దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం చేసినా ఆలోచించి అడుగులు వేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా తమ్మా రెడ్డి పుష్ప-2 వివాదంపై స్పందించారు. నిజానికి ఈ ఘటన ఈ నెల 4న జరిగింది. ఆ తర్వాత.. అనేక మలుపులు కూడా తిరిగింది. కానీ, ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భరద్వాజ ఇప్పుడు అనూహ్య వ్యాఖ్యలు చేశా రు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. చర్చనీయాంశం అయ్యాయి.
హీరోలు కూడా సాధారణ పౌరులేనని.. వీరు కూడా కామన్గా ఉండే అన్ని అంశాలకు అతీతులు కారని వ్యాఖ్యానించారు. కానీ, ఈ విషయాన్ని కొందరు మరిచిపోతున్నారని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. పుష్ప2 ప్రీమియర్ షో కు ఎలాంటి హడావుడీ లేకుండా వెళ్లి ఉంటే.. స్టాంపేడ్ జరిగేది కాదన్నారు. ప్రీమియర్ షోలకు వెళ్లడం.. అభిమానులను కలుసుకోవడం హీరోలకు కొత్తకాదని.. కానీ, చేసిన ప్రచారమే తాజా పరిస్థితిని సీరియస్ చేసిందన్నారు.
“హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణంగా మారిపోయాయి” అని తమ్మారెడ్డి అన్నారు. అసలు ఎందుకింత హంగామా ? అని ప్రశ్నించారు. సైలెంట్గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కానీ.. ఏదో హంగామా చేయడం ద్వారానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు చెప్పారు. గతంలోనూ చిరు, బాలయ్యలు తొలి షో చూసేందుకు వెళ్లినా.. హంగామా చేసేవారు కాదన్నారు.
ధరలు పెంచి ..
హీరోల రెమ్యూనరేషన్ భారం అంతా ప్రేక్షకులపైనే పడుతోందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చే సంస్కృతి పెరిగిందన్నారు. అందుకే.. సగటు ప్రేక్షకుడు ఈ భారం భరించాల్సి వస్తోందన్నారు. అసలు కలెక్షన్ల పరంగా.. సొమ్ముల పరంగా ఒక సినిమాకు పేరు రావడం కాదని.. నటన పరంగా.. తెలుగు సినిమాకు పేరు రావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
This post was last modified on December 27, 2024 3:10 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…