అక్కినేని అఖిల్కి అనుకోకుండా సురేందర్ లాంటి పెద్ద దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చింది. స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేకపోవడంతో సురేందర్ తన తదుపరి చిత్రానికి అఖిల్ని ఎంచుకున్నాడు. సురేందర్ చెప్పిన బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాత ధైర్యం చేయకపోతే సురేందర్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ కథా చిత్రమని దీని గురించి చెబుతున్నారు.
ఇదిలావుంటే ఇందులో కథానాయికగా రష్మిక కావాలని అఖిల్ పట్టుబట్టాడట. ఇంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంలో పూజ హెగ్డేను తీసుకోవాలని కూడా అఖిల్ చాలా పట్టు పట్టి సాధించుకున్నాడు. అగ్ర హీరోయిన్లు తన సినిమాలో వుంటే క్రేజ్ తోడవుతుందనేది అఖిల్ ఆలోచన కావచ్చు. పూజ, రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లు. సూపర్స్టార్ల పక్కన నటిస్తోన్న వీరికి అఖిల్ పక్కన సినిమా అంటే ఖచ్చితంగా భారీ పారితోషికం ఇవ్వక తప్పదు.
తన పారితోషికం పరంగా ఎలాంటి కండిషన్లు పెట్టని అఖిల్ హీరోయిన్ల పరంగా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడు. మరి క్రేజీ హీరోయిన్ల థియరీ అఖిల్ని ఫ్లాపుల నుంచి బయట పడేసి హిట్ అయ్యేట్టు చూస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…