ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. మనకే థియేటర్లు సరిపోవయ్యా అంటే హక్కులు కొనేశామనే కారణంతో ఏదోలా రిలీజ్ చేసే నిర్మాతలు కనిపిస్తూనే ఉంటారు.
అయితే గత ఏడాది, ఇప్పుడీ 2025 ఈ ట్రెండుకు బ్రేక్ వేశాయి. 2024 జనవరిలో గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్ తలపడటంతో వేరేవాటికి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో అదే టైంలో వద్దామనుకున్న అనువాదాలు కెప్టెన్ మిల్లర్, అయలాన్ వాయిదా వేసుకున్నాయి. వాటిలో ఒకటి నెలాఖరుకు వచ్చింది.
ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతోంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం తక్కువ గ్యాప్ లో ఎలాంటి బాదరబందీ లేకుండా ప్రశాంతంగా బరిలో దిగుతున్నాయి. మూడు సినిమాలే కాబట్టి సరిపడా స్క్రీన్లు సర్దటంలో డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు.
దిల్ రాజు అందుకే కూల్ గా కనిపిస్తున్నారు. కానీ గతంలో ఇలాంటి సీన్ లేదు. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, కళ్యాణం కమనీయం లాంటి స్ట్రెయిట్ మూవీస్ ఉన్నా విజయ్ వారసుడు, అజిత్ తెగింపులు ఇక్కడ స్పేస్ దక్కించుకున్నాయి. ఫలితాల సంగతి పక్కనపెడితే పరస్పరం వసూళ్లు ప్రభావితం చెందాయి.
అంతకు ముందు 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2లు ఉన్నా పేటకు థియేటర్ల తక్కువయ్యాయని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్ బొమ్మ కాబట్టి ఏదోలా సర్దుబాటు జరిగింది.
ఈసారి అలాంటి గోల లేకుండా దిగుతున్నారు కనక రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఈ అవకాశాన్ని ఫుల్లుగా వాడుకోవాలి. టాక్ పాజిటివ్ వస్తే చాలు కనీసం రెండు వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడతాయి. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ప్రీ రిలీజ్ బజ్ ఇంచుమిందు అన్నింటికి ఒకేలా కనిపిస్తున్న తరుణంలో ఎవరిది పైచేయి అవుతుందో.
This post was last modified on January 6, 2025 5:55 pm
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…