ఇప్పుడు దేశంలో ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్లకు ఉత్తరాదిన ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సౌత్కు వచ్చేసరికి వాళ్ల హవా అంతంతమాత్రమే. ఇక సౌత్లో హవా సాగించే స్టార్లకు నార్త్లో ఫాలోయింగ్ తక్కువ. కానీ ప్రభాస్ అలా కాదు. ‘బాహుబలి’తో అన్ని చోట్లా పెద్ద స్టార్ అయిపోయాడు.
ఉత్తరాదిన కూడా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ సినిమాలకు కుదురుతున్న కాస్టింగ్, వాటి బడ్జెట్లు, స్కేల్ లాంటివి చూస్తే అతడి రేంజ్ ఏంటన్నది అర్థమవుతుంది. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాలోకి అమితాబ్ బచ్చన్ సైతం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ప్రభాస్ చేయబోయే సినిమాకు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులే సెట్ అవుతున్నారు.
ప్రభాస్ రాముడిగా నటించనున్న ఈ సినిమాలో రావణుడి పాత్రకు సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీత పాత్రకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ పాత్రలో ఎవరు నటించనున్నారో వెల్లడించబోతున్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులో కాస్టింగ్కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఓం రౌత్ చివరగా తీసిన ‘తానాజీ’లో లీడ్ రోల్ చేసిన అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో ముఖ్యమైన అతిథి పాత్ర పోషించనున్నాడట. ఆయన ఆది శివుడిగా కనిపించనున్నట్లు సమాచారం.
రావణుడు శివుడికి పరమభక్తుడన్న సంగతి తెలిసిందే. ఈ కోణాన్ని ఎలివేట్ చేసేందుకు సినిమాలో శివుడు, రావణుడి మధ్య కొన్ని సన్నివేశాలు పెడుతున్నారట. వీటి వెయిట్ పెంచేందుకు శివుడిగా అజయ్ను తీసుకున్నారట. తనకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఓం రౌత్ కోసం ఈ పాత్ర చేయడానికి అజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘ఆదిపురుష్’కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…