నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు రోజుల్లో ఆక్యుపెన్సీలు తగ్గిపోయాయి. సంక్రాంతికి కొత్త రిలీజులు వచ్చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ పికప్ ఆశించలేం కానీ అదనంగా మరో 15 నుంచి 18 నిమిషాల ఎడిటింగ్ లో తీసేసిన ఫుటేజ్ జోడించబోతున్నారనే ప్రచారం వారం క్రితమే వచ్చింది.
అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఎప్పటి నుంచి జోడిస్తారో తెలిస్తే మళ్ళీ షో ప్లాన్ చేసుకోవాలనేది వాళ్ళ కోరిక. అసలు కథేంటో చూద్దాం.
నిజంగానే ఎక్స్ట్రా కంటెంట్ సిద్ధం చేశారు కానీ అది థియేటర్లకా లేక ఓటిటి వెర్షన్ కు జోడించాలా అనే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ప్రస్తుతానికి దర్శకుడు సుకుమార్ దీని పని మీదే ఎడిటింగ్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు సమాచారం.
ఇంత బ్లాక్ బస్టర్ సాధించాక ఎలాంటి కామెంట్స్ రావడానికి అవకాశం లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేయిస్తున్నారని వినికిడి. బన్నీ ప్రత్యేకంగా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. పండగ హడావిడికి కేవలం ఆరు రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ కొత్త ప్రయోగం ఎంత మేరకు ఫలితం ఇస్తుందనేది ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారట.
మన దగ్గర ఏమో కానీ పుష్ప 2ని విపరీతంగా ప్రేమించిన హిందీ ప్రేక్షకులు మాత్రం ఎక్స్ట్రా కంటెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీర ఫ్యాన్స్ ఆల్రెడీ అయిదారు రిపీట్లు వేశారు. మళ్ళీ చూస్తారా అనేది అనుమానమే.
ఒకపక్క మార్కో బాగానే ఆడుతోంది. ఇంకోవైపు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చూసేందుకు మూవీ లవర్స్ పర్సులు రెడీ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో పుష్ప 2 మళ్ళీ వర్కౌట్ అయితే మరో సంచలనమే. ఇన్ సైడ్ టాక్ అయితే ఓటిటి కోసమనే ఉంది. లేదూ థియేటర్ అంటే మాత్రం మరోసారి సెలబ్రేషన్స్ కి బన్నీ ఫ్యాన్స్ సిద్ధమే.
This post was last modified on January 4, 2025 9:45 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…