Movie News

అల్లు అర్జున్ కేసు : విచారణ వాయిదా!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ రోజుతో అల్లు అర్జున్ కు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణను నాంపల్లి కోర్టు జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి అల్లు అర్జున్ తరఫు లాయర్లు తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్ పై తదుపరి విచారణను కూడా జనవరి 10కి కోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అల్లు అర్జున్ కోర్టుకు వస్తారన్న నేపథ్యంలో అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

అయితే, వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతినివ్వాలని న్యాయమూర్తిని ఆయన తరఫు లాయర్లు కోరారు. న్యాయమూర్తి అనుమతినివ్వడంతో వర్చువల్ గా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.

This post was last modified on December 27, 2024 1:38 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

51 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

2 hours ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

3 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago