స్టార్ డైరెక్టర్ల చూపు ఎప్పుడూ స్టార్ హీరోల మీదే ఉంటుంది. ఒకవేళ చిన్న, మీడియం రేంజ్ కథానాయకులతో సినిమాలు చేయాలని వాళ్లనుకున్నా అదంత సులువైన విషయం కాదు. అందుకే అనివార్యంగా పెద్ద హీరోలతో బడా ప్రాజెక్టులే చేస్తుంటారు. రాజమౌళి ‘మగధీర’ తర్వాత కొంచెం రూటు మార్చి మర్యాదరామన్న, ఈగ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేశాడు.
ఒక స్థాయి అందుకున్నాక పెద్ద స్టార్లతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్.. మధ్యలో కొంచెం స్లంప్లో ఉన్న టైంలో నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతో ‘అఆ’ తీశాడు. ఇక కొన్నేళ్లుగా పెద్ద హీరోలతోనే సాగుతున్న సుకుమార్.. ‘పుష్ప’తర్వాత కొంచెం వీలు చేసుకుని విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు. మరో అగ్ర దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే.. తొలి సినిమా నుంచి బడా హీరోలతోనే ప్రయాణం సాగిస్తున్న ఆయన, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా పనిలో ఉంటూనే ఆయన ఓ చిన్న హీరో కోసం కథ రాయడం విశేషం. ఆ హీరో యంగ్, టాలెంటెడ్ నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. ఐతే అతడితో కొరటాల చేయబోయేది సినిమా కాదు.. వెబ్ సిరీస్. దీనికి స్క్రిప్టు అందిస్తున్నది కొరటాలే కానీ దర్శకత్వం మాత్రం ఆయన చేయట్లేదట. కానీ కథ అందించడంతో పాటు నిర్మాణమూ కొరటాలే చేపట్టనున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఇది తెరకెక్కనుందట.
టీనేజీలో అపరిపక్వమైన ప్రేమల వల్ల జీవితాలు ఎలా డిస్టర్బ్ అవుతాయనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు సమాచారం. తన అసిస్టెంటుతో ఈ వెబ్ సిరీస్ చేయిస్తున్నాడట కొరటాల. తక్కువ బడ్జెట్లో, టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ వెబ్ సిరీస్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో మంచి గుర్తింపు సంపాదించిన నవీన్ చేతిలో ఇప్పటికే రెండు మూడు సినిమాలున్నాయి.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…