తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవడం, తర్వాత జరిగిన పరిణామాల వల్ల గీతా ఆర్ట్స్ బృందం రెండు వారాలకు పైగా ఆ ఒత్తిడిలోనే ఉండిపోయింది. దీంతో తండేల్ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టేందుకు మనసు రాలేదు. ఇంకోవైపు ఈ పరిణామాలు అక్కినేని ఫ్యాన్స్ కి మనస్థాపం కలిగించాయి. చైతు కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి ప్రమోషన్లు మొదలుకాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కారణాలు జెన్యూన్ గా ఉండటం వల్ల ఎవరిని ఏం అనలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 విడుదల మీద సందేహాలు ముసురుకోవడంతో అలాంటిదేమి లేదని, ఖచ్చితంగా చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని అల్లు అరవింద్ చైతుకి చెప్పడంతో పాటు తనను కలిసిన కొందరు ఫ్యాన్స్ కి హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతే కాదు బన్నీ వ్యవహారం కొలిక్కి వస్తోంది కాబట్టి ఇకపై ప్రమోషన్ ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేక దృష్టి పెడతామని, బన్నీ వాస్ తో కలిసి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నామని చెప్పారట. సో అభిమానులు టెన్షన్ పడేందుకు ఏమి లేదు. చిన్న ప్యాచ్ వర్క్ మినహా తండేల్ దాదాపు పూర్తయ్యే స్టేజిలోనే ఉంది.
దర్శకుడు చందూ మొండేటి టైం వృధా కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఇప్పటిదాకా వచ్చింది ఒక పాటనే. కీలకమైన రెండో జాతర సాంగ్ ని ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నారు. లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకున్న చైతు, సాయిపల్లవి జంట ఈసారి మరింత కనువిందు చేయడం ఖాయమని టాక్. పాకిస్థాన్ లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్లను విడిపించే హీరో కథతో తండేల్ రూపొందింది. యాక్షన్, ఎమోషన్స్, మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్ని వర్గాలను టార్గెట్ చేసుకున్నవి తండేల్ లో పుష్కలంగా ఉన్నాయట. చైతు మాత్రం ధీమాగా ఉన్నాడు.
This post was last modified on January 2, 2025 3:30 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…