నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత తరహాలో కామెంట్స్ వినిపించాయి. విమర్శకులు, విశ్లేషకులు ఇదేం సినిమా అంటూ పెదవి విరిచారు. ఒకటి నుంచి రెండు మధ్యలో రేటింగ్ ఇవ్వడానికే కిందా మీద పడ్డారు. మధ్యలో లేచొచ్చిన సాధారణ ప్రేక్షకులున్నారు. చివరి దాకా చూసి వావ్ అన్న ఆడియన్సూ కనిపిస్తున్నారు. ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఉప్పి చెప్పినట్టు డీ కోడ్ చేసుకుంటే తప్ప కంటెంట్ అర్థం కాదన్న మాట నిజమే అయ్యింది. అయితే గమనించాల్సిన అసలు విచిత్రం మరొకటి ఉంది.
ఈ వెరైటీ టాక్ వింటూ కూడా యుఐ థియేటర్లకు జనం బాగానే వెళ్తున్న వైనం బుకింగ్ ట్రెండ్స్ లో కనిపిస్తోంది. సాయంత్రం షోలకు మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. తెలుగు వెర్షన్ వాషౌట్ అవుతుందనుకుంటే ఊహించని విధంగా డీసెంట్ పికప్ ఉండటం అసలు ట్విస్ట్. పోనీ టాక్ ఫుల్ పాజిటివ్ గా మారిందా అంటే అదేం లేదు. ఇది గుర్తించిన ఉపేంద్ర వెంటనే రంగంలోకి దిగి పబ్లిసిటీ పెంచబోతున్నట్టు సమాచారం. ఆంధ్రతో మొదలుపెట్టి సక్సెస్ టూర్లు చేస్తారట. బచ్చల మల్లి, విడుదల పార్ట్ 2లు సైతం సోసో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాన్ని యుఐకి అనుకూలంగా మార్చడానికి ట్రై చేస్తున్నారు.
ఒకవేళ ఇదే సినిమాని ఇంకో హీరో, దర్శకుడు తీసి ఉంటే రెండో రోజే థియేటర్ల నుంచి తీసేసేవారనే మాటలను కొట్టిపారేయలేం. ఇక్కడ పని చేస్తోంది ఉపేంద్ర బ్రాండ్ ఒకటే. ఆయన మేకింగ్, నటన మీద అపారమైన గౌరవంతో టికెట్లు కొంటున్న వాళ్లే ఎక్కువ. బుక్ మై షోలో కన్నడ వెర్షన్ కు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర గతంలో చేసిన ఉప్పీ 2 కంటే ఇది మంచి ఫలితం అందుకుంటుందా అంటే ఇప్పుడే చెప్పలేం. వర్తమాన సామజిక పరిస్థితుల మీద సెటైరిక్ మూవీ ఇవ్వాలని ప్రయత్నం చేసిన ఉపేంద్ర ఇంకొంచెం సీరియస్ గా ట్రై చేసి ఉంటే నిజంగా క్లాసిక్ వచ్చేదేమో. ఛాన్స్ మిస్.
This post was last modified on December 21, 2024 11:10 am
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…