దక్షిణాదిన అన్ని భాషల వాళ్లకూ పరిచయమున్న మలయాళ నటుల్లో టొవినో థామస్ ఒకడు. ‘లూసిఫర్’ సినిమ చూసిన వాళ్లందరికీ అతను బాగానే తెలుసు. ఈ మధ్య ‘ఆహా’లో రిలీజైన ‘ఫోరెన్సిక్’తో మన వాళ్లను బాగా ఆకట్టుకున్నాడు టొవినో.
ప్రస్తుతం ‘కాలా’ అనే సినిమాలో నటిస్తున్న ఈ యువ నటుడు దానికి సంబంధించి ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ గాయాన్ని అంతగా పట్టించుకోకపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చి అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. టొవినోను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారన్న వార్త అందరిలోనూ కలవరం రేపింది. అంత సీరియస్ ఏమైందని అందరూ ఆందోళన చెందారు. ఐతే ఈ యంగ్ యాక్టర్ ఇప్పుడు ఔట్ ఆఫ్ డేంజర్ అని వెల్లడైంది.
చికిత్స అనంతరం కోలుకున్న టొవినో థామస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి బయటికి వస్తూ ఒక ఫొటో తీసుకున్న టొవినో.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ అనుభవం తనను మేల్కొల్పిందని, తన విషయంలో తాను కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ యాక్సిడెంట్ తర్వాత ఆ విషయం తనకు బాగా బోధ పడిందని, ఇకపై జాగ్రత్తగా ఉంటానని టొవినో చెప్పాడు. ఆసుపత్రిలో తనను వైద్య సిబ్బంది చాలా బాగా చూసుకున్నారని, ఇది తనకొక అందమైన అనుభవమని టొవినో చెప్పడం విశేషం.
కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోబోతున్నాడు టొవినో. పూర్తిగా కోలుకున్నాక తిరిగి ‘కాలా’ షూటింగ్కు వెళ్లనున్నాడు. తాను కోలుకోవాలని కోరుతూ, తనకు వెల్కమ్ చెబుతూ తన చిన్నారి కొడుకులిద్దరూ స్కెచ్లతో రాసిన అందమైన నోటీస్ బోర్డును అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
This post was last modified on October 13, 2020 2:26 pm
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…