గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ కాంపిటీషన్ ఉందండోయ్. సోనూ సూద్ హీరోగా నటించిన ఫతే జనవరి 10న రిలీజ్ కానుంది. దీనికి పెద్ద బడ్జెట్ పెట్టారు. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కు జోష్ తెచ్చే సినిమా ఇదే అవుతుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. అయితే సోను సూద్ కు రామ్ చరణ్, చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఆచార్యలో మెయిన్ విలన్ గా నటించిన సమయంలో వాళ్ళిద్దరితో ర్యాపొ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటనను సోను స్వయంగా వివరించారు.
ఇటీవలే బెంగళూరు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో చిరంజీవిని సోను సూద్ అనుకోకుండా కలిశాడు. దగ్గరుండి ఫతే ట్రైలర్ చూపించాడు. ఇప్పటిదాకా ఇలాంటి కంటెంట్ చూడలేదనిపించేలా ఉందని, నావైపు నుంచి ఏదైనా ప్రమోషన్ పరంగా సహాయ పడగలిగితే అడగమని చెప్పడంతో అరుంధతి విలన్ సంతోషం ఒక్కసారిగా రెట్టింపయ్యింది. పోటీ గురించి సోను సూద్ మాట్లాడుతూ తనకేం ఆందోళన లేదని, గతంలో ఒకేసారి లగాన్, గదర్ లాంటివి ఒకే రోజు రిలీజైనా రికార్డులు సృష్టించాయని, సినిమా బాగుంటే ప్రేక్షకులు పండగ సీజన్ లో ఆదరించేందుకు సిద్ధంగా ఉంటారని పలుమార్లు రుజువయ్యిందని చెప్పుకొచ్చాడు.
ఫతే అసలు విశేషం వేరే ఉంది. ఇది సోను సూద్ స్వయంగా రాసుకుని దర్శకత్వం వహించిన సినిమా. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. ఒక అమ్మాయికి బాడీ గార్డ్ గా ఉండాల్సి వచ్చిన హీరో ఈ క్రమంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదురుకుంటాడు. వాటి నుంచి ఎలా బయటపడ్డారనే పాయింట్ తో పక్కా కమర్షియల్ జానర్ లో తెరకెక్కించాడు. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులున్నారు. కరోనా సమయంలో వందలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్న సోను సూద్ మరి గేమ్ ఛేంజర్ పోటీని తట్టుకుని ఎలా నిలబడతాడు అనేది ఆసక్తికరం.
This post was last modified on December 26, 2024 6:53 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…