సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ రోజుతో అల్లు అర్జున్ కు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణను నాంపల్లి కోర్టు జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి అల్లు అర్జున్ తరఫు లాయర్లు తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్ పై తదుపరి విచారణను కూడా జనవరి 10కి కోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అల్లు అర్జున్ కోర్టుకు వస్తారన్న నేపథ్యంలో అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే, వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతినివ్వాలని న్యాయమూర్తిని ఆయన తరఫు లాయర్లు కోరారు. న్యాయమూర్తి అనుమతినివ్వడంతో వర్చువల్ గా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…