ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తేలేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. అసలు తారక్ పేరు, ఫోటో కానీ ఉండకూడదని ముందే నిర్వాహకులు అతిథులకు చెప్పినట్టుగా వచ్చిన వార్తలు బలంగా తిరిగాయి.
కొందరు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎడిటింగ్ లో ఆ ఫుటేజ్ తీసేశారని పబ్లిసిటీ చేయడంతో రకరకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు. ఫైనల్ గా మొన్న నిర్మాత నాగవంశీ, ఇవాళ బాబీ ప్రెస్ మీట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు.
డాకు మహారాజ్ మీడియా మీట్ లో బాబీ ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ మీరు అనుకున్నంత డ్రామా అక్కడ జరగలేదని, స్లయిడ్స్ లో చూపించిన ఫోటోల గురించి మాట్లాడుకున్నాం తప్పించి ఇంకే ఇతర ఉద్దేశం లేదని చెప్పారు.
బ్రేక్ టైంలో నాగవంశీ, బాలకృష్ణ మాట్లాడుకున్నప్పుడు తారక్ టాపిక్ వచ్చిందని, అయితే ఆన్ రికార్డు ఉండవు కాబట్టి మీకు ఆధారం చూపించలేమని అన్నారు. అంతే కాదు బాలకృష్ణకు జై లవకుశ చాలా ఇష్టమని, పలు సందర్భాల్లో తనతో వ్యక్తిగతంగా అన్నారని వివరణ ఇచ్చారు. ఇక్కడిదాకా మబ్బులు తొలగినట్టేనని బాలయ్య అభిమానులు సంతోషపడుతున్నారు.
బాబీ దర్శకత్వం వహించిన సినిమాల పిక్స్ అన్నీ చూపించి ఒక జై లవకుశనే మర్చిపోవడం వల్ల ఇంత తంటా వచ్చింది. కొందరు తారక్ ఫ్యాన్స్ ఏకంగా డాకు మహారాజ్ ని చూడమని ఎక్స్ లో శపధాలు చేయడం దీని వల్ల కలిగిన పరిణామమే. సో ఫైనల్ గా శుభం కార్డు పడిందనే అనుకోవాలి.
జనవరి 12 విడుదల కాబోతున్న డాకు మహారాజ్ సితార బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ఒకటి. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేయగా వివిధ గెటప్స్ లో బాలయ్య బాడీ లాంగ్వేజ్ ఆసక్తి రేపుతోంది. రెండో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కి ఇది శ్రీకారం చుడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…