దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం చేసినా ఆలోచించి అడుగులు వేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా తమ్మా రెడ్డి పుష్ప-2 వివాదంపై స్పందించారు. నిజానికి ఈ ఘటన ఈ నెల 4న జరిగింది. ఆ తర్వాత.. అనేక మలుపులు కూడా తిరిగింది. కానీ, ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భరద్వాజ ఇప్పుడు అనూహ్య వ్యాఖ్యలు చేశా రు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. చర్చనీయాంశం అయ్యాయి.
హీరోలు కూడా సాధారణ పౌరులేనని.. వీరు కూడా కామన్గా ఉండే అన్ని అంశాలకు అతీతులు కారని వ్యాఖ్యానించారు. కానీ, ఈ విషయాన్ని కొందరు మరిచిపోతున్నారని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. పుష్ప2 ప్రీమియర్ షో కు ఎలాంటి హడావుడీ లేకుండా వెళ్లి ఉంటే.. స్టాంపేడ్ జరిగేది కాదన్నారు. ప్రీమియర్ షోలకు వెళ్లడం.. అభిమానులను కలుసుకోవడం హీరోలకు కొత్తకాదని.. కానీ, చేసిన ప్రచారమే తాజా పరిస్థితిని సీరియస్ చేసిందన్నారు.
“హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణంగా మారిపోయాయి” అని తమ్మారెడ్డి అన్నారు. అసలు ఎందుకింత హంగామా ? అని ప్రశ్నించారు. సైలెంట్గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కానీ.. ఏదో హంగామా చేయడం ద్వారానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు చెప్పారు. గతంలోనూ చిరు, బాలయ్యలు తొలి షో చూసేందుకు వెళ్లినా.. హంగామా చేసేవారు కాదన్నారు.
ధరలు పెంచి ..
హీరోల రెమ్యూనరేషన్ భారం అంతా ప్రేక్షకులపైనే పడుతోందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చే సంస్కృతి పెరిగిందన్నారు. అందుకే.. సగటు ప్రేక్షకుడు ఈ భారం భరించాల్సి వస్తోందన్నారు. అసలు కలెక్షన్ల పరంగా.. సొమ్ముల పరంగా ఒక సినిమాకు పేరు రావడం కాదని.. నటన పరంగా.. తెలుగు సినిమాకు పేరు రావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
This post was last modified on December 27, 2024 3:10 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…