సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందడం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరిగా రియాక్ట్ కాలేదని, శ్రీ తేజ్ ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు కొందరు విమర్శించారు. కానీ, తనను ఆస్పత్రి దగ్గరకు వెళ్లొద్దని లాయర్లు చెప్పడంతోనే ఆగానని అల్లు అర్జున్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ రోజు దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట నాటి వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించి పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలు చూసిన బన్నీ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, శ్రీ తేజ్ గాయపడడం తలుచుకొని బన్నీ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
అయితే, ప్రెస్ మీట్ సందర్భంగా రేవతి మరణం, శ్రీ తేజ్ గాయపడడం గురించి మాట్లాడుతూ బన్నీ తన ఎమోషన్ ను వ్యక్తపరిచారని, కానీ, దానిని కొందరు అపార్థం చేసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. ఆ ఘటన అల్లు అర్జున్ ను ఎంతో బాధించిందని, కానీ, దానిని అర్థం చేసుకోకుండా కొందరు బన్నీని టార్గెట్ చేసి మాట్లాడుతుండడంతో వివరణనిచ్చే ప్రయత్నం బన్నీ చేశారని చెబుతున్నారు. అల్లు అర్జున్ నిజంగా షాక్ లో ఉన్నారని, ఆ క్రమంలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని అంటున్నారు.
This post was last modified on December 24, 2024 9:26 pm
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ…