సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాదు. కానీ కొన్ని రోజుల కిందట తాను ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘హరికథ: సంభవామి యుగే యుగే’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘‘వాడెవడో ఎర్రచందనం దొంగ హీరో’’ అంటూ పుష్ప సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ వివాదాస్పదమైంది.
నిజానికి మారిన ట్రెండ్ గురించి వివరిస్తూ తాను నెగెటివ్ షేడ్స్ చేసిన సినిమాల గురించి కూడా ప్రస్తావిస్తూ రాజేంద్ర ప్రసాద్ ఈ కామెంట్ చేశాడు. కానీ ఆయన అల్లు అర్జున్ను టార్గెట్ చేశాడంటూ కొందరు దీన్ని వివాదంగా మార్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నారు. తాను లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘షష్ఠిపూర్తి’కి సంబంధించిన ఈవెంట్లో ఈ విషయంపై ఆయన మాట్లాడారు.
తన వ్యాఖ్యలను వక్రీకరించి వివాదంగా మార్చారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను హీరోగా నటించిన అప్పుల అప్పారావు, పేకాట పాపారావు, ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమాలను కూడా ప్రస్తావించి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు హీరోలుగా మారడం గురించి తాను చెప్పానని.. అంతే తప్ప ఎవరినీ టార్గెట్ చేయలేదని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. తాను ఇటీవల అల్లు అర్జున్ను కలిశానని.. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో నెగెటివ్గా ఆర్టికల్స్ రాస్తున్న, పోస్టులు పెడుతున్న వారి గురించి మాట్లాడుకుని నవ్వుకున్నామని ఆయన చెప్పారు.
ఈ సంగతిలా ఉంచితే తనకింకా పద్మ పురస్కారం రాకపోవడం గురించి ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తనకు పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదో తనకు తెలియదని.. కానీ ఈ విషయమై ఒకసారి రామోజీ రావు అన్న మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని ఆయన చెప్పాను. తనకు పద్మశ్రీ వచ్చిందా అని గతంలో రామోజీ రావు అడిగారని.. లేదని చెబితే, అందుకు ఫీలవ్వాల్సిన అవసరం లేదని, పద్మశ్రీ పురస్కారం కంటే తన ప్రతిభ గొప్పదని ఆయన అన్నారని.. అప్పట్నుంచి ఈ అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశానని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…