Movie News

తెలంగాణ : గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లపై సస్పెన్స్!

తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులతో భేటీ అయిన సందర్భంగా కూడా ఈ ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ వెనక్కు తగ్గలేదని ప్రచారం జరిగింది.

అయితే, టికెట్ రేట్ల పెంపు అంశంపై చర్చించలేదని టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆనాడు అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడగనిదే అమ్మైనా పెట్టదని, తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని దిల్ రాజు చెప్పారు.

జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు దిల్ రాజు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని మరోసారి రిక్వెస్ట్ చేస్తానని దిల్ రాజు చెప్పారు.

టికెట్ రేట్లు పెంచితే 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం అవసరమని చెప్పారు. భారీ స్థాయిలో రూపొందుతున్నందునే తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి దక్కిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి అన్నీ ఇస్తానని చాలాసార్లు చెప్పారని, ఆ ఆశతో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ రేట్లు, స్పెషల్ షోల గురించి మాట్లాడతానని అన్నారు. దిల్ రాజు రిక్వెస్ట్ ను రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

This post was last modified on January 6, 2025 3:27 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

10 seconds ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

6 hours ago