తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవడం, తర్వాత జరిగిన పరిణామాల వల్ల గీతా ఆర్ట్స్ బృందం రెండు వారాలకు పైగా ఆ ఒత్తిడిలోనే ఉండిపోయింది. దీంతో తండేల్ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టేందుకు మనసు రాలేదు. ఇంకోవైపు ఈ పరిణామాలు అక్కినేని ఫ్యాన్స్ కి మనస్థాపం కలిగించాయి. చైతు కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి ప్రమోషన్లు మొదలుకాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కారణాలు జెన్యూన్ గా ఉండటం వల్ల ఎవరిని ఏం అనలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 విడుదల మీద సందేహాలు ముసురుకోవడంతో అలాంటిదేమి లేదని, ఖచ్చితంగా చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని అల్లు అరవింద్ చైతుకి చెప్పడంతో పాటు తనను కలిసిన కొందరు ఫ్యాన్స్ కి హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతే కాదు బన్నీ వ్యవహారం కొలిక్కి వస్తోంది కాబట్టి ఇకపై ప్రమోషన్ ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేక దృష్టి పెడతామని, బన్నీ వాస్ తో కలిసి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నామని చెప్పారట. సో అభిమానులు టెన్షన్ పడేందుకు ఏమి లేదు. చిన్న ప్యాచ్ వర్క్ మినహా తండేల్ దాదాపు పూర్తయ్యే స్టేజిలోనే ఉంది.
దర్శకుడు చందూ మొండేటి టైం వృధా కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఇప్పటిదాకా వచ్చింది ఒక పాటనే. కీలకమైన రెండో జాతర సాంగ్ ని ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నారు. లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకున్న చైతు, సాయిపల్లవి జంట ఈసారి మరింత కనువిందు చేయడం ఖాయమని టాక్. పాకిస్థాన్ లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్లను విడిపించే హీరో కథతో తండేల్ రూపొందింది. యాక్షన్, ఎమోషన్స్, మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్ని వర్గాలను టార్గెట్ చేసుకున్నవి తండేల్ లో పుష్కలంగా ఉన్నాయట. చైతు మాత్రం ధీమాగా ఉన్నాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…