Movie News

నయనతారతో ‘చంద్రముఖి’ గొడవ ఉత్తిదే…

గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లో నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ విడుదల సమయంలో ఆమెకు, నటుడు నిర్మాత ధనుష్ కు ఎంత వివాదం రేగిందో చూశాం. నానుమ్ రౌడీ తాన్ కంటెంట్ వాడుకునే విషయంలో వ్యవహారం కోర్టుకు వెళ్లగా అతన్ని తీవ్రంగా విమర్శిస్తూ నయన్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు దుమారం రేపాయి.

తన కెరీర్ ప్రారంభం నుంచి పెళ్లి దాకా గంటన్నర వీడియోలో మొత్తం చెప్పాలనుకున్న నయనతార ఆలోచన ఆశించిన అద్భుతాలు చేయలేకపోయినా ధనుష్ వేసిన కేసు వల్ల ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనేది చెన్నై వర్గాల కథనం. ఇక్కడితో అయిపోలేదు.

కొద్దిరోజుల క్రితం చంద్రముఖి నిర్మాతలు తమ ఫుటేజ్ ని డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు గాను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారనే వార్త మీడియా వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టింది. నయన్ కు మరో తలనొప్పి వచ్చిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు.

తీరా చూస్తే అదంతా ఉత్తిదేనని తెలిసింది. షూటింగ్ టైంలోనే చంద్రముఖి నిర్మాతలైన శివాజీ ప్రొడక్షన్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (నిరభ్యంతర పత్రం) తీసుకున్న నయనతార బృందం వాళ్ళ అనుమతితోనే కొన్ని విజువల్స్ వాడుకుంది. అవే ఫెయిరీ టెయిల్ లో కనిపించాయి. అంతే తప్ప పుకార్లలో చెప్పుకున్నట్టు ఎలాంటి నష్టపరిహారం డిమాండ్ చేయలేదు.

అయినా చంద్రముఖి నిర్మాత సీనియర్ నటుడు ప్రభు. తన తండ్రి పేరు మీద స్థాపించిన బ్యానర్ నుంచి అవసరం లేని వివాదాలు కోరి తెచ్చుకునే ఉద్దేశంలో లేరు. పైగా కొన్ని సెకండ్ల వీడియోల కోసం అంత రాద్ధాంతం ఎందుకు చేస్తారని, అడగ్గానే సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.

ఏదైతేనేం కథ సుఖాంతం అయ్యింది కానీ ధనుష్ తో రచ్చ మాత్రం ఇంకా క్లైమాక్స్ కు వచ్చినట్టు లేదు. ఇన్ని కాంట్రావర్సీలు, డిస్కషన్లు జరిగినా సదరు డాక్యుమెంటరీ మాత్రం ఆన్ లైన్ సెన్సేషన్ కాలేకపోయింది. డ్రామా లేని నటీనటుల ప్రైవేట్ జీవితాల మీద ప్రేక్షకుల ఆసక్తి తక్కువగానే ఉంటుంది.

This post was last modified on January 7, 2025 1:25 pm

Share

Recent Posts

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

2 hours ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

2 hours ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

3 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

4 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

4 hours ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

4 hours ago