ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. మనకే థియేటర్లు సరిపోవయ్యా అంటే హక్కులు కొనేశామనే కారణంతో ఏదోలా రిలీజ్ చేసే నిర్మాతలు కనిపిస్తూనే ఉంటారు.
అయితే గత ఏడాది, ఇప్పుడీ 2025 ఈ ట్రెండుకు బ్రేక్ వేశాయి. 2024 జనవరిలో గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్ తలపడటంతో వేరేవాటికి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో అదే టైంలో వద్దామనుకున్న అనువాదాలు కెప్టెన్ మిల్లర్, అయలాన్ వాయిదా వేసుకున్నాయి. వాటిలో ఒకటి నెలాఖరుకు వచ్చింది.
ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతోంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం తక్కువ గ్యాప్ లో ఎలాంటి బాదరబందీ లేకుండా ప్రశాంతంగా బరిలో దిగుతున్నాయి. మూడు సినిమాలే కాబట్టి సరిపడా స్క్రీన్లు సర్దటంలో డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు.
దిల్ రాజు అందుకే కూల్ గా కనిపిస్తున్నారు. కానీ గతంలో ఇలాంటి సీన్ లేదు. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, కళ్యాణం కమనీయం లాంటి స్ట్రెయిట్ మూవీస్ ఉన్నా విజయ్ వారసుడు, అజిత్ తెగింపులు ఇక్కడ స్పేస్ దక్కించుకున్నాయి. ఫలితాల సంగతి పక్కనపెడితే పరస్పరం వసూళ్లు ప్రభావితం చెందాయి.
అంతకు ముందు 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2లు ఉన్నా పేటకు థియేటర్ల తక్కువయ్యాయని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్ బొమ్మ కాబట్టి ఏదోలా సర్దుబాటు జరిగింది.
ఈసారి అలాంటి గోల లేకుండా దిగుతున్నారు కనక రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఈ అవకాశాన్ని ఫుల్లుగా వాడుకోవాలి. టాక్ పాజిటివ్ వస్తే చాలు కనీసం రెండు వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడతాయి. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ప్రీ రిలీజ్ బజ్ ఇంచుమిందు అన్నింటికి ఒకేలా కనిపిస్తున్న తరుణంలో ఎవరిది పైచేయి అవుతుందో.
This post was last modified on January 6, 2025 5:55 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…