తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక కార్యక్రమాలపై, డ్రగ్స్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమాలపై సినీ ప్రముఖులు ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పిలుపునకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా ‘‘సే నో టు డ్రగ్స్ డార్లింగ్స్’’ అంటూ డ్రగ్స్ వ్యతిరేక అవకగాహనా కార్యక్రమాన్ని ప్రభాస్ ప్రారంభించారు.
డ్రగ్స్ వద్దు అంటూ యువత, ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రభాస్ ఓ వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నారని ప్రభాస్ చెప్పారు. అటువంటపుడు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ తన అభిమానులతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ సందేశమిచ్చాడు.
జీవితంలో మనకు బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉందని, డ్రగ్స్కు నో చెప్పాలని బాహుబలి తన స్టైల్లో పిలుపునిచ్చారు. అంతేకాదు, మన స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్కు బానిసలైతే వెంటనే 87126 -71111 నెంబర్కు ఫోన్ చేయాలని ప్రభాస్ చెప్పారు. డ్రగ్స్కు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
ప్రభాస్ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరగబోయే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. దాంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే పలు సామాజిక కార్యక్రమాలపై కూడా టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే, కుల గణనపై ప్రచారం చేసేందుకు మాత్రం సినీ ప్రముఖులు విముఖంగా ఉన్నారని తెలుస్తోంది.
This post was last modified on December 31, 2024 8:18 pm
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…