కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ లో అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన భార్యగా అంజలి నటించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో చూపించిన కట్స్ ప్రకారం రామ్ చరణ్ తల్లిగా కూడా సెకండాఫ్ లో కనిపించబోతోంది. పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్నట్టు, క్లైమాక్స్ కు ముందు తన నటన అద్భుతమనిపించేలా ఉంటుందని దర్శకుడు శంకర్ కితాబు ఇవ్వడం చూశాం. హీరోయిన్ గా స్టార్ల సరసన ఆఫర్లు తగ్గిపోయిన టైంలో అంజలికిది మాములు ఛాన్స్ కాదు.
ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో కన్నా అసలు విశేషం వేరే ఉంది. అంజలి ఎప్పుడో 2012లో నటించిన మదగజరాజ జనవరి 12 రిలీజవుతోంది. ఇందులో విశాల్ హీరో. పదమూడు సంవత్సరాల క్రితం కాబట్టి అందులో అంజలి గ్లామర్ టచ్ ఉన్న హీరోయిన్ గా నటించింది. తనతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది. ఇంత లేట్ అయినా సరే పొంగల్ బరిలో దిగటంతో ఒక్కసారిగా ఫ్యాన్స్, కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఎప్పటికి రాదనుకున్న చిత్రం హఠాత్తుగా రిలీజ్ డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ కు దారి తీసింది. ఇందులో విశాల్ స్వయంగా పాడిన పాట ఉండటం గమనార్హం.
ఒకపక్క మెచ్యూర్డ్ గా ఒక సినిమా, ఇంకోవైపు ఆడిపాడే మసాలా మూవీ ఇలా క్లాష్ కావడం అంజలికే జరిగింది. మదగజరాజ తెలుగులో వచ్చేది అనుమానంగానే ఉంది. తమిళంలో మాత్రం గేమ్ ఛేంజర్ తో పాటు మరో ఏడెనిమిది సినిమాలతో తలపడనుంది. గత ఏడాది గీతాంజలి మళ్ళీ వచ్చిందితో హిట్టు కొట్టాలని చూసిన అంజలికి ఆశ నెరవేరలేదు. ఒకవేళ గేమ్ ఛేంజర్ సక్సెస్ అయితే మాత్రం మరో బ్రేక్ దొరుకుతుంది. ఆ మధ్య గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో కొంచెం బోల్డ్ క్యారెక్టర్ చేసిన ఆశించిన ఫలితం దక్కలేదు. మరి సంక్రాంతికి దక్కుతున్న డబుల్ బొనాంజాతో ఏమైనా జాక్ పాట్ కొడుతుందేమో చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…