స్టార్ డైరెక్టర్ల చూపు ఎప్పుడూ స్టార్ హీరోల మీదే ఉంటుంది. ఒకవేళ చిన్న, మీడియం రేంజ్ కథానాయకులతో సినిమాలు చేయాలని వాళ్లనుకున్నా అదంత సులువైన విషయం కాదు. అందుకే అనివార్యంగా పెద్ద హీరోలతో బడా ప్రాజెక్టులే చేస్తుంటారు. రాజమౌళి ‘మగధీర’ తర్వాత కొంచెం రూటు మార్చి మర్యాదరామన్న, ఈగ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేశాడు.
ఒక స్థాయి అందుకున్నాక పెద్ద స్టార్లతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్.. మధ్యలో కొంచెం స్లంప్లో ఉన్న టైంలో నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతో ‘అఆ’ తీశాడు. ఇక కొన్నేళ్లుగా పెద్ద హీరోలతోనే సాగుతున్న సుకుమార్.. ‘పుష్ప’తర్వాత కొంచెం వీలు చేసుకుని విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు. మరో అగ్ర దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే.. తొలి సినిమా నుంచి బడా హీరోలతోనే ప్రయాణం సాగిస్తున్న ఆయన, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా పనిలో ఉంటూనే ఆయన ఓ చిన్న హీరో కోసం కథ రాయడం విశేషం. ఆ హీరో యంగ్, టాలెంటెడ్ నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. ఐతే అతడితో కొరటాల చేయబోయేది సినిమా కాదు.. వెబ్ సిరీస్. దీనికి స్క్రిప్టు అందిస్తున్నది కొరటాలే కానీ దర్శకత్వం మాత్రం ఆయన చేయట్లేదట. కానీ కథ అందించడంతో పాటు నిర్మాణమూ కొరటాలే చేపట్టనున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఇది తెరకెక్కనుందట.
టీనేజీలో అపరిపక్వమైన ప్రేమల వల్ల జీవితాలు ఎలా డిస్టర్బ్ అవుతాయనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు సమాచారం. తన అసిస్టెంటుతో ఈ వెబ్ సిరీస్ చేయిస్తున్నాడట కొరటాల. తక్కువ బడ్జెట్లో, టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ వెబ్ సిరీస్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో మంచి గుర్తింపు సంపాదించిన నవీన్ చేతిలో ఇప్పటికే రెండు మూడు సినిమాలున్నాయి.
This post was last modified on October 12, 2020 1:54 pm
పెద్ది వాయిదాలతో అభిమానులు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. మార్చి 26, ఏప్రిల్ 30 రెండు మంచి డేట్లు మిస్సైపోయాయి.…
ఏప్రిల్ నెలలో రెండు శుక్రవారాలు అయిపోయాయి. మొదటి బంచ్ లో వచ్చిన బైకర్, రాకాసలు పాజిటివ్ టాక్స్ తోనూ అద్భుతాలు…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ ఫిమేల్ ఫోక్ సింగర్ మంగ్లీనే అనడంలో మరో మాట లేదు. చిన్న స్థాయిలో ప్రైవేట్…
యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు…
మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…
అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…