ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ప్లేస్ ఏంటో చెప్పనక్కర్లేదు. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టినా పుష్ప 2లో కిస్ కిస్ కిసిక్ అనిపించినా డాన్సులతో వాటిని స్థాయిని అమాంతం పైకి తీసుకెళ్లిన ఘనత తనకే దక్కుతుంది. గత ఏడాది గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్న శ్రీలీల త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకోబోతోందని ముంబై టాక్. కార్తీక్ ఆర్యన్ హీరోగా సమీర్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించబోయే తు మేరీ మై తేరి మై తేరా తు మేరాలో హీరోయిన్ అవకాశం ఈ అమ్మడికే దక్కబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం చర్చల దశలో ఉందట.
నిజానికి శ్రీలీలకు ముందు ప్రతిపాదన వచ్చింది ఇది కాదు. వరుణ్ ధావన్ హీరోగా ఆయన తండ్రి డేవిడ్ ధావన్ ప్లాన్ చేసుకున్న ఎంటర్ టైనర్ కోసం అడిగారు. కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. శ్రీలీల దాన్ని దాదాపు వదులుకున్నట్టే. అసలే వరుణ్ మార్కెట్, ఇమేజ్ రెండూ డౌన్ లో ఉన్నాయి. కామెడీగా చేసిన కూలి నెంబర్ వన్ నుంచి మాస్ గా ట్రై చేసిన బేబీ జాన్ దాకా అన్నీ టపా కట్టేశాయి. కానీ కార్తీక్ ఆర్యన్ మంచి స్వింగ్ లో ఉన్నాడు. ఇటీవలే భూల్ భులయ్యా 3 పెద్ద హిట్టయ్యింది. పెద్ద ప్రొడక్షన్ కంపెనీలతో వరసగా సినిమాలు చేస్తూ బిజినెస్ పెంచుకుంటూ పోతున్నాడు.
మరి శ్రీలీల ఎస్ చెప్పిందో లేదో ఇంకొద్దిరోజుల్లో తేలనుంది. అసలే టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్ అంతగా అచ్చి రావడం లేదు. తనకైనా లక్కు కలిసి వస్తుందో లేదో చూడాలి. నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ విడుదలకు సిద్దమవుతూ ఉండగా శివ కార్తికేయన్ తో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందబోయే భారీ చిత్రం ఇటీవలే మొదలైంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యాక డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రవితేజ కాంబో రిపీటవుతున్న మాస్ జాతర మే రిలీజ్ కు రెడీ అవుతోంది. 2025 నుంచి శ్రీలీల డైరిలో పేజీలు ఖాళీగా ఉండేలా కనిపించడం లేదు. స్పీడలా ఉంది మరి.
This post was last modified on January 3, 2025 3:07 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…