సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట వినిపిస్తోంది కానీ ఫలానా డేట్ అంటూ ఏదీ బయటికి రావడం లేదు. సంక్రాంతికి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ప్రస్తుతం లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ, గండిపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సెట్లు సిద్ధం చేసుకోగా ఔట్ డోర్ ఎక్కడికి వెళ్లాలనే దాని మీద కసరత్తు జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని టీమ్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. ఈలోగా కొన్ని ముఖ్యమైన లీకులు వైరల్ అవుతున్నాయి.
వాటిలో ప్రధానమైంది ప్రియాంకా చోప్రాని మెయిన్ లీడ్ గా తీసుకున్నారనే టాక్. నిజానికిది ఊహించని కాంబో. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక విదేశాలకు వెళ్ళిపోయిన ప్రియాంక రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం మానేసింది. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తో పాటు పలు హాలీవుడ్ మూవీస్ చేసింది కానీ తననే కోరుకునే దర్శకులు బాలీవుడ్ లోనూ లేరు. మరి రాజమౌళి ఏరికోరి ఆమెనే తీసుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందేమో చూడాలి. నిజానికిది అఫీషియల్ న్యూస్ కాదు. ఆ మాటకొస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. నమ్మదగిన వర్గాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి అంతే.
విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ కూడా దాదాపు లాకైనట్టే అంటున్నారు. వీలైనంత వరకు గుట్టుగా పని చేసుకోవడం రాజమౌళి స్టైల్. ఇప్పుడూ అదే పాటిస్తున్నారు. కాకపోతే ఏదో ఒక రూపంలో కొన్ని బయటికి వస్తున్నాయి. రెండేళ్లలోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న జక్కన్న అన్నమాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుంటారో లేదో పరిస్థితులు నిర్ణయిస్తాయి. గతంలో ఆర్ఆర్ఆర్ టైంలోనూ అంతా ప్లాన్ ప్రకారం తీయాలనుకున్నా రెండుసార్లు కోవిడ్ అడ్డుపడి ఆలస్యం చేసింది. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఎస్ఎస్ఎంబి 29కి ఇంకో రెండేళ్లలో చూడొచ్చు. 2027 రిలీజ్ అయితే గ్రేటే అనుకోవాలి.
This post was last modified on December 28, 2024 10:41 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…