థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా చివరిదాకా కూర్చుంటాం. దీనికి పివిఆర్ ఐనాక్స్ కొత్త ప్లాన్ వేసింది. ఒకవేళ మీరు వాళ్ళ మల్టీప్లెక్సు నుంచి మధ్యలో వెళ్లిపోవాలనుకుంటే అప్పటిదాకా చూసిన సమయాన్ని లెక్క వేసి మిగిలింది రీ ఫండ్ చేస్తారు. కాకపోతే ముందు టికెట్ కొనే సమయంలో అసలు రేట్ కన్నా పది శాతం అదనంగా కట్టి తీసుకోవాలి. అంటే ఉదాహరణకు 400 రూపాయలు టికెట్ అనుకుంటే 40 ఎక్స్ ట్రా పెట్టాలి. మొత్తం చూస్తే ఏం వెనక్కు ఇవ్వరు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రయోగిస్తున్నారు.
ఇదేదో బాగుందని సంబరపడేందుకు లేదు. ఎందుకంటే నగరాల్లో ముందస్తుగా సమయాన్ని ప్లాన్ వేసుకుని టికెట్లు బుక్ చేసుకుని థియేటర్ దాకా వెళ్లినోళ్లు గుడ్డో బ్యాడో చివరి దాకా ఉంటారు. పైగా అదనంగా డబ్బు కట్టాలి కాబట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవడమని రిస్క్ చేయరు. అలాంటప్పుడు ఇది వర్కౌట్ కాదు. ముఖ్యంగా ఫ్యామిలీస్ అసలు చేయరు. సింగల్ గా వెళ్లే మూవీ లవర్స్ కు కొంత ప్రయోజనం ఉంటుంది. ఇదంతా ఆలోచించే ప్రేక్షకుల మనస్తత్వాన్ని కాచి వడబోసి పివిఆర్ ఐనాక్స్ ఈ పథకాన్ని రూపొందించింది. ఎంతమేరకు సక్సెస్ అవుతుందో కొద్దిరోజుల దాకా వేచి చూడాలి.
జనాన్ని థియేటర్లకు రప్పించడానికి మల్టీప్లెక్సులు పడుతున్న తిప్పలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. మాములుగా పెద్ద హీరోల సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండదు కానీ మీడియం లేదా చిన్న రేంజ్ చిత్రాలకు ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. అలాంటి వాటికి ఈ రీఫండ్ స్కీం ఏదో బాగుంటుంది. అంటే ఇంటర్వెల్ కు లేచొస్తే సగం వాపస్ వస్తుంది. ఢిల్లీలో సక్సెస్ అయితే మిగిలిన చోట్ల అమలు చేయాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ముందు ముందు ఇలాంటి వినూత్న ఆలోచనలు చేస్తే తప్ప మనుగడ కష్టమైన తరుణంలో వీటికి పబ్లిక్ ఎలా స్పందిస్తారో చూడాలి.
భోళా శంకర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ని మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ దాదాపుగా పూడ్చేసింది. అయితే ఒకప్పటిలా…
పెద్దిలో కొత్త సీన్లు కలుపుతారని, కొంత ఎడిటింగ్ జరుగుతుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది. ఇవాళ జరిగిన ప్రెస్…
గీత రచయిత అనంత శ్రీరామ్ కు కోపం వచ్చేసింది. ఘాటుగా కాకపోయినా మాములుగా మాట్లాడుతూనే లేనిపోని విమర్శలకు తావు ఇచ్చినట్టయ్యింది.…
ఎంత సంపాదించినా.. అందులోంచి ఎంతో కొంత లేని వారికి ఇవ్వడంలో ఉండే సంతోషమే వేరు. ఈ ఆనందాన్ని అందరూ అనుభవించరు,…
స్టార్ హీరో హీరోయిన్లు నటించకపోయినా.. పేరున్న దర్శకుడు తీయకపోయినా.. స్టన్నింగ్ విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి అంచనాలు పెంచిన సినిమా..…
తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ హీరోగా ఎదిగిన ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 90వ దశకంలో జగదేక…