Movie News

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం తెలంగాణ అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సినిమా ఇండ‌స్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా.. అక్క‌డే ఉన్నార‌ని.. అందుకే తొక్కిస‌లాట జ‌రిగింద‌న్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన అల్లు అర్జున్‌.. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై మ‌రోసారి స్పందించారు. ఈ ఘ‌ట‌న కేవ‌లం ప్ర‌మాద‌మేన‌ని చెప్పారు. ఎవ‌రూ కావాల‌ని చేసింది కాద‌న్నారు.

రేవ‌తి అనే మ‌హిళ మ‌ర‌ణం బాధ‌క‌లిగించింద‌ని అర్జున్ చెప్పారు. బాలుడు శ్రీతేజ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు చెప్పారు. ఇక‌, తాను రోడ్ షో చేశాన‌న్న వ్యాఖ్య‌ల‌ను కూడా.. అల్లు అర్జున్ ఖండించారు. అది రోడ్ షో కాద‌ని.. కారు వెళ్తున్న క్ర‌మంలో ఆగిపోయింద‌ని.. దీంతో తాను అభిమానుల‌ను ప‌ల‌క‌రించాన‌ని చెప్పారు. ఇది దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. తెలుగు వారి ఖ్యాతిని పెంచేందుకే తాను సినిమాలు చేస్తున్నాన‌ని చెప్పారు. సినిమా పెద్ద హిట్ట‌యినా.. తాను 15 రోజులుగా ఇంట్లోనే కూర్చుని బాధ‌ప‌డుతున్నానని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు వినోదం పంచాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే సినిమాలు చేస్తున్న‌ట్టు చెప్పారు.

ప్ర‌భుత్వంతో వివాదాలు తాను కోరుకోవ‌డం లేద‌ని అల్లు అర్జున్ చెప్పారు. ఆ రోజు అనుమ‌తి లేకుండా.. వెళ్లాన‌ని అన‌డం స‌రికాద‌ని.. తాము పోలీసుల‌కు స‌మాచారం అందించిన త‌ర్వాతే హాల్ కు వెళ్లాన‌ని అర్జున్ వివ‌రించారు. తొక్కిస‌లాట వ్య‌వ‌హారం.. త‌న‌కు స్పాట్‌లో తెలియ‌లేద‌ని.. మ‌రుస‌టి రోజు మాత్ర‌మే తెలిసింద‌ని అర్జున్ చెప్పారు. అయితే.. ఈ విష‌యంపై కొందరు చేస్తున్న వ్యాఖ్య‌లు త‌న‌ను ఎంతో బాధ‌క‌లిగిస్తున్నాయ‌ని తెలిపారు. త‌న వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. జాతీయ మీడియా ముందు త‌న‌ను అప్ర‌తిష్ఠ‌పాల్జేస్తున్నార‌ని అర్జున్ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ లోనీ వ్యాఖ్యలు బాధించాయి.

బాలుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసి.. తాను ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామార్శించాల‌ని అనుకున్న‌ట్టు అర్జున్ చెప్పారు. అయితే.. పోలీసులే త‌న‌ను వ‌ద్ద‌ని చెప్పార‌ని వ్యాఖ్యానించారు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న అనుకోకుండా జ‌రిగింద‌ని.. దీనిలో ఎవ‌రి త‌ప్పు లేద‌న్నారు. తాను ఎవ‌రినీ త‌ప్పుబ‌ట్ట‌డం లేద‌న్నారు.

అసెంబ్లీ లో నాయకులు చేసిన వ్యాఖ్య‌లు త‌న‌ను బాధించాయ‌ని అర్జున్ చెప్పారు. విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని అనుకుని కూడా.. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. వాయిదా వేసుకున్న‌ట్టు అర్జున్ తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి అభిమానులే గాయ‌ప‌డితే.. తానుత‌ట్టుకోలేన‌ని.. అలాంటిది త‌న అభిమానుల‌కు ఏమైనాజ‌రిగితే ఎలా ఉంటాన‌ని ప్ర‌శ్నించారు. కాగా, ఈ మీడియా స‌మావేశంలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అర‌వింద్‌, వారి త‌ర‌ఫు న్యాయ‌వాది అశోక్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

This post was last modified on December 21, 2024 8:31 pm

Share

Recent Posts

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

48 minutes ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

1 hour ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

2 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

3 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

4 hours ago

బ్యాలెట్ పోరుపై వైసీపీ ఆశ‌లు ఫ‌లించేనా…?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి ఎన్నిక‌ల సంఘం కూడా…

4 hours ago