సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. తన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ క్రిస్మస్ కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ రివ్యూలతో మొదలైన ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది.
ఐతే ఫలితం ఎలా ఉన్నా.. సినిమాలో కీర్తి పెర్ఫామెన్స్, గ్లామర్ బాగానే హైలైట్ అయింది. ఈ చిత్రం కోసం ప్రమోషన్ల పరంగా కీర్తి చాలానే కష్టపడింది. పలు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంది. ఆ సందర్భంగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని లుక్స్లో కనిపించింది. కీర్తి ఎక్కడికి వెళ్లినా తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు ఆమె మీద బాగా ఫోకస్ చేశారు. ఐతే ఒక ఈవెంట్ సందర్భంగా బ్యాడ్ యాంగిల్లో తన ఫొటోలు, వీడియోలు తీయడం కీర్తికి రుచించలేదు.
కీర్తి కార్లోకి ఎక్కుతుండగా.. అవతలి వైపు నుంచి ఒక ఫొటోగ్రాఫర్ ఫొటో తీస్తుంటే.. కీర్తి అసిస్టెంట్ వారించారు. దీని మీద చిన్న గొడవ నడిచింది. ఈ గొడవపై కీర్తి తాజాగా స్పందించింది. ఆ గొడవ టైంలో అసలేం జరుగుతోందో తనకు అర్థం కాలేదని చెప్పింది. తర్వాత తన అసిస్టెంట్ ఏం జరిగిందో వివరించిందని వెల్లడించింది. తాను అప్పటికే ఫొటోగ్రాఫర్లకు కావాల్సినన్ని పోజులు ఇచ్చానని.. కానీ కార్లోకి ఎక్కుతూ బెండ్ అయిన సమయంలో తనను అవతలి నుంచి ఫొటో తీయాలని చూశారని.. అది బ్యాడ్ యాంగిల్ కదా అని కీర్తి పేర్కొంది. ఇలా ఫొటోలు తీయడం తప్పని ఆమె వ్యాఖ్యానించింది.
ఓపిగ్గా ఫొటోలకు పోజులు ఇచ్చాక ఇలా చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. అంతకుముందు కీర్తి రెడ్ టాప్లో ఒక ఈవెంట్కు హాజరు కాగా.. ఆమె జీప్ నుంచి కిందికి దిగే క్రమంలో వంగినపుడు బ్యాడ్ యాంగిల్లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అవి వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి లేటెస్ట్ ఫొటోల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండొచ్చు.
This post was last modified on January 3, 2025 3:39 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…