Movie News

హీరోయిన్ల విషయంలో అఖిల్‍ నో కాంప్రమైజ్‍

అక్కినేని అఖిల్‍కి అనుకోకుండా సురేందర్‍ లాంటి పెద్ద దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చింది. స్టార్‍ హీరోలు ఎవరూ ఖాళీగా లేకపోవడంతో సురేందర్‍ తన తదుపరి చిత్రానికి అఖిల్‍ని ఎంచుకున్నాడు. సురేందర్‍ చెప్పిన బడ్జెట్‍ ఎక్కువ కావడంతో నిర్మాత ధైర్యం చేయకపోతే సురేందర్‍ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. జేమ్స్ బాండ్‍ తరహా యాక్షన్‍ కథా చిత్రమని దీని గురించి చెబుతున్నారు.

ఇదిలావుంటే ఇందులో కథానాయికగా రష్మిక కావాలని అఖిల్‍ పట్టుబట్టాడట. ఇంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ చిత్రంలో పూజ హెగ్డేను తీసుకోవాలని కూడా అఖిల్‍ చాలా పట్టు పట్టి సాధించుకున్నాడు. అగ్ర హీరోయిన్లు తన సినిమాలో వుంటే క్రేజ్‍ తోడవుతుందనేది అఖిల్‍ ఆలోచన కావచ్చు. పూజ, రష్మిక ఇప్పుడు టాలీవుడ్‍లో టాప్‍ హీరోయిన్లు. సూపర్‍స్టార్ల పక్కన నటిస్తోన్న వీరికి అఖిల్‍ పక్కన సినిమా అంటే ఖచ్చితంగా భారీ పారితోషికం ఇవ్వక తప్పదు.

తన పారితోషికం పరంగా ఎలాంటి కండిషన్లు పెట్టని అఖిల్‍ హీరోయిన్ల పరంగా మాత్రం నో కాంప్రమైజ్‍ అంటున్నాడు. మరి క్రేజీ హీరోయిన్ల థియరీ అఖిల్‍ని ఫ్లాపుల నుంచి బయట పడేసి హిట్‍ అయ్యేట్టు చూస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

This post was last modified on October 13, 2020 7:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

1 hour ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

7 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

9 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

9 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

11 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

11 hours ago