‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్బస్టర్లతో విజయ్ దేవరకొండ మాంచి ఊపు మీద ఉండగా.. అతడికి బ్రేకులేసిన చిత్రం ‘నోటా’. విజయ్ కెరీర్లో చేసిన వేస్ట్ సినిమాల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఈ చిత్రంతో అతను తమిళంలోకి కూడా అడుగు పెట్టాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఎంతమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాను రూపొందించింది యువ దర్శకుడు ఆనంద్ శంకర్.
‘అరిమా నంబి’ (తెలుగులో డైనమైట్గా రీమేక్ అయింది) లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విక్రమ్తో ‘ఇరు ముగన్’ (ఇంకొక్కడు)’ అనే డిజాస్టర్ అందించాడు. ఆ తర్వాత ‘నోటా’ సైతం డిజాస్టరే అయింది. దీంతో ఇక అతడికి పేరున్న హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టమే అనుకున్నారంతా. కానీ అతను ఇద్దరు స్టార్లతో క్రేజీ మల్టీస్టారర్కు రంగం సిద్ధం చేయడం విశేషం.
ఇంతకుముందు బాలా దర్శకత్వంలో ‘అవన్-ఇవన్’ (వాడు-వీడు) అనే మల్టీస్టారర్ చేసిన విశాల్, ఆర్య.. ఆనంద్ శంకర్ కొత్త చిత్రంలో హీరోలుగా నటించనున్నారట. విశాల్ పాజిటివ్ క్యారెక్టర్ చేయనుండగా.. ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ‘గద్దలకొండ గణేష్’లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన మృణాళిని రవి ఇందులో కథానాయికగా నటించనుందట.
భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం విశాల్ ‘చక్ర’ను విడుదలకు రెడీ చేస్తున్నాడు. అది జీ-5లో విడుదల కాబోతోంది. దాని తర్వాత మిస్కిన్ మధ్యలో వదిలేసిన ‘తుప్పరివాలన్’ సీక్వెల్ను స్వీయ దర్వకత్వంలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆనంద్ శంకర్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆర్య కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు.
This post was last modified on October 14, 2020 4:47 pm
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…
తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…
జాతిరత్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయిక.. ఫరియా అబ్దుల్లా. థియేటర్ బ్యాగ్రౌండ్ నుంచి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అటవీశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన ఒకే ఒక్క ఆలోచన.. 5…
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…