బాలకృష్ణ – బాబీ కాంబోలో రూపొందిన డాకు మహారాజ్ మీద అభిమానుల ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. తమన్ పాటలు అఖండ రేంజులో వెళ్లడం లేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో కనిపిస్తోంది కానీ నిన్న వచ్చిన దబిడి దిబిడి సాంగ్ మీద సోషల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ సర్వత్రా చర్చగా మారింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్, స్థాయిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఐటెం సాంగ్ కోణంలో కంపోజ్ చేశారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. సరే సినిమా అన్నాక అన్ని రకాల స్పందనలు స్వీకరించాలి కాబట్టి కాసేపది పక్కన పెడదాం.
నిజానికి ఇది టెన్షన్ పడే మ్యాటర్ కాదని చెప్పడానికి కారణముంది. డాకు మహారాజ్ ట్రైలర్ ఇంకా రాలేదు. పలు సందర్భాల్లో నిర్మాత నాగవంశీ పదే పదే ఎప్పుడు చూడని పవర్ ఫుల్ యాక్షన్ లో బాలయ్యని చూస్తారని పదే పదే ఊరించడం తెలిసిందే. దానికి తగ్గ విజువల్స్ రేపు అమెరికాలో జరగబోయే ట్రైలర్ లాంచ్ లో రివీలవుతాయి. ఒక్కసారి అవి బయటికి వచ్చాక ఏదైనా నెగటివిటీ ఉంటే మొత్తం మాయమైపోతుందని సితార వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. జైలర్, విక్రమ్ రెఫరెన్సులు ఊరికే చెప్పలేదని, వాటిని మించిన కంటెంట్ ని బాబీ ఇస్తున్నారని నమ్మకంగా అంటున్నారు.
సో ఇప్పుడు వెయిట్ చేయాల్సింది ట్రైలర్ గురించే తప్ప దబిడి దిబిడి గురించి కాదనేది టీమ్ నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. రూలర్ టైంలోనూ ఇలాంటి పరిస్థితిని బాలయ్య ఫేస్ చేశారు. తర్వాత అఖండ నుంచి ఎవరికి నోరు పారేసుకునే ఛాన్స్ ఇవ్వలేదని సీనియర్లు కౌంటర్లు ఇస్తున్నారు. గేమ్ ఛేంజర్ సైతం బజ్ తక్కువగా ఉన్న పరిస్థితి నుంచి ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా పాజిటివ్ వైబ్ తెచ్చేసుకుంది. డాకుకు అంతకు మించే రెస్పాన్స్ ఉంటుందనేది ఇన్ సైడ్ టాక్. అసలు కంటెంట్ చాలా దాచి పైపై కోటింగ్ తో నెట్టుకొస్తున్న బాబీ బృందం థియేటర్లలో మాత్రం బ్లాస్ట్ అయ్యే షాకులు ఇస్తుందట. చూద్దాం.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…