కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. తన దగ్గరే చాలా ఏళ్లు పని చేసిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు వచ్చాక కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న జానీ.. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తర్వాత జైలు పాలయ్యాడు. దాదాపు రెండు నెలల తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు.
అప్పట్నుంచి మీడియాకు అవకాశం దొరికినపుడల్లా తన మీద వచ్చిన ఆరోపణల గురించి జానీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ అతను స్పందించడం లేదు. ఐతే తాజాగా జానీ మీద పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేశారు. అందులో అతడి మీద తీవ్ర అభియోగాలే ఉన్నాయి. జానీని ఈ కేసులో గట్టిగానే బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఛార్జ్ షీట్ నమోదైన కొన్ని గంటలకే జానీ ఒక సెల్ఫీ వీడియోతో సోషల్ మీడియాను పలకరించాడు. తనపై వచ్చిన ఆరోపణల గురించి తాను ఇప్పుడేమీ మాట్లాడనని జానీ చెప్పాడు.
తనేంటో, తానేం చేశాడో తన మనసుకు తెలుసని.. అలాగే దేవుడికి కూడా అన్నీ తెలుసని జానీ వ్యాఖ్యానించాడు. తాను ఏ తప్పూ చేయలేదని.. తాను ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి వస్తానని అతను ధీమా వ్యక్తం చేశాడు. న్యాయస్థానాల మీద తనకు నమ్మకం ఉందని.. అక్కడ తాను ఏ తప్పు చేయలేదని తేలుతుందని.. తనకు న్యాయం జరుగుతుందని జానీ ధీమా వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం తాను కుటుంబంతో సంతోషంగా ఉన్నానని.. మళ్లీ సినిమాలకు పని చేస్తున్నానని.. ఈ కేసులో తాను పోరాటం సాగిస్తానని.. నిర్దోషిగా బయటికి వచ్చాక ఆ రోజు తాను ఏం చెప్పాలనుకున్నానో అదంతా చెబుతానని జానీ అన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు అతను థ్యాంక్స్ చెప్పాడు.
This post was last modified on December 26, 2024 2:24 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…