అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన శ్రీదేవి.. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్ను పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం. శ్రీదేవిని ఒక దేవతలా ఆరాధించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాను ఆమెకు తగననే ఉద్దేశంతో ఎప్పుడూ తన ఇష్టాన్ని ఆమెకు చెప్పలేదని, బోనీని పెళ్లాడాక మాత్రం తాను ఆమెకు ప్రపోజ్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు ఓ సందర్భంలో.
ఐతే తాను తొలిసారి శ్రీదేవి దగ్గర పెళ్లి ప్రతిపాదన చేసినపుడు ఆమెకు చాలా కోపం వచ్చిందని.. తనను తిట్టిపోసిందని.. తనతో ఆరు నెలలు మాట్లాడలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోనీ వెల్లడించాడు. ఆమెతో పాటు తన భార్యకు కూడా సర్దిచెప్పి ఒప్పించాకే తాను శ్రీదేవిని పెల్లాడినట్లు ఆయన తెలిపాడు. శ్రీదేవితో ప్రేమ, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే..‘‘ప్రేమ, పెళ్లి విషయంలో శ్రీదేవిని ఒప్పించడానికి నాకు ఆరు నెలలు పట్టింది. తొలిసారి నేను ప్రపోజ్ చేసినపుడు ఆమె నన్ను బాగా తిట్టింది.
దాదాపు ఆరు నెలలు నాతో మాట్లాడలేదు. మీకు పెళ్లి ఇద్దరు పిల్లలున్నారు, ఇప్పుడు నాతో ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ నా మనసులోని భావాలను ఆమెకు పూర్తిగా తెలియజేశా. చివరకు ఆమె అంగీకరించింది. విధి మాకు అంగీకరించింది. ఈ భూమి మీద ఎవరూ పర్ఫెక్ట్ కాదు. శ్రీదేవితో ప్రేమలో పడడానికి ముందే నాకు పెళ్లి అయింది. పిల్లలున్నారు. ఈ విషయాన్ని నేను ఎక్కడా దాచలేదు. నా ప్రేమ గురించి నా మొదటి భార్య మోనాకు, పిల్లలకు కూడా వివరించా. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. విషయం ఏదైనా సరే.. మన భాగస్వామి, పిల్లలతో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలన్నది నా ఫీలింగ్. శ్రీదేవిని నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. నా చివరి క్షణం వరకు తన జ్ఞాపకాలతోనే ఉంటా’’ అని బోనీ చెప్పాడు.
శ్రీదేవి కెరీర్ పీక్స్లో ఉండగా బోనీతో పరిచయం జరిగింది. 1996లో వీరు పెళ్లి చేసుకున్నారు. 2018లో శ్రీదేవి దుబాయ్లో ఉండగా హఠాత్తుగా చనిపోయారు. ఆమె మరణంపై అప్పట్లో పలు సందేహాలు తలెత్తాయి. బోనీ మీద కూడా అనుమానాలు రేకెత్తాయి. కానీ ఆమె అనారోగ్యం వల్లే మరణించారని విచారణలో తేలింది.
This post was last modified on December 25, 2024 4:59 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…