టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు రాకపోవడం వల్ల సెట్స్లోకి వచ్చాక ఇబ్బంది పడుతుంటారు. వర్కింగ్ డేస్ పెంచేస్తుంటారు. దీని వల్ల బడ్జెట్ పెరిగిపోయి నిర్మాతలు చిక్కుల్లో పడుతుంటారు.
స్టార్ డైరెక్టర్లలో చాలామందిది ఇదే వరస. ఐతే కొద్ది మంది మాత్రం పక్కా ప్లానింగ్లో రంగంలోకి దిగి శర వేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అలాంటి దర్శకులు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా చెబుతుంటారు. కొత్త తరంలో అనిల్ రావిపూడిది కూడా ఇదే స్టైల్. స్క్రిప్టు పక్కాగా రెడీ చేసుకుని సెట్స్లో అడుగు పెట్టే అతను.. చకచకా సినిమాను పూర్తి చేసేస్తుంటారు.
రావిపూడి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘ఎఫ్-2’ను అతను 74 రోజుల్లోనే పూర్తి చేసేశాడు. ఇప్పుడు వెంకటేష్ హీరోగా తీసిన కొత్త చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ను 72 రోజుల్లోనే అవగొట్టేశాడట అనిల్. ఇదంతా పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగడ వల్లే సాధ్యమైందని ఓ ఇంటర్వ్యూలో అతను చెప్పాడు.
‘‘మామూలుగా సినిమా షూట్ అయ్యాక ఎడిటింగ్ చేస్తుంటాం. కానీ మేం స్క్రిప్టు దశలోనే ఎడిటింగ్ కూడా చేసేశాం. అవసరం లేని సన్నివేశాలన్నీ తీసి పక్కన పెట్టేశాం. ఒక సన్నివేశం మూడు నిమిషాలు అనుకుంటే మూడు నిమిషాల్లోనే తీశాం. ఇలా పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగడం వల్ల ‘ఎఫ్-2’ కంటే వేగంగా, 72 రెండు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
మేం షూటింగ్ పూర్తి చేశాక రన్ టైం 2 గంటల 26 నిమిషాలు వచ్చింది. అందులో కేవలం 4 నిమిషాలు మాత్రమే ఎడిట్ చేసి 2 గంటల 22 నిమిషాల రన్ టైంతో సెన్సార్కు పంపాం. ముందే సరైన ప్లానింగ్ జరగడం వల్ల వర్కింగ్ డేస్, బడ్జెట్ చాలా వరకు సేవ్ అయ్యాయి’’ అని అనిల్ తెలిపాడు.
This post was last modified on January 4, 2025 10:20 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…