ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. మనకే థియేటర్లు సరిపోవయ్యా అంటే హక్కులు కొనేశామనే కారణంతో ఏదోలా రిలీజ్ చేసే నిర్మాతలు కనిపిస్తూనే ఉంటారు.
అయితే గత ఏడాది, ఇప్పుడీ 2025 ఈ ట్రెండుకు బ్రేక్ వేశాయి. 2024 జనవరిలో గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్ తలపడటంతో వేరేవాటికి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో అదే టైంలో వద్దామనుకున్న అనువాదాలు కెప్టెన్ మిల్లర్, అయలాన్ వాయిదా వేసుకున్నాయి. వాటిలో ఒకటి నెలాఖరుకు వచ్చింది.
ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతోంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం తక్కువ గ్యాప్ లో ఎలాంటి బాదరబందీ లేకుండా ప్రశాంతంగా బరిలో దిగుతున్నాయి. మూడు సినిమాలే కాబట్టి సరిపడా స్క్రీన్లు సర్దటంలో డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు.
దిల్ రాజు అందుకే కూల్ గా కనిపిస్తున్నారు. కానీ గతంలో ఇలాంటి సీన్ లేదు. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, కళ్యాణం కమనీయం లాంటి స్ట్రెయిట్ మూవీస్ ఉన్నా విజయ్ వారసుడు, అజిత్ తెగింపులు ఇక్కడ స్పేస్ దక్కించుకున్నాయి. ఫలితాల సంగతి పక్కనపెడితే పరస్పరం వసూళ్లు ప్రభావితం చెందాయి.
అంతకు ముందు 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2లు ఉన్నా పేటకు థియేటర్ల తక్కువయ్యాయని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్ బొమ్మ కాబట్టి ఏదోలా సర్దుబాటు జరిగింది.
ఈసారి అలాంటి గోల లేకుండా దిగుతున్నారు కనక రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఈ అవకాశాన్ని ఫుల్లుగా వాడుకోవాలి. టాక్ పాజిటివ్ వస్తే చాలు కనీసం రెండు వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడతాయి. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ప్రీ రిలీజ్ బజ్ ఇంచుమిందు అన్నింటికి ఒకేలా కనిపిస్తున్న తరుణంలో ఎవరిది పైచేయి అవుతుందో.
This post was last modified on January 6, 2025 5:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…