ఇప్పుడు దేశంలో ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్లకు ఉత్తరాదిన ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సౌత్కు వచ్చేసరికి వాళ్ల హవా అంతంతమాత్రమే. ఇక సౌత్లో హవా సాగించే స్టార్లకు నార్త్లో ఫాలోయింగ్ తక్కువ. కానీ ప్రభాస్ అలా కాదు. ‘బాహుబలి’తో అన్ని చోట్లా పెద్ద స్టార్ అయిపోయాడు.
ఉత్తరాదిన కూడా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ సినిమాలకు కుదురుతున్న కాస్టింగ్, వాటి బడ్జెట్లు, స్కేల్ లాంటివి చూస్తే అతడి రేంజ్ ఏంటన్నది అర్థమవుతుంది. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాలోకి అమితాబ్ బచ్చన్ సైతం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ప్రభాస్ చేయబోయే సినిమాకు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులే సెట్ అవుతున్నారు.
ప్రభాస్ రాముడిగా నటించనున్న ఈ సినిమాలో రావణుడి పాత్రకు సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీత పాత్రకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ పాత్రలో ఎవరు నటించనున్నారో వెల్లడించబోతున్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులో కాస్టింగ్కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఓం రౌత్ చివరగా తీసిన ‘తానాజీ’లో లీడ్ రోల్ చేసిన అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో ముఖ్యమైన అతిథి పాత్ర పోషించనున్నాడట. ఆయన ఆది శివుడిగా కనిపించనున్నట్లు సమాచారం.
రావణుడు శివుడికి పరమభక్తుడన్న సంగతి తెలిసిందే. ఈ కోణాన్ని ఎలివేట్ చేసేందుకు సినిమాలో శివుడు, రావణుడి మధ్య కొన్ని సన్నివేశాలు పెడుతున్నారట. వీటి వెయిట్ పెంచేందుకు శివుడిగా అజయ్ను తీసుకున్నారట. తనకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఓం రౌత్ కోసం ఈ పాత్ర చేయడానికి అజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘ఆదిపురుష్’కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on October 12, 2020 4:04 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…