సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఓపెనింగ్స్ అరాచకం ఖాయమని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డాకు మహారాజ్ కు రెండు రోజులు, సంక్రాంతికి వస్తున్నాంకు నాలుగు రోజులు గ్యాప్ ఉండటం ఎంతైనా సానుకూలాంశం. అయితే ఇక్కడితో హమ్మయ్యా అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలుగులో సమస్య లేదు కానీ తమిళంలో మాత్రం అజిత్ తో నేరుగా క్లాష్ అయ్యే రిస్క్ చరణ్ కు తప్పేలా లేదు. విడాముయార్చిని జనవరి 10కే ప్లాన్ చేస్తున్నారని చెన్నై టాక్.
అదే జరిగితే గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు థియేటర్ల పరంగా చిక్కులు తప్పవు. ఎందుకంటే అజిత్ క్రేజ్ దృష్ట్యా తమిళనాడు, కేరళలో ఎక్కువ స్క్రీన్లు తనకు కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తారు. హైప్ పరంగా విడాముయార్చి వెనుకబడి ఉంది కానీ ఇంకో మూడు నాలుగు రోజుల్లో మొదలుపెట్టే ప్రమోషన్లతో దాన్ని పెంచేందుకు లైకా పక్కా ప్రణాళికతో ఉందట. నిజానికి పొంగల్ రేసులో గుడ్ బ్యాడ్ అగ్లీని దింపాలని మైత్రి మేకర్స్ శతవిధాలా ప్రయత్నించింది. కానీ విడాముయార్చి ఇప్పటికే విపరీతమైన ఆలస్యం కావడంతో అజిత్ ప్రాధాన్యం దీనివైపే మొగ్గు చూపింది. దీంతో నెంబర్ మారిపోయింది.
ఈ లెక్కన చరణ్ పోటీపడాల్సిన లిస్టులో బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు అజిత్ కూడా తోడవ్వబోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే విడాముయార్చి షూటింగ్ ఇంకా అయిపోలేదు. చివరి దశ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా చేయాల్సి ఉంది. టీజర్ కు ఆశించిన స్పందన రాలేదు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ రోడ్ థ్రిల్లర్ లో యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కెసెండ్రా ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు డబ్బింగ్ కి పెద్ద ఎత్తున కాకపోయినా కాసింత డీసెంట్ నెంబర్లలో రిలీజ్ చేస్తారు. ఓవర్సీస్ లోనూ అజిత్ ప్రభావం కాసింత బలంగానే ఉంటుంది. చూడాలి.
This post was last modified on December 25, 2024 7:16 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…