బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ గురించి కొన్ని రోజులుగా ఎంత పెద్ద చర్చ నడుస్తోందో తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం డ్రగ్స్లో మునిగిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. దీని మీద మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
ఐతే కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారాన్ని మౌనంగా చూస్తూ ఉన్న బాలీవుడ్ పెద్దలు.. ఇటీవల మౌనం వీడారు. తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందన్న ఉద్దేశంతో రిపబ్లిక్ టీవీ మీద నాలుగు పెద్ద ప్రొడక్షన్ హౌస్ల అధినేతలతో పాటు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లు సైతం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ నుంచి బలమైన మద్దతే లభించింది. రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేస్తూ, పిటిషన్ వేసిన బాలీవుడ్ బడా బాబులకు మద్దతుగా చాలామంది ఇండస్ట్రీ జనాలు పోస్టులు పెట్టారు.
ఐతే ముందు నుంచి ఈ బాలీవుడ్ పెద్దల మీద పోరాడుతున్న కంగనా రనౌట్ మాత్రం వీళ్లిలా పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వాళ్లందరూ తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించింది. ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రముఖుడు కంగనా బాటలో నడిచాడు. సొంత ఇండస్ట్రీ మీద విమర్శలు గుప్పించాడు. అతనే ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.
తమ గురించి రిపబ్లిక్ టీవీ వాడిన అభ్యంతరకర పదాలను ఉటంకిస్తూ పిటిషన్ వేయడాన్ని ప్రస్తావిస్తూ.. వివేక్ ఇండస్ట్రీ జనాలకు కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఒక హిందీ సినిమాలో వేశ్య పాత్రకు ‘సావిత్రి’ అని పేరు పెట్టారని.. అది అభ్యంతరకరం కాదా అని ప్రశ్నించాడు. సంగీతం, భాష, సంస్కృతి, కళ.. ఇలాంటి వాటిని నాశనం చేస్తున్నందుకు బాలీవుడ్ మీద జనాలు కూడా దావా వేయొచ్చా అని అతను ప్రశ్నించాడు. కంగనా తరహాలోనే వివేక్ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుదారన్న పేరుంది. లిబరల్స్గా ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నించే బాలీవుడ్ ప్రముఖుల మీద అతను ఈ మధ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు.
This post was last modified on October 13, 2020 2:54 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…