ఇటీవలే విడుదలైన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నిర్మాత చెప్పినట్టు పుష్ప 2 గ్రాస్ ని దాటేంత రేంజ్ లో ఆ సినిమా ఉండే మాట అటుంచి కనీసం ఓ మాదిరి ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక నీరసంగా మొదలయ్యింది. పోనీ టాక్ వస్తే ఇలాంటివి క్రమంగా నిలదొక్కుకుంటాయి కానీ కంటెంట్ ఆ స్థాయిలో లేక వెళ్లిన కాసిన్ని ప్రేక్షకులను నిరాశ పరుస్తోంది. పోస్టర్లలో హైలెట్ అయిన వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ లో కనిపించలేదు. ఎందుకని టీమ్ ని అడిగితే విదేశాల్లో ఉన్నాడని ఒకసారి, బయట కనిపించడం ఇష్టం ఉండదని మరోసారి కవర్ చేశారు. కానీ హీరో వెర్షన్ ఇంకోలా ఉండటం జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ముందు చిన్న పాత్రని చెప్పి పొడిగించుకుంటూ పోయారని తర్వాత నువ్వు హీరోనాని వేరే ఆర్టిస్టు అడిగే వరకు డౌట్ రాలేదని చెప్పినట్టుగా వచ్చిన వార్త అనుమానం రేకెత్తించింది. ఏది ఎలా ఉన్నా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఫలితం ముందే ఊహించి వెన్నెల కిషోర్ పబ్లిసిటీ దూరంగా ఉన్నాడేమోననే అనుమానం రావడం సహజం. 1991 అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జరిగిన ఒక మర్డర్ ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రైటర్ మోహన్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తీశాడు. పాయింట్ ఓకే అయినప్పటికీ కథనంతో సహా ఏ అంశమూ గ్రిప్పింగ్ గా నిలవలేకపోయింది.
వెన్నల కిషోర్ కంటే అనన్య నాగళ్ళకే పెర్ఫార్మన్స్ పరంగా ఎక్కువ స్కోప్ దక్కడం అసలు ట్విస్ట్. కమెడియన్లను హీరోలుగా పెట్టి సినిమాలు చేసేటప్పుడు స్క్రీన్ ప్లే, మలుపులు పకడ్బందీగా ఉండాలి. లేదంటే తేడా కొట్టేస్తుంది. అసలే ఇది సోషల్ మీడియా కాలం. ఒక్క చిన్న చిత్రం నిలబడాలన్నా పడిపోవాలన్నా దీని పాత్ర చాలా కీలకం. అంతే తప్ప వైరల్ స్టేట్ మెంట్లు ఇస్తే ఆడియన్స్ థియేటర్లకు రారు. అదే రోజు పోటీగా ఉన్న మోహన్ లాల్ బరోజ్ 3డి డిజాస్టర్ అయినా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ దాన్ని అవకాశంగా వాడుకోలేకపోవడం ట్రాజెడీ. చారి 111 తర్వాత వెన్నెల కిషోర్ కు మరో షాక్ కొట్టింది.
This post was last modified on December 27, 2024 11:49 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…