తలా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే అజిత్ ఏడాదికి ఒక సినిమా చేయడమే మహా గగనం. అలాంటిది కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు ప్యాన్ ఇండియా మూవీస్ వస్తాయంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10 విడుదల లాక్ చేస్తూ ఇటీవలే అధికార ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి పొంగల్ కు వద్దామనుకుంటే విడాముయార్చి కోసం వాయిదా వేసుకున్నారు. తీరా చూస్తే అది కూడా పోస్ట్ పోన్ కావడంతో విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ నిర్ణయం మార్చుకోలేక కొత్త డేట్ చూసుకున్నారు. ఇప్పుడో కొత్త ట్విస్ట్ వచ్చింది.
తాజాగా విడాముయార్చి సెన్సార్ పూర్తి చేసుకుంది. రెండున్నర గంటల నిడివితో యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. జనవరి నెలాఖరు రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచన జరుగుతోంది. దాదాపు ఖరారైనట్టేనని చెన్నై టాక్. అదే జరిగితే దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీకి మధ్య చాలా తక్కువ గ్యాప్ వస్తుంది. కానీ కోలీవుడ్ ఎగ్జిబిటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ఎందుకంటే అజిత్ లాంటి పెద్ద రేంజ్ హీరో ఒకేసారి రెండు సినిమాలతో వస్తే భవిష్యత్తులో ఎక్కువ గ్యాప్ వస్తుంది. అసలే విజయ్ రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు. భవిష్యత్తులో తిరిగి వస్తాడో రాడో గ్యారెంటీ లేదు. ఎవరూ చెప్పలేరు.
రజనీకాంత్ ప్రస్తుతమున్న స్పీడ్ కొనసాగిస్తారో లేదో తెలియదు. అలాంటిది అజిత్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తే మళ్ళీ ఎప్పుడు దర్శనం జరుగుతుందోనని ఫాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతానికి దీనికి పరిష్కారం లేదు. అయితే విడాముయార్చికి గుడ్ బ్యాడ్ అగ్లీ మీద ఉన్నంత బజ్ లేదు. టీజర్ చూశాక పెద్దగా అంచనాలు నెలకొనలేదు. అందుకే వాయిదా వేసి తర్వాత రిలీజ్ చేయమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు చేసినా జనం చూసేవారు. ఇప్పుడు రెండు వచ్చినా సరే బయ్యర్లు టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. కాలమహిమ.
This post was last modified on January 9, 2025 5:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…