‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్బస్టర్లతో విజయ్ దేవరకొండ మాంచి ఊపు మీద ఉండగా.. అతడికి బ్రేకులేసిన చిత్రం ‘నోటా’. విజయ్ కెరీర్లో చేసిన వేస్ట్ సినిమాల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఈ చిత్రంతో అతను తమిళంలోకి కూడా అడుగు పెట్టాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఎంతమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాను రూపొందించింది యువ దర్శకుడు ఆనంద్ శంకర్.
‘అరిమా నంబి’ (తెలుగులో డైనమైట్గా రీమేక్ అయింది) లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విక్రమ్తో ‘ఇరు ముగన్’ (ఇంకొక్కడు)’ అనే డిజాస్టర్ అందించాడు. ఆ తర్వాత ‘నోటా’ సైతం డిజాస్టరే అయింది. దీంతో ఇక అతడికి పేరున్న హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టమే అనుకున్నారంతా. కానీ అతను ఇద్దరు స్టార్లతో క్రేజీ మల్టీస్టారర్కు రంగం సిద్ధం చేయడం విశేషం.
ఇంతకుముందు బాలా దర్శకత్వంలో ‘అవన్-ఇవన్’ (వాడు-వీడు) అనే మల్టీస్టారర్ చేసిన విశాల్, ఆర్య.. ఆనంద్ శంకర్ కొత్త చిత్రంలో హీరోలుగా నటించనున్నారట. విశాల్ పాజిటివ్ క్యారెక్టర్ చేయనుండగా.. ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ‘గద్దలకొండ గణేష్’లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన మృణాళిని రవి ఇందులో కథానాయికగా నటించనుందట.
భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం విశాల్ ‘చక్ర’ను విడుదలకు రెడీ చేస్తున్నాడు. అది జీ-5లో విడుదల కాబోతోంది. దాని తర్వాత మిస్కిన్ మధ్యలో వదిలేసిన ‘తుప్పరివాలన్’ సీక్వెల్ను స్వీయ దర్వకత్వంలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆనంద్ శంకర్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆర్య కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు.
This post was last modified on October 14, 2020 4:47 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…