Movie News

బాలీవుడ్ ఎటాక్.. దర్శకుడికి రివర్స్ ఎటాక్

బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ గురించి కొన్ని రోజులుగా ఎంత పెద్ద చర్చ నడుస్తోందో తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం డ్రగ్స్‌లో మునిగిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. దీని మీద మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఐతే కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారాన్ని మౌనంగా చూస్తూ ఉన్న బాలీవుడ్ పెద్దలు.. ఇటీవల మౌనం వీడారు. తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందన్న ఉద్దేశంతో రిపబ్లిక్ టీవీ మీద నాలుగు పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల అధినేతలతో పాటు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు సైతం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ నుంచి బలమైన మద్దతే లభించింది. రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేస్తూ, పిటిషన్ వేసిన బాలీవుడ్ బడా బాబులకు మద్దతుగా చాలామంది ఇండస్ట్రీ జనాలు పోస్టులు పెట్టారు.

ఐతే ముందు నుంచి ఈ బాలీవుడ్ పెద్దల మీద పోరాడుతున్న కంగనా రనౌట్ మాత్రం వీళ్లిలా పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వాళ్లందరూ తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించింది. ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రముఖుడు కంగనా బాటలో నడిచాడు. సొంత ఇండస్ట్రీ మీద విమర్శలు గుప్పించాడు. అతనే ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.

తమ గురించి రిపబ్లిక్ టీవీ వాడిన అభ్యంతరకర పదాలను ఉటంకిస్తూ పిటిషన్ వేయడాన్ని ప్రస్తావిస్తూ.. వివేక్ ఇండస్ట్రీ జనాలకు కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఒక హిందీ సినిమాలో వేశ్య పాత్రకు ‘సావిత్రి’ అని పేరు పెట్టారని.. అది అభ్యంతరకరం కాదా అని ప్రశ్నించాడు. సంగీతం, భాష, సంస్కృతి, కళ.. ఇలాంటి వాటిని నాశనం చేస్తున్నందుకు బాలీవుడ్ మీద జనాలు కూడా దావా వేయొచ్చా అని అతను ప్రశ్నించాడు. కంగనా తరహాలోనే వివేక్ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుదారన్న పేరుంది. లిబరల్స్‌గా ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నించే బాలీవుడ్ ప్రముఖుల మీద అతను ఈ మధ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు.

This post was last modified on October 13, 2020 2:54 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

6 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago