బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు పెరుగుతాయి. ఇది ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. కీర్తి సురేష్ కు ఇప్పుడిది అనుభవమవుతోంది. వరుణ్ ధావన్ జోడిగా చేసిన బేబీ జాన్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. నిజానికి ఎంట్రీ ఇవ్వాల్సింది ఇలాంటి క్యారెక్టర్ తో కాదు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ తేరిలో సమంతా కూడా చనిపోయే పాత్రే చేసింది. కానీ అది విజయ్ ఇమేజ్, ఎలివేషన్ల మీద నడిచే కథ కావడంతో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ వరుణ్ కి ఉన్న ఇమేజ్ అంతటి పుల్ సాధించలేడనేది వాస్తవం.
అలాంటప్పుడు కీర్తి సురేష్ రెండు పాటల్లో డాన్స్ చేసి చనిపోయే క్యారెక్టర్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరవ్వడం కష్టం. అసలే బేబీ జాన్ ఊర మాస్ మసాలా సినిమా. అట్లీ అడిగాడు కదాని చేసింది కానీ దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించి ఉండదు. పైగా ఇదేదో పెద్ద బ్రేక్ అవుతుందని భావించి పెళ్లి జరిగిన వెంటనే ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లలో పాల్గొనడం కీర్తి సురేష్ కి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వలేకపోయింది. బేబీ జాన్ లో మరో హీరోయిన్ వామికా గబ్బి పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా లేకపోయినా నిడివి, ప్రాధాన్యత పరంగా కొంచెం బెటర్ అనిపించుకుంది తప్ప బెస్ట్ అయితే కాదు.
గతంలో ఇలా హిందీ తెరంగేట్రంలో షాకులు తిన్న సౌత్ హీరోయిన్లు బాగానే ఉన్నారు. షాలిని పాండే, త్రిష, కాజల్ అగర్వాల్, శ్రియ శరన్, తమన్నా భాటియా లాంటి వాళ్ళు ఏదో ఒకటి రెండు హిట్లు తప్ప తమదైన ముద్ర వేయలేకపోయారు. డెబ్యూనే నార్త్ లో మొదలుపెట్టిన పూజా హెగ్డేకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ అక్కడ లేదు. కానీ తెలుగులో ఇండస్ట్రీ హిట్లున్నాయి. దూరపు కొండలు నునుపు తరహాలో ఏదో పెద్ద బ్రేక్ దొరుకుతుందని వెళ్లి వెనక్కు వచ్చే బాపతే ఎక్కువగా కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే కీర్తి సురేష్ కి బాలీవుడ్ ఎంట్రీ సారీ బేబీ అయిపోయింది.
This post was last modified on December 27, 2024 6:38 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…