అల్లు అర్జున్ను చిక్కడ పల్లి పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఆయనను రెండు విడతలుగా మంగళవారమే విచారించనున్నట్టు తెలిసింది. వాస్తవానికి విచారణకు ఆహ్వానించిన పోలీసులు.. ఇన్ని గంటలు.. అన్ని గంటలు అని పేర్కొనలేదు. ఉదయం 10 గంటల కు విచారణకు రావాలని మాత్రమే నోటీసులు ఇచ్చారు. దీంతో ఎలాంటి సందేహాలు.. వాయిదాలు కోరకుండానే అల్లు అర్జున్ విచారణకు వచ్చారు. ఆయన వెంట తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.
ప్రస్తుతం సాగుతున్న విచారణ.. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి రెండుమూడు గంటలకే పరిమితం చేయాలని అనుకున్నా.. పరిస్థితి తీవ్రత.. ఉన్నతాధికారుల ఆదేశాలు నేపథ్యంలో డీసీపీ, ఏసీపీ స్తాయి నుంచి డీఐజీ స్థాయి వరకు విచారణ జరిపే అవకాశం ఉందని తెలిసింది. సాధారణ అంశాలతోపాటు.. లీగల్ అంశాలపైనా అర్జున్ను విచారించనున్నారు. ఈ క్రమంలో వారి తరఫు న్యాయవాది అశోక్రెడ్డి సిద్ధమయ్యారు.
మరోవైపు.. ఏం జరిగినా.. క్షణాల్లో కోర్టును ఆశ్రయించేలాగా కూడా.. అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. హైకోర్టు పరిధిలో అల్లు న్యాయవాదులు సిద్ధమయ్యారని తెలిసింది. మొత్తంగా నలుగురు న్యాయవాదులు హైకోర్టు వద్ద.. ఒకరు చిక్కడపల్లి పోలీసు స్టేషన్లోనూ ఉన్నారు. మరొకరు ఏం జరుగుతుందో దాని ప్రకారం తక్షణ స్పందన కోసం.. లైవ్లోనూ వేచి చూస్తున్నారు. మొత్తానికి విచారణ ప్రక్రియకు హాజరు అవుతూనే.. అన్ని అస్త్రశస్త్రాలు కూడా.. అల్లు అర్జున్ రెడీ చేసుకుని అడుగులు బయట పెట్టడం విశేషం.
భార్యతోడుగా!
చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరయిన అల్లు అర్జున్ తొలుత.. ఇంటి నుంచి బయలు దేరే ముందు.. సతీమణి తోడు రాగా.. కారు ఎక్కారు. ఆ సమయంలో భార్య మొహంలో ఉద్విగ్నత కనిపించింది. తర్వాత.. కుమార్తె తండ్రిని చూస్తూ.. చేయి ఊపింది.. అనంతరం.. ఇద్దరు అనుచరులతో అల్లు అర్జున్ కారు చిక్కడపల్లి వైపు బయలు దేరింది. వేరేకారులో ఆయన మామ, తండ్రి, న్యాయవాది, బన్నీ వాసు తదితరులు పోలీసు స్టేషన్కు వచ్చారు.
This post was last modified on December 24, 2024 12:46 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…