సంక్రాంతి సినిమాలకు హైప్ తీసుకొచ్చే విషయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. గత ఏడాది గుంటూరు కారంకు కుర్చీ మడతపెట్టి చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. అందుకే ఈసారి ఎలాంటి ఆల్బమ్స్ ఉంటాయనే దాని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. మూడులో రెండింటికి తమన్ పని చేయడం గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మీద అంచనాలు పెంచింది. స్టార్ హీరోలకు తక్కువగా పని చేసిన భీమ్స్ కు సంక్రాంతికి వస్తున్నాం దక్కినా బజ్ పరంగా అది చివరి స్థానంలో ఉండేది. తీరా పండగకు పది రోజులు ముందు చూస్తుంటే సీన్ రివర్స్ అయిపోయింది.
వెంకటేష్ కి భీమ్స్ ఇచ్చిన మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. వాటిని అనిల్ రావిపూడి తెరకెక్కించిన తీరుతో పాటు ఆడియోగా వినడానికి బాగుండటంతో వ్యూస్ లోనూ గోదారి గట్టు లాంటివి పై చేయి సాధించాయి. ఇటీవలే వచ్చిన వెంకీ స్వయంగా పాడిన సాంగ్ సైతం మాస్ కి వేగంగా ఎక్కేస్తోంది. ఇంకోవైపు తమన్ వి స్లో పాయిజన్ లా వెళ్తున్నాయి కానీ భీమ్స్ ని డామినేట్ చేయలేకపోవడం షాక్. డాకు మహారాజ్ రెండు పాటలు ఓ మోస్తరుగా వెళ్లాయి తప్ప అఖండ, వీరసింహారెడ్డి స్థాయిలో వైరల్ కాలేదు. దబిడి దబిడి ఏమైనా మేజిక్ చేస్తుందేమో చూడాలి. బాలయ్యతో తమన్ పనిచేయడం ఇది నాలుగోసారి.
ఇక గేమ్ చేంజర్ బాగానే ప్రభావం చూపించినా దీని రేంజ్ కి తగ్గ పాటలు కాదనేది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న కామెంట్. విజువల్ గా గొప్పగా ఉండొచ్చు, చరణ్ డాన్స్ అదిరిపోయి ఉండొచ్చేమో కానీ అంచనాల బరువు ఎక్కువ ఉండటం వల్ల మోయడం కష్టమైపోయింది. అయితే ఇక్కడితో ఎవరు బెస్ట్ అని తీర్పు ఇవ్వలేం. థియేటర్లలో తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా తమన్ తీసుకొచ్చే ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉంటుంది. సో చరణ్, బాలయ్యలకు ఎలాంటి బిజీఎం ఇచ్చాడనే దాన్ని బట్టి తుది తీర్పు ఇవ్వగలం. సంక్రాంతి వస్తున్నాంకి బీజీఎమ్ పరంగా వెయిట్ తక్కువ ఉండొచ్చు కనక జనవరి 14 దాకా వేచి చూడాలి.
This post was last modified on January 2, 2025 1:05 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…