సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన పలు కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వారు ప్రస్తావించారు. అయితే, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ ప్రీమియర్ లు, టికెట్ రేట్ల పెంపు ఉండవని రేవంత్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు.
సినిమా టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతికి విడుదల కాబోతోన్న సినిమాలు ముఖ్యం కాదని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని, టిక్కెట్ రేటు, బెనిఫిట్ షోల పై చర్చ జరగలేదని దిల్ రాజ్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందని, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు.
హైదరాబాద్లో హాలీవుడ్ సినిమా షూటింగ్లు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని దిల్ రాజు చెప్పారు.సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో టాలీవుడ్కు, ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందన్న టాక్ సరికాదని, అలాంటిదేమీ లేదని దిల్ రాజు చెప్పారు. సీఎంతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని అన్నారు. డ్రగ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫోకస్ పెట్టమని సీఎం కోరారని, హీరోలు, హీరోయిన్స్ ఆ కార్యక్రమాలకు సహకరిస్తారని సీఎంకు చెప్పామని దిల్ రాజు వెల్లడించారు.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…