సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ రోజుతో అల్లు అర్జున్ కు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణను నాంపల్లి కోర్టు జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి అల్లు అర్జున్ తరఫు లాయర్లు తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్ పై తదుపరి విచారణను కూడా జనవరి 10కి కోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అల్లు అర్జున్ కోర్టుకు వస్తారన్న నేపథ్యంలో అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే, వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతినివ్వాలని న్యాయమూర్తిని ఆయన తరఫు లాయర్లు కోరారు. న్యాయమూర్తి అనుమతినివ్వడంతో వర్చువల్ గా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…