కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిందో వరుణ్ ధావన్ కు తమ సినిమా అదే ట్యాగ్ ఇస్తుందని ఓ రేంజ్ లో బిల్డప్ ఇస్తూ చెప్పాడు. దీనికి బాలీవుడ్ మీడియా విస్తుపోయి చూసింది. ఎందుకంటే తేరి కథేంటో, తమిళంలో అంత పెద్ద హిట్టవ్వడానికి కారణాలు ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టి. అయితే యానిమల్ లాంటి ఒరిజినల్ కంటెంట్ ని తన రొటీన్ స్టోరీతో పోల్చుకోవడం కొంచెం అతిగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వాళ్ళు బోలెడున్నారు. సామాన్య ప్రేక్షకులు నిజంగా అంత సీన్ ఉందా అంటూ ఆశ్చర్యపోయారు.
తీరా చూస్తే బేబీ జాన్ 2024లోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలుస్తోంది. కేవలం జవాన్ బ్రాండ్ ని వాడుకుని అట్లీ చేసిన మార్కెటింగ్ ఏ మాత్రం ఫలితం ఇవ్వలేదు సరికదా ఏదో మొహమాటం కొద్దీ కథకు సంబంధం లేని క్యామియో చేసినందుకు సల్మాన్ ఖాన్ కు సైతం నెగటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చింది. అట్లీతో తర్వాత సినిమా చేయబోయేది కండల వీరుడే. ఈ స్టేట్ మెంట్ ఒక్కటే కాదు పలు ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు చేసిన కామెంట్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ని చూపించాయి. ఇవన్నీ బేబీ జాన్ మీద అవసరం లేని హైప్ పెంచేసి తీరా థియేటర్లో చూశాక ఉసూరని నిరాశ కలిగించేలా చేశాయి. ఫ్లాప్ మూటగట్టాయి.
ఒకటి మాత్రం నిజం. యానిమల్ అంత సులభంగా పోల్చుకోలేని, దాటలేని ఆర్గానిక్ బ్లాక్ బస్టర్. మూడున్నర గంటలు చూపించినా జనం బోర్ కొట్టకుండా చూస్తారని మొదట దారి చూపించిన క్లాసిక్ హిట్. ఇది చూపించిన ధైర్యంతోనే పుష్ప 2కి అంతే నిడివిని లాక్ చేసుకున్నాడు సుకుమార్. రన్బీర్ కపూర్ కి సూపర్ స్టార్ అర్హత ఉందని నిరూపించింది కూడా ఈ సినిమానే. అలాంటిది బేబీ జాన్ లాంటి రొటీన్ మూవీతో పోల్చుకోవడం కరెక్ట్ కాదని నెటిజన్ల ఫీలింగ్. ఏది ఏమైనా బజ్ కోసమని ఓవర్ బోర్డ్ స్టేట్ మెంట్లు ఇస్తే ఏమవుతుందో మరోసారి బేబీ జాన్ రూపంలో నిరూపితం అయ్యింది. ఇకపై ఎవరు ఈ పొరపాటు చేయరేమో.
This post was last modified on December 30, 2024 4:11 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…