తలా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే అజిత్ ఏడాదికి ఒక సినిమా చేయడమే మహా గగనం. అలాంటిది కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు ప్యాన్ ఇండియా మూవీస్ వస్తాయంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10 విడుదల లాక్ చేస్తూ ఇటీవలే అధికార ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి పొంగల్ కు వద్దామనుకుంటే విడాముయార్చి కోసం వాయిదా వేసుకున్నారు. తీరా చూస్తే అది కూడా పోస్ట్ పోన్ కావడంతో విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ నిర్ణయం మార్చుకోలేక కొత్త డేట్ చూసుకున్నారు. ఇప్పుడో కొత్త ట్విస్ట్ వచ్చింది.
తాజాగా విడాముయార్చి సెన్సార్ పూర్తి చేసుకుంది. రెండున్నర గంటల నిడివితో యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. జనవరి నెలాఖరు రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచన జరుగుతోంది. దాదాపు ఖరారైనట్టేనని చెన్నై టాక్. అదే జరిగితే దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీకి మధ్య చాలా తక్కువ గ్యాప్ వస్తుంది. కానీ కోలీవుడ్ ఎగ్జిబిటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ఎందుకంటే అజిత్ లాంటి పెద్ద రేంజ్ హీరో ఒకేసారి రెండు సినిమాలతో వస్తే భవిష్యత్తులో ఎక్కువ గ్యాప్ వస్తుంది. అసలే విజయ్ రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు. భవిష్యత్తులో తిరిగి వస్తాడో రాడో గ్యారెంటీ లేదు. ఎవరూ చెప్పలేరు.
రజనీకాంత్ ప్రస్తుతమున్న స్పీడ్ కొనసాగిస్తారో లేదో తెలియదు. అలాంటిది అజిత్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తే మళ్ళీ ఎప్పుడు దర్శనం జరుగుతుందోనని ఫాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతానికి దీనికి పరిష్కారం లేదు. అయితే విడాముయార్చికి గుడ్ బ్యాడ్ అగ్లీ మీద ఉన్నంత బజ్ లేదు. టీజర్ చూశాక పెద్దగా అంచనాలు నెలకొనలేదు. అందుకే వాయిదా వేసి తర్వాత రిలీజ్ చేయమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు చేసినా జనం చూసేవారు. ఇప్పుడు రెండు వచ్చినా సరే బయ్యర్లు టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. కాలమహిమ.
This post was last modified on January 9, 2025 5:51 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…