Movie News

డిజాస్టర్ డైరెక్టర్.. క్రేజీ మల్టీస్టారర్

‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్‌బస్టర్లతో విజయ్ దేవరకొండ మాంచి ఊపు మీద ఉండగా.. అతడికి బ్రేకులేసిన చిత్రం ‘నోటా’. విజయ్ కెరీర్లో చేసిన వేస్ట్ సినిమాల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఈ చిత్రంతో అతను తమిళంలోకి కూడా అడుగు పెట్టాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఎంతమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాను రూపొందించింది యువ దర్శకుడు ఆనంద్ శంకర్.

‘అరిమా నంబి’ (తెలుగులో డైనమైట్‌గా రీమేక్ అయింది) లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విక్రమ్‌తో ‘ఇరు ముగన్’ (ఇంకొక్కడు)’ అనే డిజాస్టర్ అందించాడు. ఆ తర్వాత ‘నోటా’ సైతం డిజాస్టరే అయింది. దీంతో ఇక అతడికి పేరున్న హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టమే అనుకున్నారంతా. కానీ అతను ఇద్దరు స్టార్లతో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేయడం విశేషం.

ఇంతకుముందు బాలా దర్శకత్వంలో ‘అవన్-ఇవన్’ (వాడు-వీడు) అనే మల్టీస్టారర్ చేసిన విశాల్, ఆర్య.. ఆనంద్ శంకర్ కొత్త చిత్రంలో హీరోలుగా నటించనున్నారట. విశాల్ పాజిటివ్ క్యారెక్టర్ చేయనుండగా.. ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ‘గద్దలకొండ గణేష్’లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన మృణాళిని రవి ఇందులో కథానాయికగా నటించనుందట.

భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం విశాల్ ‘చక్ర’ను విడుదలకు రెడీ చేస్తున్నాడు. అది జీ-5లో విడుదల కాబోతోంది. దాని తర్వాత మిస్కిన్ మధ్యలో వదిలేసిన ‘తుప్పరివాలన్’ సీక్వెల్‌ను స్వీయ దర్వకత్వంలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆనంద్ శంకర్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆర్య కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

3 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

4 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

4 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

5 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

5 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

6 hours ago