తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులతో భేటీ అయిన సందర్భంగా కూడా ఈ ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ వెనక్కు తగ్గలేదని ప్రచారం జరిగింది.
అయితే, టికెట్ రేట్ల పెంపు అంశంపై చర్చించలేదని టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆనాడు అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడగనిదే అమ్మైనా పెట్టదని, తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని దిల్ రాజు చెప్పారు.
జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు దిల్ రాజు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని మరోసారి రిక్వెస్ట్ చేస్తానని దిల్ రాజు చెప్పారు.
టికెట్ రేట్లు పెంచితే 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం అవసరమని చెప్పారు. భారీ స్థాయిలో రూపొందుతున్నందునే తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి దక్కిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి అన్నీ ఇస్తానని చాలాసార్లు చెప్పారని, ఆ ఆశతో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ రేట్లు, స్పెషల్ షోల గురించి మాట్లాడతానని అన్నారు. దిల్ రాజు రిక్వెస్ట్ ను రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on January 6, 2025 3:27 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…