తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవడం, తర్వాత జరిగిన పరిణామాల వల్ల గీతా ఆర్ట్స్ బృందం రెండు వారాలకు పైగా ఆ ఒత్తిడిలోనే ఉండిపోయింది. దీంతో తండేల్ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టేందుకు మనసు రాలేదు. ఇంకోవైపు ఈ పరిణామాలు అక్కినేని ఫ్యాన్స్ కి మనస్థాపం కలిగించాయి. చైతు కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి ప్రమోషన్లు మొదలుకాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కారణాలు జెన్యూన్ గా ఉండటం వల్ల ఎవరిని ఏం అనలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 విడుదల మీద సందేహాలు ముసురుకోవడంతో అలాంటిదేమి లేదని, ఖచ్చితంగా చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని అల్లు అరవింద్ చైతుకి చెప్పడంతో పాటు తనను కలిసిన కొందరు ఫ్యాన్స్ కి హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతే కాదు బన్నీ వ్యవహారం కొలిక్కి వస్తోంది కాబట్టి ఇకపై ప్రమోషన్ ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేక దృష్టి పెడతామని, బన్నీ వాస్ తో కలిసి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నామని చెప్పారట. సో అభిమానులు టెన్షన్ పడేందుకు ఏమి లేదు. చిన్న ప్యాచ్ వర్క్ మినహా తండేల్ దాదాపు పూర్తయ్యే స్టేజిలోనే ఉంది.
దర్శకుడు చందూ మొండేటి టైం వృధా కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఇప్పటిదాకా వచ్చింది ఒక పాటనే. కీలకమైన రెండో జాతర సాంగ్ ని ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నారు. లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకున్న చైతు, సాయిపల్లవి జంట ఈసారి మరింత కనువిందు చేయడం ఖాయమని టాక్. పాకిస్థాన్ లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్లను విడిపించే హీరో కథతో తండేల్ రూపొందింది. యాక్షన్, ఎమోషన్స్, మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్ని వర్గాలను టార్గెట్ చేసుకున్నవి తండేల్ లో పుష్కలంగా ఉన్నాయట. చైతు మాత్రం ధీమాగా ఉన్నాడు.
This post was last modified on January 2, 2025 3:30 pm
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…