే. అయితే డాల్బీ విజన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి కెమెరాలను సపోర్ట్ చేస్తుందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే ఈటీవీ విన్ కిరణ్ అబ్బవరం కని డాల్బీ విజన్ లో విడుదల చేసింది.

This post was last modified on January 11, 2025 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సిద్ధు మీద నిర్మాతకు కంప్లైంట్.. తీరా చూస్తే

యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ‌కు యూత్‌లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్‌ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ…

2 hours ago

బిజినెస్‌‌మేన్ చూసి బుక్ చించేసిన రాజమౌళి

మహేష్ బాబు కెరీర్లో పవర్ ఫుల్ హిట్లలో ‘బిజినెస్‌మేన్’ ఒకటి. ‘పోకిరి’ తర్వాత పూరితో మహేష్ చేసిన ఈ సినిమాకు…

2 hours ago

ఆసుపత్రి పాలైన అలేఖ్య చిట్టి

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…

2 hours ago

జగన్ నోట మళ్లీ అదే మాట… పోలీసులపై వైసీపీ అధినేత ఫైరింగ్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా…

2 hours ago

తిలక్ రిటైర్డ్ ఔట్ పై క్లారిటీ ఇచ్చేసిన హార్దిక్

ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 12 పరుగుల…

3 hours ago

పవన్ కొడుకు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి.. బాబు, లోకేశ్ ల స్పందన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…

3 hours ago