ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.. ఓ వివాదంలో చిక్కుకున్నాడు. వివిధ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, నటీనటులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో.. బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్తో వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.
బాలీవుడ్ కొన్నేళ్లుగా బాంద్రా-జుహు మధ్య స్ట్రక్ అయిపోయిందని.. టాలీవుడ్ మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి భారీ హిట్లతో దూసుకెళ్తోందని.. పుష్ప-2 ఒక్క రోజులో 86 కోట్ల వసూళ్లు సాధించిన రోజు బాలీవుడ్ వాళ్లెవ్వరికీ నిద్ర పట్టి ఉండదని వ్యాఖ్యానించాడు నాగవంశీ. ఈ వ్యాఖ్యలు కొంచెం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ ఫిలిం మేకర్స్.. నాగవంశీ మీద ఆన్ లైన్ లో యుద్ధం ప్రకటించారు. సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా తదితరులు నాగవంశీ మీద విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలపై ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ వివరణ ఇచ్చాడు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని అతనన్నాడు.
తాను గత కొన్నేళ్లుగా ఏం జరుగుతోందన్నది మాత్రమే వివరించానని నాగవంశీ స్పష్టం చేశాడు. అంతకుమించి ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని తాను మాట్లాడలేదని అన్నాడు. తాను షారుఖ్ ఖాన్కు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పిన నాగవంశీ.. రణబీర్ కపూర్, దీపికా పదుకొనేలను కూడా అమితంగా అభిమానిస్తానని చెప్పాడు. తనకు నిర్మాత కావడానికి పెద్ద ఇన్స్పిరేషనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అని అతను తెలిపాడు.
దర్శకుడిగా కరణ్ తొలి చిత్రం ‘కుచ్ కుచ్ హోతా’ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానని.. ఎప్పటికైనా ఇంత రిచ్గా, ఆకర్షణీయంగా సినిమా తీయాలి అనే ఫాంటసీ తనలో ఏర్పడిందని.. అలాంటిది తాను బాలీవుడ్ను కావాలని కించపరచడం లాంటిది ఏమీ లేదని నాగవంశీ స్పష్టం చేశాడు.
This post was last modified on January 7, 2025 10:21 am
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…