తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులతో భేటీ అయిన సందర్భంగా కూడా ఈ ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ వెనక్కు తగ్గలేదని ప్రచారం జరిగింది.
అయితే, టికెట్ రేట్ల పెంపు అంశంపై చర్చించలేదని టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆనాడు అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడగనిదే అమ్మైనా పెట్టదని, తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని దిల్ రాజు చెప్పారు.
జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు దిల్ రాజు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని మరోసారి రిక్వెస్ట్ చేస్తానని దిల్ రాజు చెప్పారు.
టికెట్ రేట్లు పెంచితే 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం అవసరమని చెప్పారు. భారీ స్థాయిలో రూపొందుతున్నందునే తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి దక్కిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి అన్నీ ఇస్తానని చాలాసార్లు చెప్పారని, ఆ ఆశతో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ రేట్లు, స్పెషల్ షోల గురించి మాట్లాడతానని అన్నారు. దిల్ రాజు రిక్వెస్ట్ ను రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on January 6, 2025 3:27 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…