‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్బస్టర్లతో విజయ్ దేవరకొండ మాంచి ఊపు మీద ఉండగా.. అతడికి బ్రేకులేసిన చిత్రం ‘నోటా’. విజయ్ కెరీర్లో చేసిన వేస్ట్ సినిమాల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఈ చిత్రంతో అతను తమిళంలోకి కూడా అడుగు పెట్టాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఎంతమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాను రూపొందించింది యువ దర్శకుడు ఆనంద్ శంకర్.
‘అరిమా నంబి’ (తెలుగులో డైనమైట్గా రీమేక్ అయింది) లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విక్రమ్తో ‘ఇరు ముగన్’ (ఇంకొక్కడు)’ అనే డిజాస్టర్ అందించాడు. ఆ తర్వాత ‘నోటా’ సైతం డిజాస్టరే అయింది. దీంతో ఇక అతడికి పేరున్న హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టమే అనుకున్నారంతా. కానీ అతను ఇద్దరు స్టార్లతో క్రేజీ మల్టీస్టారర్కు రంగం సిద్ధం చేయడం విశేషం.
ఇంతకుముందు బాలా దర్శకత్వంలో ‘అవన్-ఇవన్’ (వాడు-వీడు) అనే మల్టీస్టారర్ చేసిన విశాల్, ఆర్య.. ఆనంద్ శంకర్ కొత్త చిత్రంలో హీరోలుగా నటించనున్నారట. విశాల్ పాజిటివ్ క్యారెక్టర్ చేయనుండగా.. ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ‘గద్దలకొండ గణేష్’లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన మృణాళిని రవి ఇందులో కథానాయికగా నటించనుందట.
భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం విశాల్ ‘చక్ర’ను విడుదలకు రెడీ చేస్తున్నాడు. అది జీ-5లో విడుదల కాబోతోంది. దాని తర్వాత మిస్కిన్ మధ్యలో వదిలేసిన ‘తుప్పరివాలన్’ సీక్వెల్ను స్వీయ దర్వకత్వంలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆనంద్ శంకర్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆర్య కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు.
This post was last modified on October 14, 2020 4:47 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…