కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా మాస్ కోసమని పాత ఫార్ములాను వాడి హిట్లు కొట్టే దర్శకులు ఎందరో. అది జనానికి నచ్చేలా ఉంటుందో లేదో ట్రైలర్ రూపంలో శాంపిల్ వదులుతారు.
కానీ బాలీవుడ్ నుంచి వచ్చే నెల రాబోతున్న బ్యాడ్ ఆస్ రవికుమార్ అనే కళాఖండం మాత్రం వెరైటీ స్ట్రాటజీని అనుసరిస్తోంది. 80 దశకం నాటి కథా కథనాలతో ఈ సినిమా తీశామని ఓపెన్ గా చెబుతూ దాన్నే ప్రమోషన్లలో వాడుకుంటున్నారు. ఒకప్పటి టాప్ సింగర్ హిమేష్ రేషమియా ఇందులో హీరోగా నటించడంతో పాటు సంగీతం అందించారు.
ట్రైలర్ లోనే బోలెడు ట్రోలింగ్ స్టఫ్ కనిపిస్తోంది. రంపపు మెషీన్ పట్టుకుని ఎదురొచ్చిన రౌడీ శరీరాన్ని ముక్కలు చేయడం దగ్గరి నుంచి నమ్మకశ్యం కానీ ఎన్నో షాట్లు, జంపులు, ఛేజులు ఇందులో పొందుపరిచారు. విచిత్రం ఏంటంటే ఖరీదైన లొకేషన్లు, విదేశాల్లో పాటలు ఫైట్లు ఇలా భారీతనం ఏ మాత్రం తగ్గకుంగా గ్రాండియర్ గా తీశారు.
మరో ట్విస్టు ఏంటంటే మన ప్రభుదేవా ఇందులో విలన్. పదే పదే 80 స్టైల్ అని క్యాప్షన్లు పెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్న ఈ బ్యాడ్ ఆస్ రవికుమార్ కు ఒక్క రోజులోనే 30 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజెన్లు దీన్ని ట్రోల్ చేస్తూనే మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు.
అసలు కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే హిమేష్ ఫ్యాన్స్ కొందరు విక్రమ్, మార్కో, ఖైదీ, యానిమల్ తో దీన్ని పోలుస్తూ పోస్టులు పెట్టడం మాములు కామెడీ కాదు. అసలు పేపర్ మీదే ఇంత రొటీనా అనిపించే కథని ఇన్నేసి కోట్లను కుమ్మరించిన నిర్మాతల ధైర్యాన్నిమెచ్చుకోవలసిందే.
ఏదైనా పన్ను మినహాయింపు కోసం తీశారేమోననే అనుమానాలు లేకపోలేదు. హిందీ విశ్లేషకులు, రివ్యూయర్లు మాత్రం హిమేష్ ప్రయత్నం ఎలా ఉన్నా బిసి సెంటర్లలో వసూళ్లు ఖాయంగా వస్తాయని చెబుతున్నారు. పుష్ప 2 లాంటి ఆర్గానిక్ మాస్ చూసిన కళ్ళు బ్యాడ్ ఆస్ రవికుమార్ ని ఒప్పుకుంటాయా.
This post was last modified on January 6, 2025 4:26 pm
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…