ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ తారల మీద చూపించే ప్రభావం కొన్నిసార్లు మాములుగా ఉండదు. పర్సనల్ గా తీసుకుని బాధ పడే దాకా వెళ్తుంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి అనుభవాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. వెంకటేష్ మాజీ ప్రియురాలిగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికరమైన కబుర్లు పంచుకుంటోంది. అందులో తన ఆలోచన విధానాన్ని మార్చేసిన ట్రోలింగ్ ఘటన గురించి చెప్పుకొచ్చింది. గత ఏడాది ఆమె విజయ్ గోట్ లో నటించిన సంగతి తెలిసిందే. కానీ అది పేరుకు బదులు రివర్స్ లో ట్రోలింగ్ తెచ్చింది.
గోట్ లో విజయ్ కొడుకు పాత్రని ఏఐ వాడి సృష్టించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తనకు జోడిగానే మీనాక్షి చౌదరి నటించింది. పెద్డగా ప్రాధాన్యం లేకుండా ఈజీగా విజయ్ చేతిలోనే చచ్చిపోయే పేలవమైన క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఇది చూసిన కొందరు నెటిజెన్లు తనను అకారణంగా టార్గెట్ చేసి బాధపెట్టారట. ఇది ఏ దశకు చేరుకుందంటే మీనాక్షి చౌదరి ఏకంగా డిప్రెషన్ కు లోనయ్యేంత. ఇలా కుమిలిపోతున్న టైంలో లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ ఒక్కసారిగా జాతకం మార్చేసింది. అందులో దుల్కర్ సల్మాన్ భార్యగా పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కి సూపర్ హిట్ కొట్టేసింది.
అప్పుడు కానీ మీనాక్షి చౌదరికి రిలీఫ్ దక్కలేదు. ఆ తర్వాత మట్కా, మెకానిక్ రాకీలు ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ ప్రస్తుతం తన ఆశలన్నీ సంక్రాంతికి వస్తున్నాం మీద ఉన్నాయి. ఎప్పటి నుంచో కలగంటున్న పోలీస్ ఆఫీసర్ పాత్ర దక్కడం పట్ల తన ఆనందం మాములుగా లేదు. ప్రమోషన్లలో ఇదే చెప్పుకుంటూ మురిసిపోతోంది. ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటించినప్పటికీ మీనాక్షికి మంచి స్కోప్ దక్కింది. ట్రైలర్ లో కనిపించింది కూడా. నవీన్ పోలిశెట్టితో జట్టు కట్టిన అనగనగా ఒక రాజు మీద చాలా ఆశలు పెట్టుకుంది. సితార బ్యానర్ కావడంతో కంటెంట్, బడ్జెట్ రెండింటిలోనూ కాంప్రోమైజ్ ఉండదు.
This post was last modified on January 8, 2025 4:57 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…