కొన్ని సరదాగా వినడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే అవి నిజమైతే కలిగే భయం ఎక్కువ కాబట్టి. నిజ జీవితమైనా వెండితెరకైనా రెండింటికి అది వర్తిస్తుంది. ఇటీవలే అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. యాంకరింగ్ లో భాగంగా యాంకర్ సుమ అతిథిగా వచ్చిన సుకుమార్ ని ఒక ప్రశ్న అడిగింది. జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారు అని. ఆయన ఠక్కున సినిమా అని చెప్పేయడంతో ఒక్కసారిగా పక్కనున్న రామ్ చరణ్ షాకుకు గురై వెంటనే సుకుమార్ ను ఆప్యాయంగా నిలువరిస్తూ మైకు తీసుకుని క్లారిటీ ఇచ్చేశాడు.
ఇలాగే సంవత్సరం నుంచి ఇదే మాట అంటూ భయపెడుతున్నారు, కానీ అలాంటిది ఏమి జరగదని హామీ ఇవ్వడంతో ఒక్కసారిగా సుమతో అక్కడ ఉన్న వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. పుష్ప 2 ది రూల్ లాంటి ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించి బాలీవుడ్ నెంబర్ వన్ మూవీని అందించిన డైరెక్టర్ గా రాజమౌళి తర్వాత ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది సుకుమార్ పేరే. మేకింగ్ పరంగా ఆలస్యం చేస్తారనే కామెంట్స్ ఆయన మీద ఉండొచ్చు గాక. కానీ అలా చేయడం వల్లే ఇంత క్వాలిటీ అవుట్ ఫుట్స్ ఇస్తున్నారని అనుకోవచ్చుగా. ఎందుకంటే పుష్ప లాంటి కమర్షియల్ బ్రాండ్ ని సృష్టించడానికి సుకుమార్ పడిన కష్టం అందరికీ తెలిసిందే.
బుచ్చిబాబుతో ప్యాన్ ఇండియా మూవీ అయ్యాక రామ్ చరణ్ చేయబోయేది సుకుమార్ తోనే. రంగస్థలం కాంబో మరోసారి రిపీట్ కానుండటంతో అంచనాలు మాములుగా లేవు. బ్యాక్ డ్రాప్, జానర్ ఇవేవి ఇంకా ఫైనల్ కాలేదు కానీ ప్రాధమికంగా స్టోరీ లైన్ మాత్రం ఓకే అయ్యిందని సమాచారం. జనవరి 10 న విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ పూర్తవ్వగానే చరణ్ ఆర్సి 16 తిరిగి కొనసాగిస్తాడు. సుకుమార్ చిత్రాన్ని 2025 వేసవిలో మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. మరి పుష్ప 3 ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎంత ఆలస్యమవుతుందనే దాన్ని బట్టి ఈ ప్రాజెక్టుల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు.
This post was last modified on December 24, 2024 11:20 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…