సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట వినిపిస్తోంది కానీ ఫలానా డేట్ అంటూ ఏదీ బయటికి రావడం లేదు. సంక్రాంతికి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ప్రస్తుతం లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ, గండిపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సెట్లు సిద్ధం చేసుకోగా ఔట్ డోర్ ఎక్కడికి వెళ్లాలనే దాని మీద కసరత్తు జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని టీమ్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. ఈలోగా కొన్ని ముఖ్యమైన లీకులు వైరల్ అవుతున్నాయి.
వాటిలో ప్రధానమైంది ప్రియాంకా చోప్రాని మెయిన్ లీడ్ గా తీసుకున్నారనే టాక్. నిజానికిది ఊహించని కాంబో. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక విదేశాలకు వెళ్ళిపోయిన ప్రియాంక రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం మానేసింది. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తో పాటు పలు హాలీవుడ్ మూవీస్ చేసింది కానీ తననే కోరుకునే దర్శకులు బాలీవుడ్ లోనూ లేరు. మరి రాజమౌళి ఏరికోరి ఆమెనే తీసుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందేమో చూడాలి. నిజానికిది అఫీషియల్ న్యూస్ కాదు. ఆ మాటకొస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. నమ్మదగిన వర్గాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి అంతే.
విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ కూడా దాదాపు లాకైనట్టే అంటున్నారు. వీలైనంత వరకు గుట్టుగా పని చేసుకోవడం రాజమౌళి స్టైల్. ఇప్పుడూ అదే పాటిస్తున్నారు. కాకపోతే ఏదో ఒక రూపంలో కొన్ని బయటికి వస్తున్నాయి. రెండేళ్లలోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న జక్కన్న అన్నమాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుంటారో లేదో పరిస్థితులు నిర్ణయిస్తాయి. గతంలో ఆర్ఆర్ఆర్ టైంలోనూ అంతా ప్లాన్ ప్రకారం తీయాలనుకున్నా రెండుసార్లు కోవిడ్ అడ్డుపడి ఆలస్యం చేసింది. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఎస్ఎస్ఎంబి 29కి ఇంకో రెండేళ్లలో చూడొచ్చు. 2027 రిలీజ్ అయితే గ్రేటే అనుకోవాలి.
This post was last modified on December 28, 2024 10:41 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…