‘ఆర్ఎక్స్’ 100’తో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాతో అతను ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. చాలామంది అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ అతను కోరుకున్నట్లుగా రెండో సినిమా పట్టాలెక్కడానికి బాగా ఆలస్యం అయిపోయింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన రెండేళ్లకు కూడా ఆ సినిమాను మొదలుపెట్టలేకపోయాడు.
‘మహాసముద్రం’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆ హీరో ఈ హీరో అంటూ లీడ్ రోల్స్ గురించి రకరకాల వార్తలొచ్చాయి. నిర్మాత విషయంలోనూ తర్జనభర్జనలు నడిచాయి. చివరికి శర్వానంద్ ప్రధాన పాత్రలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడానికి రంగం సిద్ధం చేశాడు. ఐతే ఈ మల్టీస్టారర్ మూవీలో ఇంకో కథానాయకుడి పాత్ర కూడా ఉంది. దానికి తమిళ నటుడు సిద్ధార్థ్ ఓకే అయిన సంగతి తెలిసిందే.
అజయ్ భూపతి-శర్వానంద్ కాంబినేషన్ అంటేనే ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందనే ఒక అంచనా ఏర్పడింది. వీళ్లకు సిద్దార్థ్ కూడా తోడవడంతో ఆసక్తి ఇంకా పెరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి అదితిరావు హైదరి కూడా వచ్చింది. ‘సమ్మోహనం’ దగ్గర్నుంచి అదితి సినిమాలపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఆమె నుంచి ప్రేక్షకులు చాలానే ఆశిస్తున్నారు. శర్వా-సిద్ధు-అదితి.. ఈ ముగ్గురి కలయిక భిన్నమైందే.
సినిమా ఆలస్యమైతే అయ్యింది కానీ.. ఆసక్తికర కాంబినేషన్ కుదిరింది. అతి త్వరలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. కొత్త నటీనటుల్ని పెట్టుకుని, పరిమిత బడ్జెట్లో, ఏమాత్రం అంచనాల్లేకుండా ‘ఆర్ఎక్స్ 100’ తీసి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి బాక్సాఫీస్ను షేక్ చేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు మంచి కాస్టింగ్, కోరుకున్న బడ్జెట్ అన్నీ కుదిరిన నేపథ్యంలో అతను ఎలాంటి ఔట్ పుట్ అందిస్తాడన్నది ఆసక్తికరం.
This post was last modified on October 12, 2020 3:24 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…