Movie News

డ్రగ్స్ వద్దు డార్లింగ్స్… ప్రభాస్ పిలుపు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక కార్యక్రమాలపై, డ్రగ్స్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమాలపై సినీ ప్రముఖులు ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పిలుపునకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా ‘‘సే నో టు డ్రగ్స్ డార్లింగ్స్’’ అంటూ డ్రగ్స్ వ్యతిరేక అవకగాహనా కార్యక్రమాన్ని ప్రభాస్ ప్రారంభించారు.

డ్రగ్స్‌ వద్దు అంటూ యువత, ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రభాస్ ఓ వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నారని ప్రభాస్ చెప్పారు. అటువంటపుడు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ తన అభిమానులతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ సందేశమిచ్చాడు.

జీవితంలో మనకు బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని, డ్రగ్స్‌కు నో చెప్పాలని బాహుబలి తన స్టైల్లో పిలుపునిచ్చారు. అంతేకాదు, మన స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వెంటనే 87126 -71111 నెంబర్కు ఫోన్ చేయాలని ప్రభాస్ చెప్పారు. డ్రగ్స్కు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ప్రభాస్ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరగబోయే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. దాంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే పలు సామాజిక కార్యక్రమాలపై కూడా టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే, కుల గణనపై ప్రచారం చేసేందుకు మాత్రం సినీ ప్రముఖులు విముఖంగా ఉన్నారని తెలుస్తోంది.

This post was last modified on December 31, 2024 8:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

9 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago