రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ‘పుష్ప-2’ ప్రిమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు ఉండవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం ఈ విషయంలో మరీ పట్టుదలకు పోదనే ఇండస్ట్రీ జనాలు ఆశిస్తున్నారు. త్వరలోనే సినీ పెద్దలు ప్రభుత్వ పెద్దల్ని కలిసి సమస్యకు పరిష్కారం కనుగొంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమా ‘డాకు మహారాజ్’ను ప్రొడ్యూస్ చేసిన సూర్యదేవర నాగవంశీ.. తమ చిత్రానికి తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మధ్య ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. ‘పుష్ప-2’కు కూడా అలాగే చేశారు.
మరి మీ చిత్రానికి కూడా అలాగే ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉంటాయా అని నాగవంశీని అడిగితే.. సంక్రాంతి సినిమాలు వేటికీ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉండకపోవచ్చని నాగవంశీ అన్నాడు. తమ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
మరి బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి ప్రకటించారు కదా అని అడిగితే.. నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన వచ్చాక ఏదో ఒకటి తేలుతుందని.. సంక్రాంతికి ఆయన సినిమా ‘గేమ్ చేంజర్’యే ముందు రిలీజ్ కాబోతోందని.. దానికి ఎలా ఉంటుందో తమ సినిమాకూ అంతే అని వ్యాఖ్యానించాడు నాగవంశీ.
ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ మిడ్ నైట్ షోలు వేయడం తప్పయిందని నాగవంశీ గతంలో వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’కు కూడా మిడ్ నైట్ షోలు ఉండకపోవచ్చు. తెల్లవారుజామున షోలే అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని బట్టే ఆ షోలు కూడా ఉంటాయి.
This post was last modified on December 23, 2024 6:06 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…