Movie News

బాలయ్యకి జై లవకుశ చాలా ఇష్టం – బాబీ

ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తేలేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. అసలు తారక్ పేరు, ఫోటో కానీ ఉండకూడదని ముందే నిర్వాహకులు అతిథులకు చెప్పినట్టుగా వచ్చిన వార్తలు బలంగా తిరిగాయి.

కొందరు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎడిటింగ్ లో ఆ ఫుటేజ్ తీసేశారని పబ్లిసిటీ చేయడంతో రకరకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు. ఫైనల్ గా మొన్న నిర్మాత నాగవంశీ, ఇవాళ బాబీ ప్రెస్ మీట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు.

డాకు మహారాజ్ మీడియా మీట్ లో బాబీ ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ మీరు అనుకున్నంత డ్రామా అక్కడ జరగలేదని, స్లయిడ్స్ లో చూపించిన ఫోటోల గురించి మాట్లాడుకున్నాం తప్పించి ఇంకే ఇతర ఉద్దేశం లేదని చెప్పారు.

బ్రేక్ టైంలో నాగవంశీ, బాలకృష్ణ మాట్లాడుకున్నప్పుడు తారక్ టాపిక్ వచ్చిందని, అయితే ఆన్ రికార్డు ఉండవు కాబట్టి మీకు ఆధారం చూపించలేమని అన్నారు. అంతే కాదు బాలకృష్ణకు జై లవకుశ చాలా ఇష్టమని, పలు సందర్భాల్లో తనతో వ్యక్తిగతంగా అన్నారని వివరణ ఇచ్చారు. ఇక్కడిదాకా మబ్బులు తొలగినట్టేనని బాలయ్య అభిమానులు సంతోషపడుతున్నారు.

బాబీ దర్శకత్వం వహించిన సినిమాల పిక్స్ అన్నీ చూపించి ఒక జై లవకుశనే మర్చిపోవడం వల్ల ఇంత తంటా వచ్చింది. కొందరు తారక్ ఫ్యాన్స్ ఏకంగా డాకు మహారాజ్ ని చూడమని ఎక్స్ లో శపధాలు చేయడం దీని వల్ల కలిగిన పరిణామమే. సో ఫైనల్ గా శుభం కార్డు పడిందనే అనుకోవాలి.

జనవరి 12 విడుదల కాబోతున్న డాకు మహారాజ్ సితార బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ఒకటి. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేయగా వివిధ గెటప్స్ లో బాలయ్య బాడీ లాంగ్వేజ్ ఆసక్తి రేపుతోంది. రెండో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కి ఇది శ్రీకారం చుడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.

This post was last modified on January 7, 2025 6:44 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago