‘పుష్ప…పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్…’ అంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి దేశమంతా ‘పుష్ప’ ఫీవర్ వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసులను ‘పుష్ప’ రూల్ చేశాడు. నీయవ్వ అస్సలు తగ్గేదేలే అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కలెక్షన్ల సునామీలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప అరాచకం మామూలుగా లేదు. బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు డబ్బింగ్ సినిమా అయిన పుష్పను హిందీ సినిమా కంటే ఎక్కువగా ఆదరించి ఆల్ టైం రికార్డు కలెక్షన్లు కురిపించారు.
తాజాగా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేశాడు పుష్ప. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘పుష్ప: ది రూల్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. రూ.740.25 కోట్లు కలెక్షన్లు రాబట్టిను పుష్ప ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. అస్సలు తగ్గే్దేలే అంటూ రూ.1000 కోట్ల కలెక్షన్లపై పుష్ప కన్నేశాడు. అంతేకాదు, బాలీవుడ్ లో సినిమా విడుదలైన మూడు వారాల్లో వంద కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా ‘పుష్ప: ది రూల్’ నిలిచింది.
ఈ క్రమంలోనే పుష్ప కలెక్షన్ల రికార్డులతోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనపై, టాలెంట్ పై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. ఒక తెలుగు డబ్బింగ్ చిత్రం బాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేయడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. ఆ హీరో హిందీలో కూడా మాట్లాడడని, హిందీ రాదని, టాలెంట్ ఉండి అద్భుతంగా నటించాడు కాబట్టే అల్లు అర్జున్ ను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారని చెప్పారు.
అన్ని భాషలలో పుష్ప సూపర్ హిట్ అయిందంటే అల్లు అర్జున్ సాధించిన ఘనత సాధారణమైనది కాదని, అది చాలా గొప్ప విజయం అని సురేష్ బాబు ప్రశంసించారు. తెలుగు డబ్బింగ్ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని, అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని, టాలెంట్ ఉంటేనే అది సాధ్యపడుతుందని చెప్పారు. అన్ని భాషల ప్రేక్షకులు కోరుకున్న కంటెంట్ పుష్ప ఇచ్చిందని అన్నారు.
This post was last modified on December 28, 2024 3:25 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…