Movie News

అలా ఎవరైనా ఫొటో తీస్తారా.. కీర్తి అసహనం

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. తన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ క్రిస్మస్ కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ రివ్యూలతో మొదలైన ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది.

ఐతే ఫలితం ఎలా ఉన్నా.. సినిమాలో కీర్తి పెర్ఫామెన్స్, గ్లామర్ బాగానే హైలైట్ అయింది. ఈ చిత్రం కోసం ప్రమోషన్ల పరంగా కీర్తి చాలానే కష్టపడింది. పలు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంది. ఆ సందర్భంగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని లుక్స్‌లో కనిపించింది. కీర్తి ఎక్కడికి వెళ్లినా తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు ఆమె మీద బాగా ఫోకస్ చేశారు. ఐతే ఒక ఈవెంట్ సందర్భంగా బ్యాడ్ యాంగిల్లో తన ఫొటోలు, వీడియోలు తీయడం కీర్తికి రుచించలేదు.

కీర్తి కార్లోకి ఎక్కుతుండగా.. అవతలి వైపు నుంచి ఒక ఫొటోగ్రాఫర్ ఫొటో తీస్తుంటే.. కీర్తి అసిస్టెంట్ వారించారు. దీని మీద చిన్న గొడవ నడిచింది. ఈ గొడవపై కీర్తి తాజాగా స్పందించింది. ఆ గొడవ టైంలో అసలేం జరుగుతోందో తనకు అర్థం కాలేదని చెప్పింది. తర్వాత తన అసిస్టెంట్ ఏం జరిగిందో వివరించిందని వెల్లడించింది. తాను అప్పటికే ఫొటోగ్రాఫర్లకు కావాల్సినన్ని పోజులు ఇచ్చానని.. కానీ కార్లోకి ఎక్కుతూ బెండ్ అయిన సమయంలో తనను అవతలి నుంచి ఫొటో తీయాలని చూశారని.. అది బ్యాడ్ యాంగిల్ కదా అని కీర్తి పేర్కొంది. ఇలా ఫొటోలు తీయడం తప్పని ఆమె వ్యాఖ్యానించింది.

ఓపిగ్గా ఫొటోలకు పోజులు ఇచ్చాక ఇలా చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. అంతకుముందు కీర్తి రెడ్ టాప్‌లో ఒక ఈవెంట్‌కు హాజరు కాగా.. ఆమె జీప్ నుంచి కిందికి దిగే క్రమంలో వంగినపుడు బ్యాడ్ యాంగిల్లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అవి వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి లేటెస్ట్ ఫొటోల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండొచ్చు.

This post was last modified on January 3, 2025 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైత్రీ తో సినిమా తీయ్.. బాలీవుడ్‌లో పాగా వెయ్!

తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…

13 minutes ago

ఆ ఎమ్మెల్యే… అధిష్ఠానాన్నే ధిక్కరిస్తున్నారే!

ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…

55 minutes ago

ఎమ్మెల్యే పుత్రుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు

ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

2 hours ago

SSMB 29 : ఊహకందని స్థాయిలో రాజమౌళి స్కెచ్!

మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…

2 hours ago

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

2 hours ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

3 hours ago