రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ‘పుష్ప-2’ ప్రిమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు ఉండవంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం ఈ విషయంలో మరీ పట్టుదలకు పోదనే ఇండస్ట్రీ జనాలు ఆశిస్తున్నారు. త్వరలోనే సినీ పెద్దలు ప్రభుత్వ పెద్దల్ని కలిసి సమస్యకు పరిష్కారం కనుగొంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమా ‘డాకు మహారాజ్’ను ప్రొడ్యూస్ చేసిన సూర్యదేవర నాగవంశీ.. తమ చిత్రానికి తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మధ్య ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. ‘పుష్ప-2’కు కూడా అలాగే చేశారు.
మరి మీ చిత్రానికి కూడా అలాగే ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉంటాయా అని నాగవంశీని అడిగితే.. సంక్రాంతి సినిమాలు వేటికీ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ ఉండకపోవచ్చని నాగవంశీ అన్నాడు. తమ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకు షోలు వేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
మరి బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి ప్రకటించారు కదా అని అడిగితే.. నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన వచ్చాక ఏదో ఒకటి తేలుతుందని.. సంక్రాంతికి ఆయన సినిమా ‘గేమ్ చేంజర్’యే ముందు రిలీజ్ కాబోతోందని.. దానికి ఎలా ఉంటుందో తమ సినిమాకూ అంతే అని వ్యాఖ్యానించాడు నాగవంశీ.
ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ మిడ్ నైట్ షోలు వేయడం తప్పయిందని నాగవంశీ గతంలో వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’కు కూడా మిడ్ నైట్ షోలు ఉండకపోవచ్చు. తెల్లవారుజామున షోలే అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని బట్టే ఆ షోలు కూడా ఉంటాయి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…