సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన పలు కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వారు ప్రస్తావించారు. అయితే, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ ప్రీమియర్ లు, టికెట్ రేట్ల పెంపు ఉండవని రేవంత్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు.
సినిమా టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతికి విడుదల కాబోతోన్న సినిమాలు ముఖ్యం కాదని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని, టిక్కెట్ రేటు, బెనిఫిట్ షోల పై చర్చ జరగలేదని దిల్ రాజ్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందని, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు.
హైదరాబాద్లో హాలీవుడ్ సినిమా షూటింగ్లు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని దిల్ రాజు చెప్పారు.సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో టాలీవుడ్కు, ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందన్న టాక్ సరికాదని, అలాంటిదేమీ లేదని దిల్ రాజు చెప్పారు. సీఎంతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని అన్నారు. డ్రగ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫోకస్ పెట్టమని సీఎం కోరారని, హీరోలు, హీరోయిన్స్ ఆ కార్యక్రమాలకు సహకరిస్తారని సీఎంకు చెప్పామని దిల్ రాజు వెల్లడించారు.
This post was last modified on December 26, 2024 2:11 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…