Movie News

హీరోయిన్ల విషయంలో అఖిల్‍ నో కాంప్రమైజ్‍

అక్కినేని అఖిల్‍కి అనుకోకుండా సురేందర్‍ లాంటి పెద్ద దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చింది. స్టార్‍ హీరోలు ఎవరూ ఖాళీగా లేకపోవడంతో సురేందర్‍ తన తదుపరి చిత్రానికి అఖిల్‍ని ఎంచుకున్నాడు. సురేందర్‍ చెప్పిన బడ్జెట్‍ ఎక్కువ కావడంతో నిర్మాత ధైర్యం చేయకపోతే సురేందర్‍ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. జేమ్స్ బాండ్‍ తరహా యాక్షన్‍ కథా చిత్రమని దీని గురించి చెబుతున్నారు.

ఇదిలావుంటే ఇందులో కథానాయికగా రష్మిక కావాలని అఖిల్‍ పట్టుబట్టాడట. ఇంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ చిత్రంలో పూజ హెగ్డేను తీసుకోవాలని కూడా అఖిల్‍ చాలా పట్టు పట్టి సాధించుకున్నాడు. అగ్ర హీరోయిన్లు తన సినిమాలో వుంటే క్రేజ్‍ తోడవుతుందనేది అఖిల్‍ ఆలోచన కావచ్చు. పూజ, రష్మిక ఇప్పుడు టాలీవుడ్‍లో టాప్‍ హీరోయిన్లు. సూపర్‍స్టార్ల పక్కన నటిస్తోన్న వీరికి అఖిల్‍ పక్కన సినిమా అంటే ఖచ్చితంగా భారీ పారితోషికం ఇవ్వక తప్పదు.

తన పారితోషికం పరంగా ఎలాంటి కండిషన్లు పెట్టని అఖిల్‍ హీరోయిన్ల పరంగా మాత్రం నో కాంప్రమైజ్‍ అంటున్నాడు. మరి క్రేజీ హీరోయిన్ల థియరీ అఖిల్‍ని ఫ్లాపుల నుంచి బయట పడేసి హిట్‍ అయ్యేట్టు చూస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

This post was last modified on October 13, 2020 7:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్….త్వరగా తేల్చేయండి ప్లీజ్

గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…

16 minutes ago

మాస్ ఆటతో నాటు సిక్సర్ కొట్టిన ‘పెద్ది’

https://youtu.be/2y_DH5gIrCU?si=-Esq17S1eaW7D4yg ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మాములే కానీ పెద్ది విషయంలో మాత్రం ఇది…

31 minutes ago

ఎక్స్‌క్లూజివ్: పూరి-సేతుపతి సినిమాలో టబు

లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా…

1 hour ago

రాష్ట్రపతి ఆమోదం… చట్టంగా వక్ఫ్ సవరణ బిల్లు

వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి…

2 hours ago

ట్రంప్‌ సుంకాలు.. అమెరికాకు మేలా, ముప్పా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఆర్థిక…

2 hours ago

నాగ‌బాబు పర్యటన.. వ‌ర్మ‌కు మరింత సానుభూతి

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పిఠాపురంలో ఏం జ‌రుగుతోంది? పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న…

2 hours ago