గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ కాంపిటీషన్ ఉందండోయ్. సోనూ సూద్ హీరోగా నటించిన ఫతే జనవరి 10న రిలీజ్ కానుంది. దీనికి పెద్ద బడ్జెట్ పెట్టారు. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కు జోష్ తెచ్చే సినిమా ఇదే అవుతుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. అయితే సోను సూద్ కు రామ్ చరణ్, చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఆచార్యలో మెయిన్ విలన్ గా నటించిన సమయంలో వాళ్ళిద్దరితో ర్యాపొ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటనను సోను స్వయంగా వివరించారు.
ఇటీవలే బెంగళూరు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో చిరంజీవిని సోను సూద్ అనుకోకుండా కలిశాడు. దగ్గరుండి ఫతే ట్రైలర్ చూపించాడు. ఇప్పటిదాకా ఇలాంటి కంటెంట్ చూడలేదనిపించేలా ఉందని, నావైపు నుంచి ఏదైనా ప్రమోషన్ పరంగా సహాయ పడగలిగితే అడగమని చెప్పడంతో అరుంధతి విలన్ సంతోషం ఒక్కసారిగా రెట్టింపయ్యింది. పోటీ గురించి సోను సూద్ మాట్లాడుతూ తనకేం ఆందోళన లేదని, గతంలో ఒకేసారి లగాన్, గదర్ లాంటివి ఒకే రోజు రిలీజైనా రికార్డులు సృష్టించాయని, సినిమా బాగుంటే ప్రేక్షకులు పండగ సీజన్ లో ఆదరించేందుకు సిద్ధంగా ఉంటారని పలుమార్లు రుజువయ్యిందని చెప్పుకొచ్చాడు.
ఫతే అసలు విశేషం వేరే ఉంది. ఇది సోను సూద్ స్వయంగా రాసుకుని దర్శకత్వం వహించిన సినిమా. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. ఒక అమ్మాయికి బాడీ గార్డ్ గా ఉండాల్సి వచ్చిన హీరో ఈ క్రమంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదురుకుంటాడు. వాటి నుంచి ఎలా బయటపడ్డారనే పాయింట్ తో పక్కా కమర్షియల్ జానర్ లో తెరకెక్కించాడు. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులున్నారు. కరోనా సమయంలో వందలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్న సోను సూద్ మరి గేమ్ ఛేంజర్ పోటీని తట్టుకుని ఎలా నిలబడతాడు అనేది ఆసక్తికరం.
This post was last modified on December 26, 2024 6:53 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…