Movie News

బాలయ్యకి జై లవకుశ చాలా ఇష్టం – బాబీ

ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తేలేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. అసలు తారక్ పేరు, ఫోటో కానీ ఉండకూడదని ముందే నిర్వాహకులు అతిథులకు చెప్పినట్టుగా వచ్చిన వార్తలు బలంగా తిరిగాయి.

కొందరు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎడిటింగ్ లో ఆ ఫుటేజ్ తీసేశారని పబ్లిసిటీ చేయడంతో రకరకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు. ఫైనల్ గా మొన్న నిర్మాత నాగవంశీ, ఇవాళ బాబీ ప్రెస్ మీట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు.

డాకు మహారాజ్ మీడియా మీట్ లో బాబీ ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ మీరు అనుకున్నంత డ్రామా అక్కడ జరగలేదని, స్లయిడ్స్ లో చూపించిన ఫోటోల గురించి మాట్లాడుకున్నాం తప్పించి ఇంకే ఇతర ఉద్దేశం లేదని చెప్పారు.

బ్రేక్ టైంలో నాగవంశీ, బాలకృష్ణ మాట్లాడుకున్నప్పుడు తారక్ టాపిక్ వచ్చిందని, అయితే ఆన్ రికార్డు ఉండవు కాబట్టి మీకు ఆధారం చూపించలేమని అన్నారు. అంతే కాదు బాలకృష్ణకు జై లవకుశ చాలా ఇష్టమని, పలు సందర్భాల్లో తనతో వ్యక్తిగతంగా అన్నారని వివరణ ఇచ్చారు. ఇక్కడిదాకా మబ్బులు తొలగినట్టేనని బాలయ్య అభిమానులు సంతోషపడుతున్నారు.

బాబీ దర్శకత్వం వహించిన సినిమాల పిక్స్ అన్నీ చూపించి ఒక జై లవకుశనే మర్చిపోవడం వల్ల ఇంత తంటా వచ్చింది. కొందరు తారక్ ఫ్యాన్స్ ఏకంగా డాకు మహారాజ్ ని చూడమని ఎక్స్ లో శపధాలు చేయడం దీని వల్ల కలిగిన పరిణామమే. సో ఫైనల్ గా శుభం కార్డు పడిందనే అనుకోవాలి.

జనవరి 12 విడుదల కాబోతున్న డాకు మహారాజ్ సితార బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ఒకటి. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేయగా వివిధ గెటప్స్ లో బాలయ్య బాడీ లాంగ్వేజ్ ఆసక్తి రేపుతోంది. రెండో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కి ఇది శ్రీకారం చుడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.

This post was last modified on January 7, 2025 6:44 pm

Share
Show comments

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

14 hours ago