సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన పలు కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వారు ప్రస్తావించారు. అయితే, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ ప్రీమియర్ లు, టికెట్ రేట్ల పెంపు ఉండవని రేవంత్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు.
సినిమా టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతికి విడుదల కాబోతోన్న సినిమాలు ముఖ్యం కాదని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని, టిక్కెట్ రేటు, బెనిఫిట్ షోల పై చర్చ జరగలేదని దిల్ రాజ్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందని, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు.
హైదరాబాద్లో హాలీవుడ్ సినిమా షూటింగ్లు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని దిల్ రాజు చెప్పారు.సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో టాలీవుడ్కు, ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందన్న టాక్ సరికాదని, అలాంటిదేమీ లేదని దిల్ రాజు చెప్పారు. సీఎంతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని అన్నారు. డ్రగ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫోకస్ పెట్టమని సీఎం కోరారని, హీరోలు, హీరోయిన్స్ ఆ కార్యక్రమాలకు సహకరిస్తారని సీఎంకు చెప్పామని దిల్ రాజు వెల్లడించారు.
This post was last modified on December 26, 2024 2:11 pm
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…