సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందడం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరిగా రియాక్ట్ కాలేదని, శ్రీ తేజ్ ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు కొందరు విమర్శించారు. కానీ, తనను ఆస్పత్రి దగ్గరకు వెళ్లొద్దని లాయర్లు చెప్పడంతోనే ఆగానని అల్లు అర్జున్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ రోజు దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట నాటి వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించి పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలు చూసిన బన్నీ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, శ్రీ తేజ్ గాయపడడం తలుచుకొని బన్నీ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
అయితే, ప్రెస్ మీట్ సందర్భంగా రేవతి మరణం, శ్రీ తేజ్ గాయపడడం గురించి మాట్లాడుతూ బన్నీ తన ఎమోషన్ ను వ్యక్తపరిచారని, కానీ, దానిని కొందరు అపార్థం చేసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. ఆ ఘటన అల్లు అర్జున్ ను ఎంతో బాధించిందని, కానీ, దానిని అర్థం చేసుకోకుండా కొందరు బన్నీని టార్గెట్ చేసి మాట్లాడుతుండడంతో వివరణనిచ్చే ప్రయత్నం బన్నీ చేశారని చెబుతున్నారు. అల్లు అర్జున్ నిజంగా షాక్ లో ఉన్నారని, ఆ క్రమంలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని అంటున్నారు.
This post was last modified on December 24, 2024 9:26 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…