అక్కినేని అఖిల్కి అనుకోకుండా సురేందర్ లాంటి పెద్ద దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చింది. స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేకపోవడంతో సురేందర్ తన తదుపరి చిత్రానికి అఖిల్ని ఎంచుకున్నాడు. సురేందర్ చెప్పిన బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాత ధైర్యం చేయకపోతే సురేందర్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ కథా చిత్రమని దీని గురించి చెబుతున్నారు.
ఇదిలావుంటే ఇందులో కథానాయికగా రష్మిక కావాలని అఖిల్ పట్టుబట్టాడట. ఇంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రంలో పూజ హెగ్డేను తీసుకోవాలని కూడా అఖిల్ చాలా పట్టు పట్టి సాధించుకున్నాడు. అగ్ర హీరోయిన్లు తన సినిమాలో వుంటే క్రేజ్ తోడవుతుందనేది అఖిల్ ఆలోచన కావచ్చు. పూజ, రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లు. సూపర్స్టార్ల పక్కన నటిస్తోన్న వీరికి అఖిల్ పక్కన సినిమా అంటే ఖచ్చితంగా భారీ పారితోషికం ఇవ్వక తప్పదు.
తన పారితోషికం పరంగా ఎలాంటి కండిషన్లు పెట్టని అఖిల్ హీరోయిన్ల పరంగా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడు. మరి క్రేజీ హీరోయిన్ల థియరీ అఖిల్ని ఫ్లాపుల నుంచి బయట పడేసి హిట్ అయ్యేట్టు చూస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 13, 2020 7:45 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…