అక్కినేని అఖిల్కి అనుకోకుండా సురేందర్ లాంటి పెద్ద దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చింది. స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేకపోవడంతో సురేందర్ తన తదుపరి చిత్రానికి అఖిల్ని ఎంచుకున్నాడు. సురేందర్ చెప్పిన బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాత ధైర్యం చేయకపోతే సురేందర్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ కథా చిత్రమని దీని గురించి చెబుతున్నారు.
ఇదిలావుంటే ఇందులో కథానాయికగా రష్మిక కావాలని అఖిల్ పట్టుబట్టాడట. ఇంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంలో పూజ హెగ్డేను తీసుకోవాలని కూడా అఖిల్ చాలా పట్టు పట్టి సాధించుకున్నాడు. అగ్ర హీరోయిన్లు తన సినిమాలో వుంటే క్రేజ్ తోడవుతుందనేది అఖిల్ ఆలోచన కావచ్చు. పూజ, రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లు. సూపర్స్టార్ల పక్కన నటిస్తోన్న వీరికి అఖిల్ పక్కన సినిమా అంటే ఖచ్చితంగా భారీ పారితోషికం ఇవ్వక తప్పదు.
తన పారితోషికం పరంగా ఎలాంటి కండిషన్లు పెట్టని అఖిల్ హీరోయిన్ల పరంగా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడు. మరి క్రేజీ హీరోయిన్ల థియరీ అఖిల్ని ఫ్లాపుల నుంచి బయట పడేసి హిట్ అయ్యేట్టు చూస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 13, 2020 7:45 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…