హీరో హీరోయిన్లు కొత్త వాళ్లు. దర్శకుడు అంత పేరున్న వాడేమీ కాదు. పరిమిత బడ్జెట్లో సినిమా తీశారు. చిన్న స్థాయిలోనే రిలీజ్ చేశారు. కానీ విడుదల తర్వాత ఆ సినిమా సృష్టించిన సంచనాలు అన్నీ ఇన్నీ కావు. సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టింది. 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ వెళ్లింది.
పెద్ద సినిమాలు సైతం 100 రోజులు ఆడటం కష్టమైన చిన్న సెంటర్లలో ఆ చిత్రం 150 రోజులకు పైగా ఆడింది. ఒక విద్యా సంవత్సరం మధ్యలో విడుదలైన ఆ చిత్రం.. తర్వాతి ఏడాది కొత్త విద్యా సంవత్సరం పున:ప్రారంభం అయ్యే సమయానికి కూడా ఆడుతూనే ఉంది. ఒక తరగతిలో ఉండగా సినిమా చూసిన స్టూడెంట్స్ ఒక తరగతి పెరిగాక మళ్లీ బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చి సినిమా చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 కోట్ల మందికి పైగా ఈ సినిమా చూశారంటే దీని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సినిమా ఏది అంటారా..? నువ్వేకావాలి.
2000వ సంవత్సరం అక్టోబరు 13న మామూలుగా విడుదలైన ‘నువ్వే కావాలి’ అప్పట్లో వెండితెరపై సాగించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా చూడకపోతే యూత్యే కాదు అన్న రీతిలో అబ్బాయిలు, అమ్మాయిలు విరగబడి ఈ సినిమా చూశారు. ‘నువ్వే కావాలి’ పాటలు, డైలాగులు, అందులో కామెడీ, ప్రేమ సన్నివేశాల గురించి ఇప్పుడు అడిగినా ఒకప్పటి యువ ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అవుతూ చెబుతారు. మలయాళంలో హిట్టయిన ‘నిరమ్’ చిత్రాన్ని చూసి ఇష్టపడ్డ స్రవంతి రవికిషోర్.. త్రివిక్రమ్తో మార్పులు చేర్పులు చేయించి స్క్రిప్టు రెడీ చేస్తే.. అప్పటికే త్రివిక్రమ్ సహకారంతో ‘స్వయంవరం’ లాంటి హిట్టిచ్చిన విజయభాస్కర్.. దాన్ని టేకప్ చేసి యువతను ఉర్రూతలూగించేలా ఈ స్నేహం-ప్రేమ కథను అద్భుతంగా మలిచారు.
రవికిషోర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో రామోజీ రావు ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు. విడుదల తర్వాత చిత్రం ఎవ్వరూ ఊహించని అద్భుత విజయాన్నందుకుని తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని తన పేరిట లిఖించుకుంది. ఎవరైనా పెద్ద హీరో సినిమా ఇలా ఆడి ఉంటే దాని రికార్డుల గురించి ఎంతగా ప్రచారం చేసుకునేవాళ్లో. రికార్డుల గురించి ఎంత గొప్పగా మాట్లాడుకునేవాళ్లో.
This post was last modified on October 12, 2020 3:38 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…