Movie News

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం తెలంగాణ అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సినిమా ఇండ‌స్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా.. అక్క‌డే ఉన్నార‌ని.. అందుకే తొక్కిస‌లాట జ‌రిగింద‌న్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన అల్లు అర్జున్‌.. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై మ‌రోసారి స్పందించారు. ఈ ఘ‌ట‌న కేవ‌లం ప్ర‌మాద‌మేన‌ని చెప్పారు. ఎవ‌రూ కావాల‌ని చేసింది కాద‌న్నారు.

రేవ‌తి అనే మ‌హిళ మ‌ర‌ణం బాధ‌క‌లిగించింద‌ని అర్జున్ చెప్పారు. బాలుడు శ్రీతేజ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు చెప్పారు. ఇక‌, తాను రోడ్ షో చేశాన‌న్న వ్యాఖ్య‌ల‌ను కూడా.. అల్లు అర్జున్ ఖండించారు. అది రోడ్ షో కాద‌ని.. కారు వెళ్తున్న క్ర‌మంలో ఆగిపోయింద‌ని.. దీంతో తాను అభిమానుల‌ను ప‌ల‌క‌రించాన‌ని చెప్పారు. ఇది దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. తెలుగు వారి ఖ్యాతిని పెంచేందుకే తాను సినిమాలు చేస్తున్నాన‌ని చెప్పారు. సినిమా పెద్ద హిట్ట‌యినా.. తాను 15 రోజులుగా ఇంట్లోనే కూర్చుని బాధ‌ప‌డుతున్నానని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు వినోదం పంచాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే సినిమాలు చేస్తున్న‌ట్టు చెప్పారు.

ప్ర‌భుత్వంతో వివాదాలు తాను కోరుకోవ‌డం లేద‌ని అల్లు అర్జున్ చెప్పారు. ఆ రోజు అనుమ‌తి లేకుండా.. వెళ్లాన‌ని అన‌డం స‌రికాద‌ని.. తాము పోలీసుల‌కు స‌మాచారం అందించిన త‌ర్వాతే హాల్ కు వెళ్లాన‌ని అర్జున్ వివ‌రించారు. తొక్కిస‌లాట వ్య‌వ‌హారం.. త‌న‌కు స్పాట్‌లో తెలియ‌లేద‌ని.. మ‌రుస‌టి రోజు మాత్ర‌మే తెలిసింద‌ని అర్జున్ చెప్పారు. అయితే.. ఈ విష‌యంపై కొందరు చేస్తున్న వ్యాఖ్య‌లు త‌న‌ను ఎంతో బాధ‌క‌లిగిస్తున్నాయ‌ని తెలిపారు. త‌న వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. జాతీయ మీడియా ముందు త‌న‌ను అప్ర‌తిష్ఠ‌పాల్జేస్తున్నార‌ని అర్జున్ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ లోనీ వ్యాఖ్యలు బాధించాయి.

బాలుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసి.. తాను ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామార్శించాల‌ని అనుకున్న‌ట్టు అర్జున్ చెప్పారు. అయితే.. పోలీసులే త‌న‌ను వ‌ద్ద‌ని చెప్పార‌ని వ్యాఖ్యానించారు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న అనుకోకుండా జ‌రిగింద‌ని.. దీనిలో ఎవ‌రి త‌ప్పు లేద‌న్నారు. తాను ఎవ‌రినీ త‌ప్పుబ‌ట్ట‌డం లేద‌న్నారు.

అసెంబ్లీ లో నాయకులు చేసిన వ్యాఖ్య‌లు త‌న‌ను బాధించాయ‌ని అర్జున్ చెప్పారు. విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని అనుకుని కూడా.. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. వాయిదా వేసుకున్న‌ట్టు అర్జున్ తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి అభిమానులే గాయ‌ప‌డితే.. తానుత‌ట్టుకోలేన‌ని.. అలాంటిది త‌న అభిమానుల‌కు ఏమైనాజ‌రిగితే ఎలా ఉంటాన‌ని ప్ర‌శ్నించారు. కాగా, ఈ మీడియా స‌మావేశంలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అర‌వింద్‌, వారి త‌ర‌ఫు న్యాయ‌వాది అశోక్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

This post was last modified on December 21, 2024 8:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

5 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

8 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

9 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

11 hours ago