అల్లు అర్జున్ను చిక్కడ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఆయనను రెండు విడతలుగా మంగళవారమే విచారించనున్నట్టు తెలిసింది. వాస్తవానికి విచారణకు ఆహ్వానించిన పోలీసులు.. ఇన్ని గంటలు.. అన్ని గంటలు అని పేర్కొనలేదు. ఉదయం 10 గంటల కు విచారణకు రావాలని మాత్రమే నోటీసులు ఇచ్చారు. దీంతో ఎలాంటి సందేహాలు.. వాయిదాలు కోరకుండానే అల్లు అర్జున్ విచారణకు వచ్చారు. ఆయన వెంట తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం సాగుతున్న విచారణ.. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి రెండుమూడు గంటలకే పరిమితం చేయాలని అనుకున్నా.. పరిస్థితి తీవ్రత.. ఉన్నతాధికారుల ఆదేశాలు నేపథ్యంలో డీసీపీ, ఏసీపీ స్తాయి నుంచి డీఐజీ స్థాయి వరకు విచారణ జరిపే అవకాశం ఉందని తెలిసింది. సాధారణ అంశాలతోపాటు.. లీగల్ అంశాలపైనా అర్జున్ను విచారించనున్నారు. ఈ క్రమంలో వారి తరఫు న్యాయవాది అశోక్రెడ్డి సిద్ధమయ్యారు.
మరోవైపు.. ఏం జరిగినా.. క్షణాల్లో కోర్టును ఆశ్రయించేలాగా కూడా.. అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. హైకోర్టు పరిధిలో అల్లు న్యాయవాదులు సిద్ధమయ్యారని తెలిసింది. మొత్తంగా నలుగురు న్యాయవాదులు హైకోర్టు వద్ద.. ఒకరు చిక్కడపల్లి పోలీసు స్టేషన్లోనూ ఉన్నారు. మరొకరు ఏం జరుగుతుందో దాని ప్రకారం తక్షణ స్పందన కోసం.. లైవ్లోనూ వేచి చూస్తున్నారు. మొత్తానికి విచారణ ప్రక్రియకు హాజరు అవుతూనే.. అన్ని అస్త్రశస్త్రాలు కూడా.. అల్లు అర్జున్ రెడీ చేసుకుని అడుగులు బయట పెట్టడం విశేషం.
భార్యతోడుగా!
చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరయిన అల్లు అర్జున్ తొలుత.. ఇంటి నుంచి బయలు దేరే ముందు.. సతీమణి తోడు రాగా.. కారు ఎక్కారు. ఆ సమయంలో భార్య మొహంలో ఉద్విగ్నత కనిపించింది. తర్వాత.. కుమార్తె తండ్రిని చూస్తూ.. చేయి ఊపింది.. అనంతరం.. ఇద్దరు అనుచరులతో అల్లు అర్జున్ కారు చిక్కడపల్లి వైపు బయలు దేరింది. వేరేకారులో ఆయన మామ, తండ్రి, న్యాయవాది, బన్నీ వాసు తదితరులు పోలీసు స్టేషన్కు వచ్చారు.
This post was last modified on December 24, 2024 12:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…