ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ తారల మీద చూపించే ప్రభావం కొన్నిసార్లు మాములుగా ఉండదు. పర్సనల్ గా తీసుకుని బాధ పడే దాకా వెళ్తుంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి అనుభవాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. వెంకటేష్ మాజీ ప్రియురాలిగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికరమైన కబుర్లు పంచుకుంటోంది. అందులో తన ఆలోచన విధానాన్ని మార్చేసిన ట్రోలింగ్ ఘటన గురించి చెప్పుకొచ్చింది. గత ఏడాది ఆమె విజయ్ గోట్ లో నటించిన సంగతి తెలిసిందే. కానీ అది పేరుకు బదులు రివర్స్ లో ట్రోలింగ్ తెచ్చింది.
గోట్ లో విజయ్ కొడుకు పాత్రని ఏఐ వాడి సృష్టించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తనకు జోడిగానే మీనాక్షి చౌదరి నటించింది. పెద్డగా ప్రాధాన్యం లేకుండా ఈజీగా విజయ్ చేతిలోనే చచ్చిపోయే పేలవమైన క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఇది చూసిన కొందరు నెటిజెన్లు తనను అకారణంగా టార్గెట్ చేసి బాధపెట్టారట. ఇది ఏ దశకు చేరుకుందంటే మీనాక్షి చౌదరి ఏకంగా డిప్రెషన్ కు లోనయ్యేంత. ఇలా కుమిలిపోతున్న టైంలో లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ ఒక్కసారిగా జాతకం మార్చేసింది. అందులో దుల్కర్ సల్మాన్ భార్యగా పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కి సూపర్ హిట్ కొట్టేసింది.
అప్పుడు కానీ మీనాక్షి చౌదరికి రిలీఫ్ దక్కలేదు. ఆ తర్వాత మట్కా, మెకానిక్ రాకీలు ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ ప్రస్తుతం తన ఆశలన్నీ సంక్రాంతికి వస్తున్నాం మీద ఉన్నాయి. ఎప్పటి నుంచో కలగంటున్న పోలీస్ ఆఫీసర్ పాత్ర దక్కడం పట్ల తన ఆనందం మాములుగా లేదు. ప్రమోషన్లలో ఇదే చెప్పుకుంటూ మురిసిపోతోంది. ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటించినప్పటికీ మీనాక్షికి మంచి స్కోప్ దక్కింది. ట్రైలర్ లో కనిపించింది కూడా. నవీన్ పోలిశెట్టితో జట్టు కట్టిన అనగనగా ఒక రాజు మీద చాలా ఆశలు పెట్టుకుంది. సితార బ్యానర్ కావడంతో కంటెంట్, బడ్జెట్ రెండింటిలోనూ కాంప్రోమైజ్ ఉండదు.
This post was last modified on January 8, 2025 4:57 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…