Movie News

‘బాలీవుడ్’ కౌంటర్లపై నాగవంశీ వివరణ

ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, నటీనటులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో.. బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌తో వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.

బాలీవుడ్ కొన్నేళ్లుగా బాంద్రా-జుహు మధ్య స్ట్రక్ అయిపోయిందని.. టాలీవుడ్ మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి భారీ హిట్లతో దూసుకెళ్తోందని.. పుష్ప-2 ఒక్క రోజులో 86 కోట్ల వసూళ్లు సాధించిన రోజు బాలీవుడ్ వాళ్లెవ్వరికీ నిద్ర పట్టి ఉండదని వ్యాఖ్యానించాడు నాగవంశీ. ఈ వ్యాఖ్యలు కొంచెం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బాలీవుడ్ ఫిలిం మేకర్స్.. నాగవంశీ మీద ఆన్ లైన్ లో యుద్ధం ప్రకటించారు. సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా తదితరులు నాగవంశీ మీద విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలపై ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ వివరణ ఇచ్చాడు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని అతనన్నాడు.

తాను గత కొన్నేళ్లుగా ఏం జరుగుతోందన్నది మాత్రమే వివరించానని నాగవంశీ స్పష్టం చేశాడు. అంతకుమించి ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని తాను మాట్లాడలేదని అన్నాడు. తాను షారుఖ్ ఖాన్‌కు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పిన నాగవంశీ.. రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలను కూడా అమితంగా అభిమానిస్తానని చెప్పాడు. తనకు నిర్మాత కావడానికి పెద్ద ఇన్‌స్పిరేషనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అని అతను తెలిపాడు.

దర్శకుడిగా కరణ్ తొలి చిత్రం ‘కుచ్ కుచ్ హోతా’ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యానని.. ఎప్పటికైనా ఇంత రిచ్‌గా, ఆకర్షణీయంగా సినిమా తీయాలి అనే ఫాంటసీ తనలో ఏర్పడిందని.. అలాంటిది తాను బాలీవుడ్‌ను కావాలని కించపరచడం లాంటిది ఏమీ లేదని నాగవంశీ స్పష్టం చేశాడు.

This post was last modified on January 7, 2025 10:21 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

58 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago