గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ కాంపిటీషన్ ఉందండోయ్. సోనూ సూద్ హీరోగా నటించిన ఫతే జనవరి 10న రిలీజ్ కానుంది. దీనికి పెద్ద బడ్జెట్ పెట్టారు. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కు జోష్ తెచ్చే సినిమా ఇదే అవుతుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. అయితే సోను సూద్ కు రామ్ చరణ్, చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఆచార్యలో మెయిన్ విలన్ గా నటించిన సమయంలో వాళ్ళిద్దరితో ర్యాపొ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటనను సోను స్వయంగా వివరించారు.
ఇటీవలే బెంగళూరు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో చిరంజీవిని సోను సూద్ అనుకోకుండా కలిశాడు. దగ్గరుండి ఫతే ట్రైలర్ చూపించాడు. ఇప్పటిదాకా ఇలాంటి కంటెంట్ చూడలేదనిపించేలా ఉందని, నావైపు నుంచి ఏదైనా ప్రమోషన్ పరంగా సహాయ పడగలిగితే అడగమని చెప్పడంతో అరుంధతి విలన్ సంతోషం ఒక్కసారిగా రెట్టింపయ్యింది. పోటీ గురించి సోను సూద్ మాట్లాడుతూ తనకేం ఆందోళన లేదని, గతంలో ఒకేసారి లగాన్, గదర్ లాంటివి ఒకే రోజు రిలీజైనా రికార్డులు సృష్టించాయని, సినిమా బాగుంటే ప్రేక్షకులు పండగ సీజన్ లో ఆదరించేందుకు సిద్ధంగా ఉంటారని పలుమార్లు రుజువయ్యిందని చెప్పుకొచ్చాడు.
ఫతే అసలు విశేషం వేరే ఉంది. ఇది సోను సూద్ స్వయంగా రాసుకుని దర్శకత్వం వహించిన సినిమా. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. ఒక అమ్మాయికి బాడీ గార్డ్ గా ఉండాల్సి వచ్చిన హీరో ఈ క్రమంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదురుకుంటాడు. వాటి నుంచి ఎలా బయటపడ్డారనే పాయింట్ తో పక్కా కమర్షియల్ జానర్ లో తెరకెక్కించాడు. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులున్నారు. కరోనా సమయంలో వందలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్న సోను సూద్ మరి గేమ్ ఛేంజర్ పోటీని తట్టుకుని ఎలా నిలబడతాడు అనేది ఆసక్తికరం.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…