సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ రోజుతో అల్లు అర్జున్ కు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణను నాంపల్లి కోర్టు జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి అల్లు అర్జున్ తరఫు లాయర్లు తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్ పై తదుపరి విచారణను కూడా జనవరి 10కి కోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అల్లు అర్జున్ కోర్టుకు వస్తారన్న నేపథ్యంలో అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే, వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతినివ్వాలని న్యాయమూర్తిని ఆయన తరఫు లాయర్లు కోరారు. న్యాయమూర్తి అనుమతినివ్వడంతో వర్చువల్ గా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.
This post was last modified on December 27, 2024 1:38 pm
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…