సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందడం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరిగా రియాక్ట్ కాలేదని, శ్రీ తేజ్ ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు కొందరు విమర్శించారు. కానీ, తనను ఆస్పత్రి దగ్గరకు వెళ్లొద్దని లాయర్లు చెప్పడంతోనే ఆగానని అల్లు అర్జున్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ రోజు దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట నాటి వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించి పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలు చూసిన బన్నీ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, శ్రీ తేజ్ గాయపడడం తలుచుకొని బన్నీ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
అయితే, ప్రెస్ మీట్ సందర్భంగా రేవతి మరణం, శ్రీ తేజ్ గాయపడడం గురించి మాట్లాడుతూ బన్నీ తన ఎమోషన్ ను వ్యక్తపరిచారని, కానీ, దానిని కొందరు అపార్థం చేసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. ఆ ఘటన అల్లు అర్జున్ ను ఎంతో బాధించిందని, కానీ, దానిని అర్థం చేసుకోకుండా కొందరు బన్నీని టార్గెట్ చేసి మాట్లాడుతుండడంతో వివరణనిచ్చే ప్రయత్నం బన్నీ చేశారని చెబుతున్నారు. అల్లు అర్జున్ నిజంగా షాక్ లో ఉన్నారని, ఆ క్రమంలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని అంటున్నారు.
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…