ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాను ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొంటున్న కార్యక్రమాల్లో ఆ తరహా కేకలు వేయొద్దని అభిమానులను పవన్ వారించినా వినడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన పవన్ కల్యాణ్ ఆ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓజీ..ఓజీ…అనేవి అరుపులు కాదని..అభిమానుల బెదిరింపులు అని పవన్ సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనను ఈ మధ్య అభిమానులు ఓజీ…ఓజీ అనే అరుపులతో బెదిరిస్తున్నారని పవన్ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఆ చిట్ చాట్ లో నవ్వులు పూయించాయి. మామూలుగా అయితే, ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని…కానీ, ఈ సినిమాలో ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అని పవన్ చెప్పారు. 1990లలో బాంబే బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని అన్నారు.
తాను ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల దర్శకనిర్మాతలకు క్లీయర్ గా ఒక టైం చెప్పానని, ఆ సమయం దాటితే తాను చేయలేనని చాలా క్లీయర్ కట్ గా చెప్పానని పవన్ అన్నారు. అయితే, తాను చెప్పిన సమయానికి వారు షూటింగ్ పూర్తి చేయలేకపోయారని, ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ కూడా తాను చెప్పిన టైంకి రెడీ కాలేదని తెలిపారు.
ఓజీకి తాను సమయం కేటాయించడం వల్లే త్వరగా పూర్తయిందని, తాను లేని పార్ట్ లు షూట్ చేయమని చెప్పానని, ఆ తర్వాత తాను వచ్చి షూటింగ్ పూర్తి చేస్తానని వారికి చెప్పానని పవన్ అన్నారు. తాను 10 రోజులు షూటింగ్ చేస్తే హరిహర వీరమల్లు పూర్తవుతుందని, అదే మొదట రిలీజ్ అవుతుందని అన్నారు.
This post was last modified on December 30, 2024 7:41 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…