ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా చెప్పారో రిలీజ్ కు ముందు చూశాం. తీరా ఇవాళ గేమ్ ఛేంజర్ థియేటర్లలో ఆ పాట లేదు. నిన్నటి దాకా ఈ విషయం బయటికి చెప్పలేదు కానీ ప్రీమియర్లు మొదలైన కాసేపటికే సమాచారమిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల మెరుగైన క్వాలిటీ కోసం ఆలస్యమయ్యిందని, జనవరి 14 నుంచి జోడిస్తామని ప్రకటించారు. గత ఏడాది దేవరలో దావూదికి కూడా అచ్చం ఇలాగే జరిగింది. ముందు లెన్త్ కోసం వద్దనుకుని ఓ పది రోజుల తర్వాత యాడ్ చేయడం కొంత మేర మంచి ఫలితమిచ్చింది.
కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు ఆ అవకాశం ఫస్ట్ హాఫ్ లోనే ఉంది. కానీ నిడివి దృష్ట్యా ఇప్పుడు హైరానాని జోడిస్తే అది టాక్ పరంగా మరింత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. నిజానికి హైరానా చాలా ఖరీదైన పాట. అరుదైన విదేశీ లొకేషన్లలో భారీ బడ్జెట్ తో షూట్ చేశారు. జరగండి జరగండి తర్వాత అంత ఖర్చు పెట్టింది దీనికే. మ్యూజిక్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయిన ఛార్ట్ బస్టర్. రామ్ చరణ్, కియారా అద్వానీల కెమిస్ట్రీ బాగా కుదిరిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. తీరా చూస్తే తెరమీద లేకపోవడం కొంత నిరాశ పరిచే విషయమే. ఇంకో నాలుగు రోజులు ఆగితే కానీ మళ్ళీ చూసే ఛాన్స్ లేదు.
ఏది ఏమైనా ప్యాన్ ఇండియా సినిమాలు ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్త వహించాలి. లేకపోతే ఫ్యాన్స్ అసంతృప్తిని చవి చూడాల్సి వస్తుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం దాని ఎఫెక్ట్ మాములుగా ఉండదు. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ స్టేటస్ మీద ఇప్పుడే ఒక అంచనాకు రాలేకపోయినా ప్రస్తుతమున్న స్పందన చూస్తుంటే ఇంకా మెరుగుపడాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో ముందుగా రావడం వల్ల థియేటర్లు, షోలు భారీగా దక్కించుకున్న గేమ్ ఛేంజర్ వాటికి సార్ధకత చేకూరాలంటే కనీసం రెండు వారాల పాటు బలమైన రన్ కొనసాగించాలి. పోటీలో ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on January 10, 2025 1:11 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…