తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు సామాన్యులను సైతం షాక్ కు గురి చేసింది. సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఒక మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు బ్రెయిన్ డెడ్ స్థితిలో ఆసుపత్రిలో పోరాడటాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో మరోసారి ప్రత్యక్షంగా అర్థమయ్యింది. అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి మరీ పరిశ్రమ ప్రముఖులు పరామర్శకు వెళ్లడం గురించి ముఖ్యమంత్రి సంధించిన ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేకపోయింది. ఇకపై టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టంగా తేల్చి చెప్పేశారు.
2025లో చాలా ప్యాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, తేజ సజ్జ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది. ఇప్పుడు హఠాత్తుగా బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు లాంటి వెసులుబాట్లు లేవంటే వీటికి కలగబోయే నష్టం తీవ్రంగా కాదు కానీ భారీగానే ఉంటుంది. ఉదాహరణకు పుష్ప 2కి ఇచ్చిన పెంపు ఒక్క నైజాం నుంచే కొన్ని కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చింది. ఎంతలేదన్నా ఆ మొత్తం పాతిక కోట్ల పైమాటేనని ఒక అంచనా. అలా రాబోయే సినిమాలకు అన్నీ కలిపి లెక్కేసుకుంటే వచ్చే ఫైనల్ ఫిగర్ షాక్ ఇవ్వడం ఖాయం.
సరే ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలంగాణలో మిడ్ నైట్ షోలు వేయకుండా కేవలం ఏపీలోనే వేస్తే టాక్ పరంగా అదో తలనెప్పి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇబ్బంది లేదు. అటుఇటు అయ్యిందంటే అంతే సంగతులు. ఇలా ఎన్నో సమీకరణాలు దీని వెనుక ఉంటాయి. పైగా అభిమానుల డిమాండ్లు మరో చిక్కు. రెండు చోట్ల ఒకేసారి వేయమని అడిగితే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఒకవేళ సంధ్య థియేటర్ ఘటనలో ఎవరూ చనిపోకపోతే ఈ డిస్కషన్ ఉండేది కాదు. కానీ దురదృష్టవశాత్తు అయ్యింది. భవిష్యత్తు గురించి వెంటనే అంచనాకు రాలేం కానీ ఇప్పుడప్పుడే పరిష్కారం దొరకదనేది వాస్తవం.
This post was last modified on December 21, 2024 5:38 pm
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…