సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట వినిపిస్తోంది కానీ ఫలానా డేట్ అంటూ ఏదీ బయటికి రావడం లేదు. సంక్రాంతికి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ప్రస్తుతం లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ, గండిపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సెట్లు సిద్ధం చేసుకోగా ఔట్ డోర్ ఎక్కడికి వెళ్లాలనే దాని మీద కసరత్తు జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని టీమ్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. ఈలోగా కొన్ని ముఖ్యమైన లీకులు వైరల్ అవుతున్నాయి.
వాటిలో ప్రధానమైంది ప్రియాంకా చోప్రాని మెయిన్ లీడ్ గా తీసుకున్నారనే టాక్. నిజానికిది ఊహించని కాంబో. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక విదేశాలకు వెళ్ళిపోయిన ప్రియాంక రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం మానేసింది. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తో పాటు పలు హాలీవుడ్ మూవీస్ చేసింది కానీ తననే కోరుకునే దర్శకులు బాలీవుడ్ లోనూ లేరు. మరి రాజమౌళి ఏరికోరి ఆమెనే తీసుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందేమో చూడాలి. నిజానికిది అఫీషియల్ న్యూస్ కాదు. ఆ మాటకొస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. నమ్మదగిన వర్గాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి అంతే.
విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ కూడా దాదాపు లాకైనట్టే అంటున్నారు. వీలైనంత వరకు గుట్టుగా పని చేసుకోవడం రాజమౌళి స్టైల్. ఇప్పుడూ అదే పాటిస్తున్నారు. కాకపోతే ఏదో ఒక రూపంలో కొన్ని బయటికి వస్తున్నాయి. రెండేళ్లలోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న జక్కన్న అన్నమాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుంటారో లేదో పరిస్థితులు నిర్ణయిస్తాయి. గతంలో ఆర్ఆర్ఆర్ టైంలోనూ అంతా ప్లాన్ ప్రకారం తీయాలనుకున్నా రెండుసార్లు కోవిడ్ అడ్డుపడి ఆలస్యం చేసింది. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఎస్ఎస్ఎంబి 29కి ఇంకో రెండేళ్లలో చూడొచ్చు. 2027 రిలీజ్ అయితే గ్రేటే అనుకోవాలి.
This post was last modified on December 28, 2024 10:41 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…