తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు సామాన్యులను సైతం షాక్ కు గురి చేసింది. సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఒక మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు బ్రెయిన్ డెడ్ స్థితిలో ఆసుపత్రిలో పోరాడటాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో మరోసారి ప్రత్యక్షంగా అర్థమయ్యింది. అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి మరీ పరిశ్రమ ప్రముఖులు పరామర్శకు వెళ్లడం గురించి ముఖ్యమంత్రి సంధించిన ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేకపోయింది. ఇకపై టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టంగా తేల్చి చెప్పేశారు.
2025లో చాలా ప్యాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, తేజ సజ్జ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది. ఇప్పుడు హఠాత్తుగా బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లాంటి వెసులుబాట్లు లేవంటే వీటికి కలగబోయే నష్టం తీవ్రంగా కాదు కానీ భారీగానే ఉంటుంది. ఉదాహరణకు పుష్ప 2కి ఇచ్చిన పెంపు ఒక్క నైజాం నుంచే కొన్ని కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఎంతలేదన్నా ఆ మొత్తం పాతిక కోట్ల పైమాటేనని ఒక అంచనా. అలా రాబోయే సినిమాలకు అన్నీ కలిపి లెక్కేసుకుంటే వచ్చే ఫైనల్ ఫిగర్ షాక్ ఇవ్వడం ఖాయం.
సరే ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలంగాణలో మిడ్ నైట్ షోలు వేయకుండా కేవలం ఏపీలోనే వేస్తే టాక్ పరంగా అదో తలనెప్పి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇబ్బంది లేదు. అటుఇటు అయ్యిందంటే అంతే సంగతులు. ఇలా ఎన్నో సమీకరణాలు దీని వెనుక ఉంటాయి. పైగా అభిమానుల డిమాండ్లు మరో చిక్కు. రెండు చోట్ల ఒకేసారి వేయమని అడిగితే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఒకవేళ సంధ్య థియేటర్ ఘటనలో ఎవరూ చనిపోకపోతే ఈ డిస్కషన్ ఉండేది కాదు. కానీ దురదృష్టవశాత్తు అయ్యింది. భవిష్యత్తు గురించి వెంటనే అంచనాకు రాలేం కానీ ఇప్పుడప్పుడే పరిష్కారం దొరకదనేది వాస్తవం.
This post was last modified on December 21, 2024 5:38 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…