2025 సంక్రాంతికి ఖరారుగా వస్తున్న సినిమాలు నాలుగు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పక్కా ప్లానింగ్ తో బెర్తు ఖరారు చేసుకోగా హడావిడిగా రేసులో తోడయ్యింది విడాముయార్చి. అజిత్ హఠాత్తుగా బరిలో దిగడంతో తమిళనాడులో రామ్ చరణ్ కు థియేటర్ల పరంగా వచ్చే చిక్కులను కొట్టిపారేయలేం. పైగా గ్యాప్ తర్వాత తలా చేసిన మూవీ కావడంతో కోలీవుడ్ లో భారీ రిలీజ్ దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. అలాని గేమ్ ఛేంజర్ నిర్లక్ష్యానికి గురవ్వడం లేదు కానీ బజ్ పరంగా కొంచెం టఫ్ ఫైట్ ని ఎదురు కోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోటీకోణంలో ఒక శుభవార్త ఉంది.
వాస్తవానికి విక్రమ్ వీర ధీర శూరన్ పార్ట్ 2ని పొంగల్ కే రిలీజ్ చేయాలని నిర్మాతలు గట్టిగా ట్రై చేశారు. దానికి అనుగుణంగానే ఆ మధ్య టీజర్ వదిలి ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేశారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్ల వాయిదా తప్పదని చెన్నై టాక్. అసలే వీర ధీర శూరన్ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. చాలా కాలం తర్వాత పంచెకట్టులో చియాన్ విక్రమ్ మాస్ ని టార్గెట్ చేసుకున్నాడు. ప్రమోషన్లో చూపించిన కంటెంట్ కనెక్ట్ అవ్వడంతో బయ్యర్లు ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో దాని కోసం లాక్ చేయాలనుకున్న స్క్రీన్లు చరణ్, అజిత్ పంచుకుంటారు.
ఇదొక్కటే కాదు బాలా దర్శకత్వంలో రూపొందిన వనంగాన్ కూడా రావడం లేదు. దీని టీజర్ వచ్చి నెలలు దాటేసింది. సూర్య వదలుకున్నాక అరుణ్ విజయ్ చేసిన భారీ చిత్రమిది. సంక్రాంతికి రావడం అనుమానమేనని బయ్యర్లకు సమాచారం అందిందట. అజిత్ కు బెదిరి వద్దనుకున్నారో లేక గేమ్ ఛేంజర్ కూడా ఉంది కదా ఎందుకు రిస్క్ అనుకున్నారో కారణాలు ఏమైతేనేం ఇది కూడా చరణ్ కు ఊరట కలిగించేదే. ఇదేమో కానీ విక్రమ్ సినిమా వచ్చి ఉంటే తెలుగు డబ్బింగ్ కోసం కాసిన్ని థియేటర్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం తప్పింది. సంక్రాంతి అంటే అంత క్రేజ్ కాబట్టే ఇన్ని క్యాలికులేషన్లు.
This post was last modified on December 28, 2024 10:34 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…