సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందడం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరిగా రియాక్ట్ కాలేదని, శ్రీ తేజ్ ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు కొందరు విమర్శించారు. కానీ, తనను ఆస్పత్రి దగ్గరకు వెళ్లొద్దని లాయర్లు చెప్పడంతోనే ఆగానని అల్లు అర్జున్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ రోజు దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట నాటి వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించి పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలు చూసిన బన్నీ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, శ్రీ తేజ్ గాయపడడం తలుచుకొని బన్నీ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
అయితే, ప్రెస్ మీట్ సందర్భంగా రేవతి మరణం, శ్రీ తేజ్ గాయపడడం గురించి మాట్లాడుతూ బన్నీ తన ఎమోషన్ ను వ్యక్తపరిచారని, కానీ, దానిని కొందరు అపార్థం చేసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. ఆ ఘటన అల్లు అర్జున్ ను ఎంతో బాధించిందని, కానీ, దానిని అర్థం చేసుకోకుండా కొందరు బన్నీని టార్గెట్ చేసి మాట్లాడుతుండడంతో వివరణనిచ్చే ప్రయత్నం బన్నీ చేశారని చెబుతున్నారు. అల్లు అర్జున్ నిజంగా షాక్ లో ఉన్నారని, ఆ క్రమంలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని అంటున్నారు.
This post was last modified on December 24, 2024 9:26 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…